S Janaki: పెళ్లి.. పిల్లలు.. వేల పాటలు.. ఎస్.జానకి జీవితంలో తెలియని విశేషాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Janaki: గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23న శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు ఎస్.జానకి జన్మించారు. 19 ఏళ్ల వయసులో తన మామయ్య సూచన మేరకు చెన్నై చేరుకున్న జానకి, ప్రముఖ ఏవీఎం (AVM) స్టూడియోలో గాన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె – వి.రామ్ప్రసాద్ను వివాహం చేసుకుని చెన్నైలో స్థిరపడ్డారు. ఈ దంపతులకు మురళీకృష్ణ అనే కుమారుడు ఉన్నారు. భరతనాట్యంలో ప్రావీణ్యం పొందిన మురళీకృష్ణ తెలుగు, మలయాళ చిత్రాల్లో కూడా నటించారు. తెలుగులో వినాయకుడు, మల్లెపువ్వు చిత్రాల ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఆయన 2026 జనవరి 22న తన 65 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అంతకుముందే తన తండ్రి రామ్ప్రసాద్ కూడా 1990లలో మరణించారు.
జానకి సినీ ప్రస్థానం ఏవీఎం
జానకి సినీ ప్రస్థానం ఏవీఎం (AVM) స్టూడియోలో గాయనిగా ప్రారంభమైంది. 1957లో టి.చలపతిరావు సంగీత దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘విధియిన్ విలాయట్టు’ ద్వారా ఆమె సినీ రంగంలోకి అడుగుపెట్టారు. అనంతరం ‘ఎమ్మెల్యే’ చిత్రంలోని పాటతో తెలుగు ప్రేక్షకులకు చేరువై, తన ప్రత్యేక గాత్రంతో గుర్తింపు పొందారు. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు పలు భారతీయ భాషల్లో వేలాది పాటలు పాడి భారతీయ సినీ సంగీతంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని సుస్థిరం చేసుకున్నారు. నేపథ్య గాయనిగానే కాకుండా పాటల రచయిత్రి, కర్ణాటక సంగీత విద్వాంసురాలు, సంగీత దర్శకురాలిగానూ జానకి తన ప్రతిభను చాటుకున్నారు. ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన ‘మౌన పోరాటం’ చిత్రానికి సంగీతం అందించి, భానుమతి, లీల తర్వాత సంగీత దర్శకురాలిగా గుర్తింపు పొందిన అరుదైన మహిళల్లో ఒకరిగా నిలిచారు. శ్రీకృష్ణుడు, షిర్డీ సాయిబాబాపై అపార భక్తి కలిగిన ఆమె భక్తి గీతాల ఆల్బమ్లను కూడా రిలీజ్ చేశారు.
Also Read
- Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
- Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
- Prabhas : ప్రభాస్- ఓం రౌత్ .. అంతా ఒట్టిదే
- Nayyi Navelli: దసరాకు యామీ గౌతమ్ 'నయ్యి నవెల్లి'
తన గాత్ర వైవిధ్యం జానకిని ఇతర గాయనుల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టింది. ఒకే పాటలో చిన్నారి, వృద్ధురాలు, యువతి వంటి విభిన్న స్వరాలను పలికిస్తూ మిమిక్రీని తన గానంలో మేళవించిన ఆమె ప్రతిభ ప్రేక్షకులను విస్మయానికి గురిచేసింది. భావోద్వేగం, ప్రేమ, ఆవేదన, అల్లరి, భక్తి.. ఏ భావాన్నైనా తన స్వరంతో అద్భుతంగా ఆవిష్కరించగల అరుదైన గాయని ఆమె. సుమారు 55 ఏళ్లపాటు సాగిన తన గాన ప్రస్థానంలో ఐదు నుంచి ఆరు తరాల కథానాయికలకు నేపథ్య గానం చేసిన ఎస్.జానకి, వేలాది పాటలతో సంగీతాభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీ, బెంగాలీ, ఒడియా, సంస్కృతం, తుళు, సింహళం, జపనీస్, జర్మన్ తదితర భాషలపై పట్టు సాధించి ఆయా భాషల్లో పాటలు పాడారు. ఆమె, ఘంటసాల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.జె. యేసుదాస్, పి.సుశీల, వాణి జయరాం, కె.ఎస్.చిత్ర, ఇళయరాజా వంటి సంగీత దిగ్గజాలతో కలిసి ఎన్నో చిరస్మరణీయ గీతాలను ఆలపించారు. ఆమె గాత్రం భారతీయ సంగీత ప్రపంచంలో ఎప్పటికీ చెరగని మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ఈ రోజు ఆమె మన మధ్య లేకపోయినా తన గాత్రంతో జనాల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారు.
తాజావార్తలు
-
Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
-
India vs Pakistan: పాకిస్థాన్ను చిత్తు చేసిన భారత్.. హాకీ వరల్డ్ కప్లో టాప్-8కి దూసుకెళ్లిన టీమిండియా
-
Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
-
WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!