Veerababu Burugadda
Author- NTV Telugu-
Axar Patel: టీ20ల్లో జీరో.. వన్డేల్లో హీరో.. మార్పుకు కారణం ఏంటో చెప్పిన అక్షర్ పటేల్..
ఇంగ్లాండ్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో టీమిండియా ఘనవిజయం సాధించడంలో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించారు. అయితే.. దీనికి కొన్ని రోజుల ముందు జరిగిన టీ20 సిరీస్లో మాత్రం ఆయన ఘోరంగా విఫలమయ్యారు. కేవలం 19 పరుగులు మాత్రమే చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం వరకు జీరోలా కనిపించిన ఆటగాడు, వన్డే మ్యాచ్ ముగిసేసరికి ఒక్కసారిగా హీరోగా ఎలా మారారనే ప్రశ్న అందరిలోనూ మెదిలింది. దీనికి స్వయంగా అక్షర్ పటేలే మ్యాచ్ […] -
Shubman Gill: కోహ్లీ, రోహిత్ శర్మను వెనక్కి నెట్టేసిన శుభ్మన్ గిల్.. ఒక్క విజయంతో మరింత ముందుకు..
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) బుధవారం ప్రకటించిన పురుషుల వన్డే ర్యాంకింగ్స్లో భారత ఆటగాళ్ల స్థానాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ వన్డేల్లో నంబర్ వన్ స్థానానికి మరింత చేరువయ్యాడు. ఇంగ్లాండ్తో బర్మింగ్హామ్లో జరిగిన మొదటి వన్డేలో 80 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడిన గిల్కు 12 రేటింగ్ పాయింట్లు లభించాయి. ప్రస్తుతం న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ (814 పాయింట్లు) మొదటి స్థానంలో ఉండగా, గిల్ రెండో స్థానంలో కేవలం 11 […] -
Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
రైల్వే ప్రయాణికులు ఇకపై ‘రైల్ వన్’, ఇతర డిజిటల్ యాప్ల ద్వారా బుక్ చేసుకున్న ఒరిజినల్ డిజిటల్ టిక్కెట్ను మాత్రమే ప్రయాణ సమయంలో చూపించాల్సి ఉంటుందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. వాట్సాప్ స్క్రీన్షాట్లు, ఫోటోలు, పీడీఎఫ్ ప్రతులు లేదా ఇతర మెసేజింగ్ యాప్ల ద్వారా పంపిన టిక్కెట్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రయాణ ఆధారాలుగా అంగీకరించబోమని తెలిపింది. అంతేకాకుండా.. టిక్కెట్ బుక్ చేయడానికి ఉపయోగించిన అదే మొబైల్ ఫోన్లోనే ఆ డిజిటల్ టిక్కెట్ ఉండాలనే నిబంధనను తప్పనిసరి చేశారు. […] -
Smriti Mandhana: ప్రపంచ క్రికెట్లోనే సరికొత్త రికార్డు.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..
భారత మహిళా క్రికెట్ స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్లో ఒక అరుదైన మైలురాయిని అధిగమించింది. ఇంగ్లాండ్లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో బరిలోకి దిగడం ద్వారా ఆమె తన కెరీర్లో 300వ అంతర్జాతీయ మ్యాచ్ మైలురాయిని అందుకుంది. లార్డ్స్ మైదానంలో తొలిసారిగా జరుగుతున్న ఈ చారిత్రాత్మక మహిళా టెస్టులో మంధాన అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు.. ఈ మైలురాయిని చేరుకోవడం ద్వారా స్మృతి మంధాన మహిళా […] -
AP Government: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఈ నెల 13న ప్రారంభం..
తూర్పుగోదావరి జిల్లాలోని చారిత్రాత్మక ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్ల ఏర్పాటుకు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. బ్యారేజీ భద్రత, ఆధునీకరణలో భాగంగా ఈనెల 13వ తేదీ సోమవారం నాడు కొత్త గేట్ల ఏర్పాటు పనులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇందుకోసం సుమారు 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించగా, దీని ద్వారా బ్యారేజీకి సంబంధించిన మొత్తం 117 కొత్త గేట్ల ఏర్పాటు పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ముందుగా […] -
Surya Kumar Yadav: కళ్లముందే విరాట్, రోహిత్ అవుటైనా తగ్గని సూర్య.. 55 బంతుల్లో 117 పరుగులతో వీరవిహారం..
భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 2022 జూలై 10న ఇంగ్లాండ్పై ఆడిన ఒక అద్భుతమైన, సుడిగాలి ఇన్నింగ్స్ను ముంబై ఇండియన్స్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా గుర్తుచేసుకుంది. నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో జరిగిన ఆ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 215 పరుగుల భారీ స్కోరు సాధించి, భారత్కు 216 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ భారీ ఛేదనలో టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ […] -
Shubman Gill: సచిన్, కోహ్లీ సరసన శుభ్మన్ గిల్.. భారత నాలుగో కెప్టెన్గా రికార్డు..
భారత టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్కు ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీని రాయల్ బాక్స్ నుండి వీక్షించేందుకు ప్రత్యేక ఆహ్వానం లభించింది. దీనితో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల తర్వాత ఈ అరుదైన గౌరవం దక్కించుకున్న నాల్గవ భారతీయ కెప్టెన్గా గిల్ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న 26 ఏళ్ల గిల్.. రాబోయే వన్డే సిరీస్ కోసం సిద్ధమవుతూనే, ఇటీవల బ్రిటన్లోని సిల్వర్స్టోన్ సర్క్యూట్లో జరిగిన బ్రిటిష్ గ్రాండ్ ప్రి […] -
Team India: భారత టీ20 జట్టులో మార్పులు.. ఐదో టీ20కి సంజూ శాంసన్ ఎంట్రీ..? టీం నుంచి ఇద్దరు అవుట్..
టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత సూర్యకుమార్ యాదవ్ నుండి భారత టి20 జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్కు ఇప్పటివరకు కెప్టెన్గా ఆశించిన విజయాలు దక్కలేదు. ఐర్లాండ్ చేతిలో 0-2తో సిరీస్ ఓడిపోయిన భారత్, ఆ తర్వాత ఇంగ్లాండ్తో జరిగిన మొదటి మ్యాచ్ వర్షార్పణం కాగా, ఆపై వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయి 5 మ్యాచ్ల సిరీస్లో 0-3తో వెనుకబడింది. ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్ కీపర్ సబా కరీమ్ మాట్లాడుతూ.. అయ్యర్ […] -
Ind Vs Eng: ప్రతీ మ్యాచ్లో కొత్త హీరోలు పుట్టుకొస్తున్నారు.. టీమిండియా సభ్యుల నుంచి ఇలా..
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో సరికొత్తగా ప్రయాణాన్ని ప్రారంభించిన భారత టీ20 జట్టు ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటోంది. ఐపీఎల్ 2026లో అద్భుతంగా రాణించిన ఆటగాళ్లతో కూడిన ఈ జట్టు, ఇక్కడ పిచ్లపై బంతి కొద్దిగా మూవ్మెంట్ చూపించినా ఇంగ్లాండ్ పేసర్లు, స్పిన్నర్ల ధాటికి తలవొగ్గుతోంది. ఐర్లాండ్ చేతిలో ఓటమి తర్వాత, ఇప్పుడు ఇంగ్లాండ్ చేతిలో కూడా వరుసగా మ్యాచ్లు ఓడిపోయి టీమిండియా సిరీస్ను సైతం కోల్పోయింది. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి మ్యాచ్ వర్షం […] -
Tilak Varma: తిలక్ వర్మను ఎందుకు ఆడిస్తున్నారు.. టీమిండియా వరుస ఓటములకు ప్రధాన కారణం ఇదే..
ఇటీవల ఐర్లాండ్, ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్న సిరీస్లలో తిలక్ వర్మ ఫామ్ పూర్తిగా దెబ్బతింది. అతని బ్యాట్ నుండి పరుగులు రాకపోవడమే కాకుండా, స్ట్రైక్ రేట్ కూడా బాగా పడిపోయింది. ఐర్లాండ్ సిరీస్ లో భాగంగా 2 మ్యాచ్ల్లో కేవలం 74 పరుగులు మాత్రమే చేశాడు. మొదటి మ్యాచ్లో 19 (21 బంతుల్లో), రెండో మ్యాచ్లో 55 (46 బంతుల్లో) పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్ సిరీస్ లో భాగంగా.. 5 మ్యాచ్ల ఈ సిరీస్లో ఇప్పటివరకు ఆడిన 4 […]
తాజావార్తలు
-
Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
-
Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
-
Sowcar Janaki Health: సీనియర్ నటి ‘షావుకారు’ జానకికి తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్పై చికిత్స!
-
India-Pakistan Tensions: పాక్ హైకమిషన్ వద్ద భద్రతా బారికేడ్లు తొలగించిన భారత్.. J&K వ్యాఖ్యల వేళ కీలక పరిణామం
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
ట్రెండింగ్
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!