AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 1వ తేదీ ఉదయం నుంచే ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక పెన్షన్ల లబ్ధిదారులకు మరోసారి తీపి కబురు అందించింది. జూన్ నెలకు సంబంధించిన ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఇందుకోసం మొత్తం రూ. 2,728 కోట్లను కేటాయించింది. ఎప్పటిలాగే వచ్చే నెల మొదటి తారీఖున, అంటే జూన్ 1వ తేదీ సోమవారం ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఉదయం నుంచే సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి నేరుగా నగదును చేతికి అందించనున్నారు.
ఈ జూన్ నెలలో ఏపీ వ్యాప్తంగా మొత్తం 62,34,445 మంది లబ్ధిదారులకు ఈ సామాజిక భద్రతా పెన్షన్లు అందనున్నాయి. ఈసారి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భర్త లేదా భార్య చనిపోయిన వారికి ఇచ్చే ‘స్పౌజ్ పెన్షన్లను’ కొత్తగా మరో 5,606 మందికి మంజూరు చేసింది. ఈ కొత్త స్పౌజ్ పెన్షన్ల పంపిణీ కోసం ప్రత్యేకంగా రూ. 2.24 కోట్లను ప్రభుత్వం అదనంగా విడుదల చేసింది. దీనివల్ల ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద ఊరట లభించనుంది.
Also Read
- Vegetable Chips: బయట ఫుడ్స్కి గుడ్బై.. ఇంట్లోనే చుక్క నూనె లేకుండా క్రిస్పీ, హెల్తీ వెజిటెబుల్ చిప్స్ రెడీ..
- Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
- Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
- Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తోంది. అందులో భాగంగానే ప్రతి నెలా ఒకటో తేదీనే లబ్ధిదారుల చేతికి పెన్షన్ డబ్బులు అందేలా పక్కాగా ప్రణాళికలు అమలు చేస్తోంది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం ఈ పెన్షన్ల కోసమే ఏకంగా రూ. 65,886.57 కోట్లను ఖర్చు చేయడం విశేషం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రతి నెలా ఒకటో తేదీనే నిధులు విడుదల చేస్తూ వస్తోంది. జూన్ 1న సోమవారం తెల్లవారుజాము నుంచే ఈ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది కాబట్టి లబ్ధిదారులు ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉండి తమ పెన్షన్ డబ్బులను అందుకోవచ్చని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Vegetable Chips: బయట ఫుడ్స్కి గుడ్బై.. ఇంట్లోనే చుక్క నూనె లేకుండా క్రిస్పీ, హెల్తీ వెజిటెబుల్ చిప్స్ రెడీ..
-
ISRO Recruitment: ఇంజనీరింగ్ అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్.. ఇస్రోలో జాబ్స్కి నోటిఫికేషన్!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
-
Hollywood Box Office: ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ vs ‘ది ఒడిస్సీ’.. షేక్ అవుతున్న బాక్సాఫీస్.. కలెక్షన్స్ లో ఎవరిది పైచేయి?
ట్రెండింగ్
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!