India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, ఐర్లాండ్ మధ్య జరగబోయే రెండు మ్యాచ్ల టీ-20 సిరీస్కు టీమిండియా సర్వసిద్ధమైంది. ఈ సిరీస్ ద్వారా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మొదటిసారి భారత టీ-20 జట్టుకు కెప్టెన్గా వ్యవహరించబోతున్నారు. ఇరు జట్ల మధ్య తొలి టీ-20 మ్యాచ్ జూన్ 26న, రెండో మ్యాచ్ జూన్ 28న సాయంత్రం వేళల్లో జరగనున్నాయి. భారత్, ఐర్లాండ్ దేశాల మధ్య జరగబోయే నాలుగో ద్వైపాక్షిక టీ-20 సిరీస్ ఇది. విశేషం ఏంటంటే.. ఐర్లాండ్తో జరిగిన ప్రతి టీ-20 సిరీస్లోనూ భారత్ తరపున వేర్వేరు ఆటగాళ్లు కెప్టెన్లుగా వ్యవహరించగా, ఇప్పుడు నాలుగో సిరీస్లోనూ సరికొత్త కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు చేపట్టారు.
భారత్, ఐర్లాండ్ జట్లు టీ-20 అంతర్జాతీయ క్రికెట్లో మొదటిసారి 2009 టీ-20 ప్రపంచకప్లో తలపడ్డాయి. అప్పుడు భారత జట్టుకు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్గా ఉన్నారు. ఆ తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం 2018లో విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్, ఐర్లాండ్ మధ్య తొలిసారి టీ-20 సిరీస్ జరిగింది. ఆపై 2022 సిరీస్లో హార్దిక్ పాండ్యా, 2023 సిరీస్లో జస్ప్రీత్ బుమ్రా టీమిండియాను నడిపించారు. ఇక 2009 తర్వాత ఈ రెండు జట్లు ప్రపంచకప్ వేదికగా మళ్లీ 2024లో తలపడ్డాయి, అప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ కాలంలో ఐర్లాండ్తో భారత్ ఎలాంటి మ్యాచ్ ఆడలేదు. ఇప్పుడు 2024 తర్వాత మళ్లీ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ విధంగా చూస్తే కేవలం ఐర్లాండ్పైనే భారత్ తరపున ఆరుగురు వేర్వేరు కెప్టెన్లు వ్యవహరించడం గమనార్హం.
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
భారత టీ-20 క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు మొత్తం 15 మంది కెప్టెన్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే వీరిలో ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ మాత్రమే పూర్తిస్థాయి క్రమం తప్పకుండా కెప్టెన్లుగా కొనసాగారు. మిగిలిన కెప్టెన్ల సంఖ్య పెరగడానికి ఇలాంటి చిన్న చిన్న ద్వైపాక్షిక సిరీస్లే కారణం. భారత్కు ప్రాతినిధ్యం వహించిన 15 మంది కెప్టెన్లలో ఆరుగురు ఐర్లాండ్పై కెప్టెన్లుగా జట్టును నడిపించారు. ఆ వివరాలు.. ఎంఎస్ ధోని (2009 ప్రపంచకప్), విరాట్ కోహ్లీ (2018 సిరీస్), హార్దిక్ పాండ్యా (2022 సిరీస్), జస్ప్రీత్ బుమ్రా (2023 సిరీస్), రోహిత్ శర్మ (2024 ప్రపంచకప్) మరియు శ్రేయస్ అయ్యర్ (2026 ప్రస్తుత సిరీస్).
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?