India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, ఐర్లాండ్ మధ్య జరగబోయే రెండు మ్యాచ్ల టీ-20 సిరీస్కు టీమిండియా సర్వసిద్ధమైంది. ఈ సిరీస్ ద్వారా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మొదటిసారి భారత టీ-20 జట్టుకు కెప్టెన్గా వ్యవహరించబోతున్నారు. ఇరు జట్ల మధ్య తొలి టీ-20 మ్యాచ్ జూన్ 26న, రెండో మ్యాచ్ జూన్ 28న సాయంత్రం వేళల్లో జరగనున్నాయి. భారత్, ఐర్లాండ్ దేశాల మధ్య జరగబోయే నాలుగో ద్వైపాక్షిక టీ-20 సిరీస్ ఇది. విశేషం ఏంటంటే.. ఐర్లాండ్తో జరిగిన ప్రతి టీ-20 సిరీస్లోనూ భారత్ తరపున వేర్వేరు ఆటగాళ్లు కెప్టెన్లుగా వ్యవహరించగా, ఇప్పుడు నాలుగో సిరీస్లోనూ సరికొత్త కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు చేపట్టారు.
భారత్, ఐర్లాండ్ జట్లు టీ-20 అంతర్జాతీయ క్రికెట్లో మొదటిసారి 2009 టీ-20 ప్రపంచకప్లో తలపడ్డాయి. అప్పుడు భారత జట్టుకు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్గా ఉన్నారు. ఆ తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం 2018లో విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్, ఐర్లాండ్ మధ్య తొలిసారి టీ-20 సిరీస్ జరిగింది. ఆపై 2022 సిరీస్లో హార్దిక్ పాండ్యా, 2023 సిరీస్లో జస్ప్రీత్ బుమ్రా టీమిండియాను నడిపించారు. ఇక 2009 తర్వాత ఈ రెండు జట్లు ప్రపంచకప్ వేదికగా మళ్లీ 2024లో తలపడ్డాయి, అప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ కాలంలో ఐర్లాండ్తో భారత్ ఎలాంటి మ్యాచ్ ఆడలేదు. ఇప్పుడు 2024 తర్వాత మళ్లీ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ విధంగా చూస్తే కేవలం ఐర్లాండ్పైనే భారత్ తరపున ఆరుగురు వేర్వేరు కెప్టెన్లు వ్యవహరించడం గమనార్హం.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
భారత టీ-20 క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు మొత్తం 15 మంది కెప్టెన్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే వీరిలో ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ మాత్రమే పూర్తిస్థాయి క్రమం తప్పకుండా కెప్టెన్లుగా కొనసాగారు. మిగిలిన కెప్టెన్ల సంఖ్య పెరగడానికి ఇలాంటి చిన్న చిన్న ద్వైపాక్షిక సిరీస్లే కారణం. భారత్కు ప్రాతినిధ్యం వహించిన 15 మంది కెప్టెన్లలో ఆరుగురు ఐర్లాండ్పై కెప్టెన్లుగా జట్టును నడిపించారు. ఆ వివరాలు.. ఎంఎస్ ధోని (2009 ప్రపంచకప్), విరాట్ కోహ్లీ (2018 సిరీస్), హార్దిక్ పాండ్యా (2022 సిరీస్), జస్ప్రీత్ బుమ్రా (2023 సిరీస్), రోహిత్ శర్మ (2024 ప్రపంచకప్) మరియు శ్రేయస్ అయ్యర్ (2026 ప్రస్తుత సిరీస్).
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!