LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అందించింది. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా గతంలో విధించిన ఆంక్షలన్నింటినీ తొలగించి.. నాన్-డొమెస్టిక్ ప్యాక్డ్ ఎల్పీజీ సరఫరాను సంక్షోభానికి ముందున్న స్థాయికి పునరుద్ధరించింది. అలాగే.. ఆ సమయంలో పూర్తిగా నిలిపివేసిన బల్క్ ఎల్పీజీ సరఫరాను కూడా 50 శాతం మేర పునరుద్ధరించడం ద్వారా వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు పెద్ద ఉపశమనం లభించింది. ఎల్పీజీ సరఫరా పరిస్థితి మెరుగుపడటంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
గతంలో సంక్షోభం తలెత్తినప్పుడు దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని పెంచడానికి, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం పెట్రోకెమికల్, ఇతర డౌన్స్ట్రీమ్ పరిశ్రమలకు ఉపయోగించే C3-C4 స్ట్రీమ్స్ను పూర్తిగా ఎల్పీజీ ఉత్పత్తికే మళ్లించారు. అయితే ప్రస్తుతం దేశీయంగా ఉత్పత్తి మెరుగవ్వడం, దిగుమతి చేసుకునే ఎల్పీజీ కార్గోలు అందుబాటులో ఉండటాన్ని గమనించిన ప్రభుత్వం, ఎల్పీజీ పూల్కు C3-C4 స్ట్రీమ్స్ మళ్లింపును తగ్గించాలని నిర్ణయించింది. ఈ అదనపు C3-C4 స్ట్రీమ్స్ను పెట్రోకెమికల్ మరియు ఇతర కీలక రంగాలకు కేటాయిస్తారు. అయితే దేశీయ ఎల్పీజీ లభ్యతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, మొత్తం దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు కనీసం 40 TMT (వెయ్యి మెట్రిక్ టన్నులు) కంటే తగ్గకుండా చూస్తారు. ఏ సంస్థకు ఎంత కేటాయించాలనే బాధ్యతను ‘సెంటర్ ఆఫ్ హై టెక్నాలజీ’కి అప్పగించారు. దీని ప్రకారం ఉత్పత్తి పెరిగి గ్యాస్ సరఫరా పెరగనుంది.
Also Read
- Nita Ambani: దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళగా నీతా అంబానీ.. ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో తొలి స్థానం
- Cyber Fraud: ఓటీపీ చెప్పకపోయినా డబ్బు పోతుందా? సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఇలా మోసం చేస్తున్నారు
- PhonePe ITR filing: కేవలం రూ.24తోనే ITR ఫైల్ చేయొచ్చు.. PhonePe, JioFinance కొత్త ట్యాక్స్ ఫైలింగ్ సేవలు ప్రారంభం
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
గ్లోబల్ సప్లై చైన్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా దేశీయ వినియోగదారులకు నిరంతరాయంగా గ్యాస్ అందించడానికే ప్రభుత్వం వాణిజ్య ఎల్పీజీపై తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల సమన్వయంతో సరఫరా స్థిరంగా సాగింది. భవిష్యత్తు ప్రణాళికల కోసం వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారుల సమగ్ర డేటాను, ఒక ఉమ్మడి డేటాబేస్ను నిర్వహించాలని OMCsను ప్రభుత్వం ఆదేశించింది.
మరోవైపు.. పర్యావరణహిత పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్టివిటీని విస్తరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పటికే పీఎన్జీకి మారిన వారు అందులోనే కొనసాగుతారు, నెట్వర్క్ అందుబాటులో ఉన్న మిగిలిన వారిని కూడా క్రమంగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా పీఎన్జీ వైపు మళ్లిస్తారు. ఈ నూతన ఏర్పాట్లను సజావుగా అమలు చేయాలని కోరుతూ కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు. దేశ ఇంధన భద్రతను కాపాడుతూనే, పరిశ్రమల అవసరాలు తీర్చడం.. స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని పెంచాలనే కారణంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
Samsung Galaxy Tab S12+: సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ S12+ ఫస్ట్ లుక్.. ఫ్రంట్ డిజైన్ వెల్లడి, త్వరలో లాంచ్?
-
ICC T20 Ranking: 1,605 రోజుల సామ్రాజ్యం కుప్పకూలింది.. నంబర్ 1 ర్యాంక్ను కోల్పోయిన భారత్!
-
Nita Ambani: దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళగా నీతా అంబానీ.. ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో తొలి స్థానం
-
The Odyssey: కటింగ్ చాయ్ కోసం ముంబై వీధుల్లో హాలీవుడ్ స్టార్లు.. వైరల్గా మారిన వీడియో
-
Nandamuri Mokshagna : బాలయ్య వారసుడి కోసం సందీప్ రెడ్డి వంగా?
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!