Vaibhav Sooryavanshi: వైభవ్ క్రేజ్ మాములుగా లేదుగా.. క్షణాల్లో అమ్ముడుపోయిన టికెట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్ ప్రపంచంలో 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఏకంగా 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఈ యువ సంచలనం, ఇటీవల భారత్-ఎ తరఫున కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఇప్పుడు భారత్-ఐర్లాండ్ సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసేందుకు సిద్ధమవడంతో అతడి క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది.
టికెట్లకు భారీ డిమాండ్ – క్షణాల్లో ఖాళీ
నేడు బెల్ఫాస్ట్లోని స్టార్మాంట్ మైదానంలో జరగబోయే తొలి టీ20 మ్యాచ్లో వైభవ్ అరంగేట్రం (Debut) చేయబోతున్నాడనే వార్తతో అభిమానులు ఎగబడ్డారు. ఐర్లాండ్ క్రికెట్ బోర్డు చైర్మన్ బ్రియాన్ తెలిపిన వివరాల ప్రకారం.. వైభవ్ ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు సాధారణం కంటే మూడు రెట్ల డిమాండ్ వచ్చింది. దీనితో మ్యాచ్ టికెట్లన్నీ హాట్ కేకుల్లా క్షణాల్లో అమ్ముడయ్యాయి. వైభవ్ చారిత్రాత్మక క్షణాన్ని వీక్షించేందుకు అతని తల్లిదండ్రులు కూడా ఇప్పటికే బెల్ఫాస్ట్ చేరుకున్నారు.
Also Read
- Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
వేదిక ఎంపికపై తీవ్ర విమర్శలు..
అయితే, ఇంతటి భారీ క్రేజ్ ఉన్న మ్యాచ్ను కేవలం 4,200 నుండి 6,000 వరకు మాత్రమే సీటింగ్ సామర్థ్యం ఉన్న చిన్నదైన బెల్ఫాస్ట్ మైదానంలో నిర్వహించడంపై క్రికెట్ అభిమానుల నుండి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
డబ్లిన్ వేదిక ఎందుకు కాలేదు?: గతంలో భారత్ ఆడిన మ్యాచ్లన్నీ దాదాపు 12,000 సామర్థ్యం కలిగిన డబ్లిన్లోని మలాహైడ్ స్టేడియంలో జరిగాయి. కానీ ఈసారి అక్కడ మ్యూజిక్ కాన్సెర్టులు ఉండటం వల్ల వేదికను బెల్ఫాస్ట్కు మార్చాల్సి వచ్చింది. ఇటీవల బెల్ఫాస్ట్ నగరంలో స్థానికంగా కొన్ని అల్లర్లు జరగడంతో భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే క్రికెట్ ఐర్లాండ్ అంతా సవ్యంగానే ఉందని, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సచిన్ టెండూల్కర్ 36 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టి, అత్యంత పిన్న వయస్కుడిగా భారత జట్టులో చోటు సంపాదించిన వైభవ్ సూర్యవంశీ మ్యాచ్పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని టీమిండియా నేడు ఐర్లాండ్తో తలపడనుండగా, అందరి కళ్లూ ఈ 15 ఏళ్ల యువ కిరటంపైనే ఉన్నాయి.
తాజావార్తలు
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Fauji: ఇన్స్టాగ్రామ్ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్తో ఆల్టైమ్ రికార్డు!
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
-
Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?