Suresh Maddala
Author- NTV Telugu-
Zomato: సహ వ్యవస్థాపకురాలు ఆకృతి చోప్రా రాజీనామా.. కారణమిదే..!
జొమాటోతో ఉన్న 13 సంవత్సరాల అనుబంధాన్ని అక్రితి చోప్రా తెగతెంపులు చేసుకున్నారు. అక్రితి చోప్రా జొమాటో చీఫ్ పీపుల్ ఆఫీసర్గా ఉన్నారు. అంతేకాకుండా ఆమె జొమాటో సహ వ్యవస్థాపకురాలుగా కూడా ఉన్నారు. 13 సంవత్సరాల తర్వాత జొమాటోకు గుడ్బై చెప్పారు. సెప్టెంబర్ 27, 2024 నుంచి తన రిజైన్ అమలులోకి వస్తుందని అక్రితి పేర్కొన్నారు. సీఈవో దీపిందర్ గోయల్కి కృతజ్ఞతలు తెలుపారు -
Bihar: ప్రభుత్వ పాఠశాలలో అశ్లీల డ్యాన్స్లు.. మండిపడుతున్న ప్రజలు
బీహార్లోని ఓ ప్రభుత్వ స్కూల్ క్లబ్గా మారిపోయింది. పాఠశాలను బార్గా మార్చేసి అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మార్చేశారు. పాఠశాలలోనే మద్యం తాగుతూ, బార్ డ్యాన్సర్లతో అశ్లీల డ్యాన్స్లు చేయిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. సహర్సా జిల్లా జలాయి పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. -
Netanyahu: ఐరాస వేదికపై ఇజ్రాయెల్ ప్రధాని కీలక వ్యాఖ్యలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తల వేళ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ.. తమ లక్ష్యాలు పూర్తయ్యే వరకు హమాస్, హిజ్బుల్లా మీద పోరాటం ఆగదని అంతర్జాతీయ వేదికగా నెతన్యాహు స్పష్టం చేశారు. హమాస్ సగం బలగాలను అంతం చేశామని.. వారు లొంగిపోకపోతే పూర్తి విజయం సాధించే వరకు పోరాడతామని పేర్కొన్నారు. -
Delhi: ఆప్కు షాక్.. ఎంసీడీ స్టాండింగ్ కమిటీ సీటు బీజేపీ కైవసం
బీజేపీకి చెందిన సుందర్ సింగ్ తన్వర్ ఢిల్లీ మున్సిపల్ స్టాండింగ్ కమిటీ సీటును కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి సుందర్ సింగ్ 115 ఓట్లు గెలుచుకోగా.. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థికి ఒక్క ఓటు కూడా రాలేదు. ఆప్ అధిష్ఠానం నిర్ణయం మేరకు ఆ పార్టీ కౌన్సిలర్లు ఈ ఎన్నికలను బహిష్కరించారు. -
Maldives president: అక్టోబర్లో భారత్లో ముయిజ్జు పర్యటన.. ప్రధాని మోడీతో చర్చలు
మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు అక్టోబర్ రెండో వారంలో భారత్లో పర్యటిస్తున్నారు. మాల్దీవుల అధికారిక వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఆయన ప్రధాని మోడీతో చర్చించనున్నట్లుగా వెల్లడించాయి. -
Delhi: ప్రధాని మోడీ, సోనియాతో సీఎం స్టాలిన్ భేటీ.. టూర్ విశేషాలు ఇవే!
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోడీని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. తమిళనాడు మెట్రో ప్రాజెక్ట్లకు అందించాల్సిన నిధులు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు నిధులు విడుదల చేశారని.. తమిళనాడు నిధులు కూడా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. -
Israel-Iran: ఇజ్రాయెల్తో స్నేహం వద్దు.. ముస్లిం దేశాలకు ఇరాన్ విజ్ఞప్తి
పశ్చిమాసియాలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొన్నటిదాకా హమాస్ లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం చేసింది. ఇప్పుడు హిజ్బుల్లా టార్గెట్గా లెబనాన్పై ఇజ్రాయెల్ సైన్యం యుద్ధం చేస్తోంది. శత్రువులతో చేతులు కలిపే దేశాలపై ఇజ్రాయెల్ దూకుడుగా పోతోంది. ఇప్పటికే లెబనాన్పై ఇజ్రాయెల్ భీకరదాడులు చేస్తోంది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆయా దేశాలు తమ పౌరులు లెబనాన్ను విడిచిపెట్టాలని ఆదేశాలు ఇచ్చాయి. -
Tamil Nadu: ఏటీఎం దోపిడీ ముఠాపై ఎన్కౌంటర్.. ఒకరు హతం.. నలుగురు అరెస్ట్
ఏటీఎం దోపిడీ ముఠాపై తమిళనాడు పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ ఘటనలో ఒక దొంగ మరణించగా.. మరో దొంగకు గాయాలయ్యాయి. మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
Stock market: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ శుక్రవారం ఉదయం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. ముగింపులో మాత్రం సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
UP: యూపీలో ఘోరం.. క్షుద్ర పూజలకు విద్యార్థిని బలి ఇచ్చిన యాజమాన్యం
ఉత్తరప్రదేశ్లో ఘోరం జరిగింది. సభ్యసమాజం తలదించుకునే అమానుష ఘటన హాథ్రస్లో వెలుగుచూసింది. స్కూల్ యాజమాన్యమే ఒక విద్యార్థిని పొట్టనపెట్టుకుంది. తమ స్వార్థం కోసం ఏకంగా ఒక విద్యార్థిని బలి ఇచ్చింది. ఈ ఘటన భారతీయులను కలిచి వేస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?