Sankranti Rush : సంక్రాంతికి రైళ్లలో సీట్ల కష్టాలు.. ఇప్పుడెలా..!
- సంక్రాంతి ముందే పెరిగిన రైళ్ల రద్దీ
- తక్కువ ధరలతో రైలు ప్రయాణానికే మొగ్గు
- రద్దైన కీలక రైళ్లతో ప్రయాణికుల కష్టాలు
- ప్రత్యేక రైళ్లు నడపాలంటూ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sankranti Rush : సాధారణంగా సంక్రాంతి పండుగకు ఏపీలో ఉండే సందడి అంతా ఇంతా కాదు. మూడు రోజుల పాటు కుటుంబ సభ్యులతో కలిసి సొంతూళ్లలో పండుగను ఘనంగా జరుపుకోవడానికి హైదరాబాద్ లాంటి నగరాల్లో స్థిరపడిన లక్షలాది మంది ప్రజలు సిద్ధమవుతుంటారు. అయితే, పండుగకు ఇంకా నెల రోజుల కంటే ఎక్కువ సమయం మిగిలి ఉన్నప్పటికీ, సొంతూళ్లకు వెళ్లాలనుకునే నగరవాసుల ప్రయాణ కష్టాలు మాత్రం ఇప్పటికే తారస్థాయికి చేరుకున్నాయి.
ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సు ఛార్జీలతో పోలిస్తే రైలు టిక్కెట్ ధరలు చాలా తక్కువగా ఉండటం వలన, రైళ్లలో ప్రయాణించడానికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని, చాలా మంది నగరవాసులు సుమారు రెండు నెలల ముందుగానే తమ ప్రయాణ టిక్కెట్లను రిజర్వేషన్ చేసుకున్నారు. ఫలితంగా, పండుగకు ముందు, పండుగ సమయంలో ప్రయాణించే ముఖ్యమైన రైళ్లలో దాదాపుగా సీట్లన్నీ నిండిపోయాయి. ఇప్పుడు చివరి నిమిషంలో టిక్కెట్లు దొరకని పరిస్థితి ఏర్పడటంతో, ఎవరైనా టిక్కెట్లను రద్దు చేసుకుంటే తమకు దొరుకుతాయేమో అనే ఒకే ఒక ఆశాభావంతో వేలాది మంది ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.
Also Read
- CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
- OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
- OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
- KTR : పదవుల్లో ఉన్న వారికంటే ప్రజల బలమే గొప్పది.. జెన్-జీకి కేటీఆర్ సెల్యూట్
రైలు ప్రయాణికులకు ప్రస్తుతం ఉన్న ఇబ్బందులు మరింత పెరగడానికి రద్దీకి అనుగుణంగా రైళ్లు లేకపోవడం ఒక ముఖ్య కారణం. ముఖ్యంగా కరోనా సమయంలో రద్దు చేయబడిన కాచిగూడ-టాటానగర్ రైలును నేటికీ తిరిగి పునరుద్ధరించకపోవడంపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ రైలు కాచిగూడ నుంచి గుంటూరు, విజయవాడ, ఏలూరు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస వంటి తీర ప్రాంతాల మీదుగా టాటానగర్కు వెళ్లేది. నగరవాసుల నుంచి ఈ రైలుకు చాలా ఎక్కువ డిమాండ్ ఉండేది. అదే విధంగా, గతంలో ప్రత్యేకంగా నడిపిన కాచిగూడ-కాకినాడ రైలును కూడా నిలిపివేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు, రద్దీని తగ్గించేందుకు వీలుగా, తక్షణమే రద్దు చేసిన టాటానగర్, కాకినాడ రైళ్లను పునరుద్ధరించాలని, మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపాలని ప్రయాణికులు రైల్వే అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
Akanda 2 :’అఖండ 2’కి అడ్డంకి.. ఆది సాయికుమార్ ‘శంబాల’కు గోల్డెన్ ఛాన్స్?
తాజావార్తలు
-
Namo Namo Ji Shankara: యూట్యూబ్ ను షేక్ చేసిన శివయ్య పాట.. 8 ఏళ్లైనా అదే జోష్.. 50 కోట్ల వ్యూస్తో రికార్డు!
-
Amit Shah: పదవి కంటే దేశం, విద్యార్థులే ముఖ్యమని మరోసారి నిరూపించాం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై అమిత్ షా స్పందన
-
Rajinikanth: ఆత్మకథతో మరో సంచలనం.. రజనీకాంత్ బయోపిక్ ప్లాన్ నిజమేనా?
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Anahat Singh: భారత స్క్వాష్లో చరిత్ర సృష్టించిన అనాహత్ సింగ్.. వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ టైటిల్ కైవసం
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!