Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Union Minister Kishan Reddy Laid The Foundation Stone Of Komuravelli Railway Station

Kishan Reddy: మోడీ చొరవతోనే కొమురవెల్లి రైల్వేస్టేషన్ నిర్మాణం

Published Date :February 15, 2024 , 8:07 pm
By Suresh Maddala
Kishan Reddy: మోడీ చొరవతోనే కొమురవెల్లి రైల్వేస్టేషన్ నిర్మాణం
  • Follow Us :
  • google news
  • dailyhunt

కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం మల్లన్న పాదాల చెంత రైల్వే స్టేషన్ నిర్మించాలని ప్రధాని మోడీ (PM Modi) ఆదేశించారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) తెలిపారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ఏర్పాటుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. రైల్వే స్టేషన్ నిర్మాణానికి సహకరించిన రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కి ధన్యవాదాలు తెలిపారు. ‘‘కొమురవెల్లి కొండ ప్రాంతం కాబట్టి చుట్టు ప్రక్కల ఏటవాలుగా ఉండటం వల్ల స్టేషన్ నిర్మాణానికి అనుకూలంగా లేదని గతంలో నివేదిక ఇచ్చారు. ప్రధానమంత్రిని చాలాసార్లు కలిసి కొమురవెల్లి మల్లన్న స్వామి విశిష్టత వివరించాను. వెంటనే మోడీ.. రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌కి రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం మోడీ కృషితో ఈరోజు రైల్వేస్టేషన్ నిర్మాణానికి భూమిపూజ చేసుకున్నాం.’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.

యూపీఏ హయాంలో వివక్ష..
‘‘గత యూపీఏ పాలనలో తెలంగాణ రైల్వేల విషయంలో చాలా వివక్ష చూపించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైల్వేల అభివృద్ధి కోసం అనేక లైన్ల నిర్మాణాలు చేపట్టారు. సుమారు 40 రైల్వే స్టేషన్లను ఆధునీకరణ చేస్తున్నాం.
రూ.720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, రూ.350 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్, రూ.450 కోట్లతో కాచిగూడ రైల్వే స్టేషన్, కొత్తగా చర్లపల్లి రైల్వే టర్మినల్ నిర్మాణం చేసుకుంటున్నాం. గత యూపీఏ పాలనలో తెలంగాణ రైల్వే బడ్టెట్ రూ.251 కోట్లు… నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు రూ.6వేల కోట్లకు పెంచారు. గత తొమ్మిదేళ్లలో రూ. 30 వేల కోట్ల రూపాయలు తెలంగాణ రైల్వే కోసం ఖర్చు పెట్టారు.’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం..
‘‘మొట్టమెదటిసారిగా మెదక్ రైల్వే స్టేషన్‌ను నేనే ప్రారంభించాను. సిద్దిపేట రైల్వేలైన్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ రైల్వే లైన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. రూ.26 వేల కోట్లతో నిర్మిస్తున్న రీజనల్ రింగ్ రోడ్‌ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అంకితం చేయబోతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ల్యాండ్ కోసం రూపాయి ఖర్చు పెట్టకుండా నిర్లక్ష్యం చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తే తొందరలోనే రీజినల్ రింగ్ రోడ్ పూర్తవుతుంది. రింగ్ రోడ్ పూర్తయిన తర్వాత 8, 9 జిల్లాలను కలిపే రింగ్ రైల్వే లైన్‌ను కూడా ఏర్పాటు చేస్తాం.’’ అని వెల్లడించారు.

ఫ్రీ వైఫై..
‘‘సిద్దిపేట-మనోహరబాద్ రైల్వే లైన్ ద్వారా రైతుల ఉత్పత్తులను సరఫరా చేస్తాం. కొమురవెల్లి రైల్వే స్టేషన్ నుంచి దేవాలయం వరకు పక్కా రోడ్డు నిర్మాణం చేయబోతున్నాం. టికెట్ బుకింగ్ కౌంటర్, వెయిటింగ్ హాల్ నిర్మిస్తాం. ఫ్రీ వైఫై కూడా అందిస్తాం. మల్లిఖార్జున స్వామి పాదాల చెంత అత్యంత ఆధునికంగా రైల్వే స్టేషన్ నిర్మించుకుంటున్నాం.’’ అని కిషన్‌రెడ్డి చెప్పుకొచ్చారు.

కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పూజలు చేశారు.

 

#WATCH | Telangana | Union Minister and Telangana BJP chief G. Kishan Reddy, Madya Pradesh CM Mohan Yadav and BJP MP K Laxman offered prayers at Komuravelli Mallikarjuna Swamy Temple at Komaravelli Village in Siddipet district today. pic.twitter.com/ThArnQmMWm

— ANI (@ANI) February 15, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • foundation stone
  • komuravelli
  • Railway Station
  • telangana
  • Union Minister Kishan Reddy

తాజావార్తలు

  • #Gopichand33: మ్యాచో స్టార్ గోపీచంద్ 33వ సినిమా అప్‌డేట్..

  • PM Modi: ఏకమవ్వాలి.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరుతూ ఎంపీలకు ప్రధాని మోడీ లేఖ

  • Asha Bhosle : మూగబోయిన గాన గంధర్వం.. లెజెండరీ గాయని ఆశా భోస్లే కన్నుమూత

  • SBI ATM: ఎస్‌బీఐ ఏటీఎంలలో భారీగా నగదు గల్లంతు.. ఏకంగా రూ.కోటి 20 లక్షలు

  • NTRNeel : విలన్‌గా బాలీవుడ్ స్టార్.. కానీ లుక్ మాత్రం..?

ట్రెండింగ్‌

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions