Jairam Ramesh: ఫరూఖ్ అబ్దుల్లా నిర్ణయంపై జైరాం రమేష్ ఏమన్నారంటే..!
సార్వత్రిక ఎన్నికల ముందు ఇండియా కూటమికి (India Bloc) దెబ్బ మీద దెబ్బలు తగలుతున్నాయి. ఇప్పటికే కూటమిలోని పార్టీలు ఎవరి దారి వారిదే అన్నట్టుగా సొంత నిర్ణయాలతో ముందుకు పోతున్నాయి. ఇక బీహార్లో అయితే ఇండియా కూటమి నుంచి జేడీయూ అధినేత నితీష్కుమార్ బయటకు వెళ్లిపోయి ఎన్డీఏతో జత కట్టారు. మరికొన్ని పార్టీలు తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ, ఆప్ ఒంటరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించేశాయి. ఇప్పుడు ఈ కోవలోకి మరో పార్టీ వచ్చి చేరింది.
ఇండియా కూటమిలో కీలక మద్దతుదారుగా ఉన్న జమ్మూ కాశ్మీర్ నేత ఫరూఖ్ అబ్దుల్లాకి (Farooq Abdullah) చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ (National Conference) కూడా ఒంటరి పోరుకు సిద్ధమైంది. వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా.. మంచి విజయాన్ని సాధిస్తామని ఫరూఖ్ అబ్దుల్లా స్పష్టం చేశారు.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ఇకపోతే గత నెలలో ఫరూఖ్ అబ్దుల్లా సీట్ల షేరింగ్పై ఏకాభిప్రాయం కుదరకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మనం దేశాన్ని రక్షించాలంటే.. విభేదాలను ప్రక్కన పెట్టి దేశం గురించి ఆలోచించాలన్నారు. కానీ ఇంతలోనే ఆయన షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.
జైరాం రమేష్…
ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ (Jairam Ramesh) స్పందించారు. అబ్దుల్లాతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ప్రతిపక్షానికి వారి స్వంత పరిమితులు ఉంటాయని పేర్కొన్నారు. ఇండియా కూటమిలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కూడా ఒక భాగమని గుర్తుచేశారు. కలిసి చర్చించుకుని ముందుకు సాగుతామని జైరాం రమేష్ స్పష్టం చేశారు.
మోడీ సర్కార్ను (PM Modi) ఎదుర్కొనేందుకు విపక్ష పార్టీలన్నీ ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. కానీ సార్వత్రిక ఎన్నికల ముందు మాత్రం ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా ముందుకు సాగుతున్నారు. ఓట్లు చీలకూడదన్న భావనతో కూటమి ఏర్పాటు చేశారు గానీ.. ఆ దిశగా మాత్రం కూటమి శైలి ఉండడం లేదు. మరీ ఎన్నికల సమయానికైనా సర్దుకుంటుందా? లేదంటే ఇలానే ముందుకు సాగుతుందో వేచి చూడాలి.
#WATCH | Bihar: On the Supreme Court's verdict on the Electoral Bond scheme, Congress MP Jairam Ramesh says, "This judgement is like a storm. Through this, the SC has proved that the Narendra Modi government is a 'suit-boot-loot-jhooth' government. The electoral bond scheme was… pic.twitter.com/IgjV3LiVi5
— ANI (@ANI) February 15, 2024
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో