Revanth Reddy: విద్యావ్యవస్థకు కొత్త రూపురేఖలు తీసుకొస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలోనే గ్రూప్-1 పరీక్షను నిర్వహించబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గురుకుల ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
ఉద్యోగ నియామకాల విషయంలో పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వహించిందని రేవంత్రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం నియామకాలు చేపడుతున్నట్లు తెలిపారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీలో కూడా నియామకాలు చేపట్టాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
Also Read
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- Rahul Gandhi: 152 సార్లు నీట్ పేపర్ లీకైతే ఒక్కరికీ శిక్ష పడలేదు.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం పని చేస్తుంటే.. మామా అల్లుళ్లు (కేసీఆర్, హరీశ్రావు) మమ్మల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారని చెప్పుకొచ్చారు. నువ్వు రాజీనామా చెయ్ తాను చేసి చూపిస్తానంటూ హరీశ్రావు అంటున్నారన్నారు. హరీష్ రావును చూస్తుంటే మరో ఔరంగజేబులా కనిపిస్తున్నారని.. అధికారం కోసం సొంత వాళ్లపైనే కర్కశంగా ప్రవర్తించిన చరిత్ర ఔరంగజేబుదని గుర్తుచేశారు. పదేళ్లు మంత్రిగా ఉండి హరీశ్రావు ఏం చేశారు? అని సీఎం నిలదీశారు.
మేడిగడ్డపై చర్చకు అసెంబ్లీకి రమ్మంటే రాకుండా బీఆర్ఎస్ నేతలు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఏం ద్రోహం చేశారో ఇప్పటికైనా కేసీఆర్ తెలుసుకోవాలని సూచించారు. 3,650 రోజులు అధికారంలో ఉండి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 70 రోజుల్లో 25 వేల ఉద్యోగాల నియామకాలు చేపట్టామని.. ఇది మీ కళ్లకు కనిపించడం లేదా? అని రేవంత్రెడ్డి అడిగారు.
బీఆర్ఎస్ పాలనలో తండాలు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న 6,450 సింగిల్ టీచర్ పాఠశాలలు మూసేశారని తెలిపారు. పేదలకు విద్యను దూరం చేయాలనే కుట్రతోనే గత ప్రభుత్వం పాఠశాలలు మూసేసిందని ఆరోపించారు. త్వరలో మెగా డీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టి పేదలకు విద్య అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే గురుకుల పాఠశాలలన్నీ ఒకే గొడుకు కిందకు తీసుకొస్తామని ప్రకటించారు. 20 ఎకరాల్లో ఒకే క్యాంపస్లో అన్ని రకాల గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. కొడంగల్లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నామని.. ఈ మోడల్ను అన్ని నియోజకవర్గాల్లో ఆచరణలోకి తీసుకొస్తామని వెల్లడించారు. అన్ని నియోజకవర్గాల్లో దీనికి కావాల్సిన స్థలాలను సేకరించాలని అధికారులకు ఆదేశిస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్చుక్ లేఖ..
-
Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
-
Toxic: ‘టాక్సిక్’లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
-
Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
-
Anupama – Dhruv Vikram: మోస్ట్ వైలెంట్ బ్రేకప్.. అసలు ఇద్దరూ ఎందుకు విడిపోయారు?
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!