Kasuri – Masood: జైషే అగ్ర కమాండర్ల ‘రహస్య సమావేశం’.. భారత్పై భారీ కుట్రకు ప్లాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kasuri – Masood: పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు మరోసారి భారతదేశంపై పెద్ద కుట్రకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. భద్రతా సంస్థలకు ఉగ్రవాద సంస్థల రహస్య సమావేశం గురించి సమాచారం అందడంతో తాజాగా హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఇటి) డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి శనివారం పాకిస్థాన్లోని బహవల్పూర్లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు.
READ ALSO: Polar Loop: పోలార్ లూప్ స్క్రీన్-ఫ్రీ ఫిట్నెస్ ట్రాకర్ రిలీజ్.. 24/7 హెల్త్ ట్రాకింగ్.. ఇంత ధరనా!
Also Read
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
వాస్తవానికి బహవల్పూర్ను జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) చీఫ్ మసూద్ అజార్ బలమైన స్థావరంగా చెబుతుంటారు. కసూరి తరచుగా బహవల్పూర్ను సందర్శిస్తూ జైష్ చీఫ్ మసూద్ అజార్తో రహస్యంగా సమావేశమవుతాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. పహల్గామ్ దాడికి ముందు కూడా కసూరి బహవల్పూర్ను సందర్శించినట్లు సమాచారం. అక్కడ లష్కర్ – జైష్ మధ్య ఉమ్మడి ప్రణాళికకు సంబంధించి చర్చలు జరిగాయని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. తాజాగా కసూరి బహవల్పూర్లో పర్యటించడంతో కచ్చితంగా మసూద్ అజార్తో సమావేశం అవుతాడని, ఈ సమావేశంలో భారతదేశానికి వ్యతిరేకంగా కొత్త ఉగ్రవాద కుట్రకు ప్లాన్ చేయవచ్చని భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి.
బహవల్పూర్లో ఈరోజు కసూరి హాజరైన కార్యక్రమానికి “సీరత్-ఎ-నబీ (స) సహీహ్ బుఖారీ” అనే పేరు పెట్టారు. ఈ కార్యక్రమం జామియా ఉమ్ అబ్దుల్ అజీజ్, తౌహీద్ చౌక్, అహ్మద్పూర్ తూర్పు, బహవల్పూర్లో జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా జిహాదీలు పాల్గొన్నట్లు సమాచారం, ఇది భవిష్యత్తులో ఉగ్రవాద కార్యకలాపాలలో వారి ప్రమేయాన్ని సూచిస్తుందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. రెండు ప్రధాన ఉగ్రవాద సంస్థల అగ్ర కమాండర్ల మధ్య జరిగిన ఈ సమావేశం భారత భద్రతా సంస్థలకు ఒక మేల్కొలుపు వంటిదని విశ్లేషకులు పేర్కొన్నారు. భారతదేశంపై జరిగే ఏదైనా కుట్రను సకాలంలో తిప్పికొట్టడానికి భద్రతా దళాలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
READ ALSO: Roman Gofman: ప్రపంచాన్ని కుదిపే నియామకం.. మోసాద్కు కొత్త చీఫ్
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..