Kasuri – Masood: జైషే అగ్ర కమాండర్ల ‘రహస్య సమావేశం’.. భారత్పై భారీ కుట్రకు ప్లాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kasuri – Masood: పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు మరోసారి భారతదేశంపై పెద్ద కుట్రకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. భద్రతా సంస్థలకు ఉగ్రవాద సంస్థల రహస్య సమావేశం గురించి సమాచారం అందడంతో తాజాగా హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఇటి) డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి శనివారం పాకిస్థాన్లోని బహవల్పూర్లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు.
READ ALSO: Polar Loop: పోలార్ లూప్ స్క్రీన్-ఫ్రీ ఫిట్నెస్ ట్రాకర్ రిలీజ్.. 24/7 హెల్త్ ట్రాకింగ్.. ఇంత ధరనా!
Also Read
- Gurugram Rain: గంట వర్షానికి గురుగ్రామ్ అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్థం
- India vs Afghanistan: భారత్తో పోరుకు ఆఫ్ఘనిస్తాన్ సై.. జట్టులోకి ప్రమాదకర పేసర్ రీఎంట్రీ
- Sugar Prices: చక్కెర ధరలపై గుడ్న్యూస్.. దిగిరానున్న ధరలు
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
వాస్తవానికి బహవల్పూర్ను జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) చీఫ్ మసూద్ అజార్ బలమైన స్థావరంగా చెబుతుంటారు. కసూరి తరచుగా బహవల్పూర్ను సందర్శిస్తూ జైష్ చీఫ్ మసూద్ అజార్తో రహస్యంగా సమావేశమవుతాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. పహల్గామ్ దాడికి ముందు కూడా కసూరి బహవల్పూర్ను సందర్శించినట్లు సమాచారం. అక్కడ లష్కర్ – జైష్ మధ్య ఉమ్మడి ప్రణాళికకు సంబంధించి చర్చలు జరిగాయని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. తాజాగా కసూరి బహవల్పూర్లో పర్యటించడంతో కచ్చితంగా మసూద్ అజార్తో సమావేశం అవుతాడని, ఈ సమావేశంలో భారతదేశానికి వ్యతిరేకంగా కొత్త ఉగ్రవాద కుట్రకు ప్లాన్ చేయవచ్చని భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి.
బహవల్పూర్లో ఈరోజు కసూరి హాజరైన కార్యక్రమానికి “సీరత్-ఎ-నబీ (స) సహీహ్ బుఖారీ” అనే పేరు పెట్టారు. ఈ కార్యక్రమం జామియా ఉమ్ అబ్దుల్ అజీజ్, తౌహీద్ చౌక్, అహ్మద్పూర్ తూర్పు, బహవల్పూర్లో జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా జిహాదీలు పాల్గొన్నట్లు సమాచారం, ఇది భవిష్యత్తులో ఉగ్రవాద కార్యకలాపాలలో వారి ప్రమేయాన్ని సూచిస్తుందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. రెండు ప్రధాన ఉగ్రవాద సంస్థల అగ్ర కమాండర్ల మధ్య జరిగిన ఈ సమావేశం భారత భద్రతా సంస్థలకు ఒక మేల్కొలుపు వంటిదని విశ్లేషకులు పేర్కొన్నారు. భారతదేశంపై జరిగే ఏదైనా కుట్రను సకాలంలో తిప్పికొట్టడానికి భద్రతా దళాలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
READ ALSO: Roman Gofman: ప్రపంచాన్ని కుదిపే నియామకం.. మోసాద్కు కొత్త చీఫ్
తాజావార్తలు
-
Sai Kumar: రవి నువ్వొక దొంగవి.. సాయికుమార్ కామెంట్స్తో నవ్వులే నవ్వులు!
-
FEFSI : కోలీవుడ్లో సమ్మె సైరన్పై ఫెఫ్సీ ఆందోళన: బంద్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి!
-
Rambha Urvashi Menaka Trailer: నవ్వులు పూయిస్తున్న అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్.. చూశారా!
-
Gurugram Rain: గంట వర్షానికి గురుగ్రామ్ అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్థం
-
India vs Afghanistan: భారత్తో పోరుకు ఆఫ్ఘనిస్తాన్ సై.. జట్టులోకి ప్రమాదకర పేసర్ రీఎంట్రీ
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!