జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా కీలక నిర్ణయం తీసుకున్నారు. పదవీ విరమణ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వచ్చే నెలలో జరగనున్న లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని మీడియా సమావేశంలో ఫుమియో కిషిడా ప్రకటించారు. కిషిదా నిర్ణయంతో ఆయన స్థానంలో పార్టీ అధ్యక్షుడి కోసం పోటీ నెలకొంది.
తెలుగు వ్యక్తి పర్వతనేని హరీశ్కు అరుదైన అవకాశం దక్కింది. ఐఎఫ్ఎస్ అధికారి పర్వతనేని హరీశ్ న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితిలో భారత తదుపరి రాయబారి/ శాశ్వత ప్రతినిధిగా నియమితులయ్యారు
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు తెలంగాణ నుంచి ప్రత్యేక అతిథులను కేంద్రం ఆహ్వానించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి రైతులు, యువత, మహిళలు, విద్యార్థులు, వివిధ సామాజిక రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న విభిన్న ప్రత్యేక అతిథులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది.
ఆర్థిక రాజధాని ముంబైలో మెట్రో రైలు సరికొత్త రికార్డు నమోదు చేసింది. మెట్రో రైలు సర్వీసులు ప్రారంభమైన 10 ఏళ్ల తర్వాత ఈ రికార్డు నమోదు చేసింది. మంగళవారం ఒక్కరోజే 5,00,385 మంది ప్రయాణికులతో రికార్డు సృష్టించిం
కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)తో అన్ని లావాదేవీలను నిలిపివేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బీహార్లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు. ఈ ఘటన భాగల్పూర్లోని ప్రభుత్వ క్వార్టర్లో చోటుచేసుకుంది. ఒకేసారి ఐదుగురు హత్యకు గురికావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఘోరం జరిగింది. వేదికపై ఉన్న మహిళా టిక్టాకర్ పట్ల యువకులు నీచానికి ఒడిగట్టారు. పట్టపగలే ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఇష్టానుసారంగా చేతులు వేసి.. వస్త్రాలు చింపి వివస్త్రను చేసి బలత్కారానికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
యూకేకు బయల్దేరి వెళ్లిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో తిరిగి ముంబైలో అత్యవసర ల్యాండింగ్ అయింది. అయితే ప్రయాణికులకు పూర్తిగా నగదు వాపస్ చేయనున్నట్లు ఎయిరిండియా వెల్లడించింది.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. ఇకపై క్యూఆర్ కోడ్తో చెల్లింపులు చేసే విధానాన్ని అన్ని రైల్వే స్టేషన్లలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. దీంతో రైల్వే టికెట్ కౌంటర్ల దగ్గర టికెట్ల కొనుగోలు సులభతరం కానుంది. అలాగే చిల్లర కష్టాలకు కూడా చెక్ పడనుంది.
థాయ్లాండ్ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. అనూహ్యంగా స్రెట్టా థావిసిన్ ప్రధానమంత్రి పదవిని కోల్పోయారు. నైతిక ఉల్లంఘనలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో రాజ్యాంగ న్యాయస్థానం పదవి నుంచి తొలగించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.