-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐ పట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
Ashwini Vaishnaw: అభివృద్ధి, సంక్షేమం విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తోందని కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. విశాఖలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు కీలక ప్రకటనలు చేశారు. ఆంధ్రప్రదేశ్కు ఎంతో కీలకమైన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ను 2026 జూన్ 1న అధికారికంగా నోటిఫై చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ఈ […] -
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
Crime: కేవలం ఒకే ఒక ప్రశ్న.. ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అది కూడా బస్సు ఏ రూటుకు వెళ్తుందన్న చిన్న సందేహం అడిగినందుకు ఓ వృద్ధుడిని చంపేశాడో యువకుడు. తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు జిల్లా తాంబరంలో జరిగిన ఈ దారుణం అందరినీ షాక్కు గురిచేస్తోంది. ఒకసారి చెప్పినా మళ్లీ అడిగారన్న కోపంతో, వృద్ధుడని కూడా చూడకుండా గొంతు నులిమి చంపేశాడు అమర్నాథ్ అనే నిందితుడు. తాంబరం ప్రాంతానికి చెందిన చంద్రశేఖరన్ (72) ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నారు. ఉదయం […] -
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
Minister Nara Lokesh: విశాఖపట్నం నగరం ఇకపై కొత్త దిశగా అడుగులు వేయబోతోందని, ఉక్కు నగరంగా పేరుగాంచిన విశాఖ ఇకపై డేటా సిటీగా, ఏఐ హబ్గా మారబోతోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖ ముఖచిత్రం ఈరోజుతో మారిపోతోందని పేర్కొన్నారు. భారత్లోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని గూగుల్ విశాఖకు తీసుకువచ్చిందని లోకేష్ తెలిపారు. 2026 ఏప్రిల్ 28 నుంచి విశాఖలో […] -
Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.. వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో తాజా పరిణామాలు చర్చించారు చంద్రబాబు.. పెట్రోలియం కంపెనీల నుంచి బంకులకు లోడ్ డిస్పాచెస్ ఎలా జరుగుతున్నాయని సీఎం ఆరా తీశారు. రాత్రంతా లోడ్ డిస్పాచెస్ జరిగాయని.. నిరంతరం బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా జరిగేలా చూస్తున్నామని అధికారులు సీఎం చంద్రబాబు కు వివరించారు.. ఇవాళ ఉదయం ఆరు […] -
Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన
Google Data Center: ఆంధ్రప్రదేశ్కు భారీ పెట్టుబడులను తీసుకురావాలన్న లక్ష్యంతో మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నం జిల్లా తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్కు ఘనంగా శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. గూగుల్ క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, గూగుల్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ & క్లౌడ్ వైస్ ప్రెసిడెంట్ […] -
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ బీపీవో కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిదా ఖాన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై కీలక విచారణ ముగిసింది. ఈ పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు విన్న నాసిక్ రోడ్ సెషన్స్ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మే 2వ తేదీన కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ తీర్పుపైనే నిలిచింది. ఈ కేసులో మతమార్పిడి ప్రయత్నం, మత మనోభావాలను దెబ్బతీయడం, లైంగిక […] -
Moringa Chutney Recipe: క్షణాల్లో కారం కారంగా మునగ చట్నీ తయారు చేయండి.. రుచితో పాటు పుష్కలమైన విటమిన్లు మీ సొంతం!
Moringa Chutney Recipe: మునగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మునగ కాయలే కాదు.. మునగ ఆకులతో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. మునగాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సహజ సూపర్ ఫుడ్.. ఇందులో ఇనుము, కాల్షియం, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అయితే మునగాకు కొద్దిగా చేదుగా ఉండటంతో చాలా మంది తినడానికి ఆసక్తి చూపరు. కానీ అదే మునగాకుతో రుచికరమైన చట్నీ చేస్తే మాత్రం చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ […] -
Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
Rava Paratha Recipe: ఉరుకులు పరుగుల జీవితంలో.. కొన్నిసార్లు ఫుడ్కు కూడా తగిన సమయం కేటాయించడం లేదు.. ఒకే రకమైన ఫుడ్కు అలవాటు పడిపోతున్నారు.. బోర్గా ఫీల్ అవుతున్నారు.. అయితే, ప్రతిరోజూ ఒకే రకమైన అల్పాహారం తింటూ విసుగెత్తిపోయారా? పోహా, ఉప్మా, శాండ్విచ్, పరాఠాలు లాంటి సాధారణ బ్రేక్ఫాస్ట్కు బదులుగా ఈరోజు కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటే రవ్వ పరాఠాలు మంచి ఎంపిక. ఇవి తక్కువ సమయంలో సిద్ధమవుతాయి, తినడానికి ఎంతో రుచిగా ఉంటాయి, జీర్ణం కావడానికి […] -
YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
YSRCP Protest: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత తీవ్రతరమవుతున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇవాళ పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద శాంతియుత నిరసనలు చేపట్టనున్నట్లు పార్టీ నాయకత్వం ప్రకటించింది. రైతాంగం, వాహనదారులు, సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అంశంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కృత్రిమ కొరత సృష్టించి డీలర్లు, కూటమి […] -
Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
Vizianagaram Road Accident: విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పూసపాటి రేగ మండలం పేరాపురం సమీపంలో జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళ్తుండగా కారు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై ఉన్న ఇద్దరు వ్యక్తులు, కారులో ఉన్న మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. కారులో […]
తాజావార్తలు
-
LSG Record: లక్నోలో ఎన్నాళ్లకు.. ఎల్ఎస్జీకి మొదటి విజయం, ఆర్సీబీకి తొలి ఓటమి!
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా..హాలీవుడ్ ‘రీసెట్’ మూవీ క్రేజీ అప్డేట్!
-
Military Tension: ఖేష్మ్, బందర్ అబ్బాస్పై అమెరికా దాడులు.. హార్ముజ్ ఉద్రిక్తతలు మరింత తీవ్రం
-
CM Revanth Reddy : నేడు కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటన.. రూ. 364 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.!
-
Mr. Work From Home : మే 15న థియేటర్లలో ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’