Gautam Gambhir controversy: గంభీర్ రాజకీయాలతో టీమిండియాను నాశనం చేశాడు.. మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir controversy: టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్పై విమర్శలు గుప్పించాడు పాక్ మాజీ క్రికెటర్.. గంభీర్ రాజకీయాలను జట్టు వాతావరణంలోకి తీసుకొచ్చి టీమ్ ఇండియాను దెబ్బతీశాడు’ అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు చేశాడు. భారత జట్టు కోచ్గా ఉన్న గంభీర్పై పాకిస్తాన్ మాజీ బ్యాట్స్మన్ అహ్మద్ షెహజాద్ తీవ్ర విమర్శలు చేశారు. అయితే, టీ20 ప్రపంచకప్ సూపర్ 8 దశలో దక్షిణాఫ్రికాతో జరిగిన ఓటమి తర్వాత గంభీర్పై ఒత్తిడి పెరిగింది. ఈ మ్యాచ్లో తీసుకున్న జట్టు ఎంపిక నిర్ణయాలు విమర్శలకు దారితీశాయి. ముఖ్యంగా ప్లేయింగ్ ఎలెవన్లో మార్పులు చర్చనీయాంశంగా మారిన విషయం విదితమే..
కీలక మ్యాచ్లో అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ను ఎంపిక చేయడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నిర్ణయాన్ని అశ్విన్ సహా పలువురు మాజీ ఆటగాళ్లు ప్రశ్నించిన సంగతి తెలిసిందే కాగా.. 2019–2024 మధ్య తూర్పు ఢిల్లీ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన గంభీర్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ షెహజాద్ విమర్శలు గుప్పించారు. ఏ రంగంలోనైనా పూర్తి దృష్టి అవసరం. గంభీర్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత అతని ఆలోచనా విధానం మారిందని అనిపిస్తోంది. ఇప్పుడు అదే రాజకీయ ధోరణి జట్టు వాతావరణంలో కనిపిస్తోంది. ఇది భారత జట్టు ప్రతిష్టకు హానికరం అని షెహజాద్ వ్యాఖ్యానించాడు.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
ఇక, జట్టు వద్ద ఉన్న ప్రతిభను సరైన విధంగా ఉపయోగించుకోవడంలో కోచ్ విఫలమయ్యాడని షెహజాద్ ఆరోపించాడు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్కు పరిమిత అవకాశాలు ఇవ్వడం పై ప్రశ్నలు లేవనెత్తాడు. “మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యం ఉన్న కుల్దీప్ యాదవ్ వంటి ఆటగాళ్లను సరిగా ఉపయోగించుకోవడం లేదు. జట్టు వనరులను సమర్థంగా నిర్వహించడం జరగడం లేదు,” అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు.. కొంతకాలంగా జట్టులో అంతర్గత విభేదాలపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒక సందర్భంలో ఇద్దరు ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరిగిందనే వార్తలు వచ్చాయి. అయితే వారు ఆ వార్తలను ఖండిస్తూ వీడియో విడుదల చేసినప్పటికీ, ఆ అంశంపై ఇంకా చర్చ కొనసాగుతోంది. ఇక గంభీర్ మరియు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో జట్టు ఇప్పటివరకు ద్వైపాక్షిక సిరీస్లు కోల్పోలేదని చెప్పినా, వరుస కీలక మ్యాచ్ల నేపథ్యంలో ఒత్తిడి మాత్రం పెరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత జట్టు తన తదుపరి సూపర్ 8 మ్యాచ్ను జింబాబ్వేతో ఆడనుంది. ఈ మ్యాచ్ ఫలితం జట్టు భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
50/30/20 Rule: పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచాలి? 50/30/20 గోల్డెన్ రూల్ తెలుసుకోండి!
-
Toxic Trailer: ‘టాక్సిక్’ ట్రైలర్కు టైమ్ ఫిక్స్.. ఈ రోజు సాయంత్రం ఎన్ని గంటలకు రిలీజ్ అంటే!
-
Keerthy Suresh: అవకాశాలు లేకనే ఐటం సాంగ్స్.. కీర్తి సురేష్కు నెటిజన్ కౌంటర్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన నటి!
-
Korean Kanakaraju Day 1 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కు దుమ్మురేపే ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.18 కోట్ల గ్రాస్!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!