Off The Record: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పై చేయి ఎవరిది?
- సరిపడా మెజార్టీ రాక స్వతంత్రుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి
- మేజిక్ ఫిగర్ 26, ఎక్స్అఫిషియోతో కలిపి బీజేపీకి 23
- తెర వెనక చక్రం తిప్పిన బీఆర్ఎస్
- ఇండిపెండెంట్ను ఛైర్మన్ చేస్తే మేము, ఎంఐఎం మద్దతిస్తామని కాంగ్రెస్కు ప్రతిపాదన
- ఇండిపెండెంట్ బండారి అనూషకు ఛైర్పర్సన్ పదవి
- కాంగ్రెస్లో చేరిన అనూష, పీఠం మాదేనని కాంగ్రెస్ ప్రకటన
- అంతా మా క్రెడిట్ అంటూ ఓన్ చేసుకుంటున్న బీఆర్ఎస్
- నేతల వైఖరి మింగుడు పడని అన్ని పార్టీల కేడర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికారంలో ఉన్నామని, బల్దియా పీఠం మాదేనని తొలుత ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్కు ఫైనల్గా నిరాశ తప్పలేదు. సరిపడా మెజార్టీ రాకపోవడం పక్క పార్టీలు లేదా స్వతంత్రుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ బీజేపీ 21 వార్డుల్లో గెలవగా… ఎంపీ,ఎమ్మెల్యే ఓట్లతో కమలం బలం 23కు చేరింది. 26 సీట్లు గెల్చుకున్న పార్టీకే ఛైర్మన్ పీఠం దక్కుతుంది. ఈ పరిస్థితుల్లో కాషాయదళం ఊహించని రీతిలో మిగతా అన్ని పార్టీలు ఏకం అయ్యాయి. ఇక కావాల్సింది మూడు సీట్లే కదా సెట్ చేద్దాం, పీఠం మనదేనని బీజేపీ అనుకుంటుండగానే బీఆర్ఎస్ తెరవెనక చక్రం తిప్పిందట. మాజీ మంత్రి జోగురామన్న లైన్లోకి వచ్చి ఇండిపెండెంట్ను చైర్మన్ చేస్తే… మాతోపాటు ఎంఐఎం మద్దతు కూడా ఇప్పిస్తామని కాంగ్రెస్కు ప్రతిపాదించారట.
అందుకు హస్తం నేతలు ఓకే చెప్పడంతో….ఎక్కువ స్థానాలు గెలిచిన బీజేపీకి షాకిస్తూ….ఇండిపెండెంట్గా గెలిచిన బండారి అనూష ఛైర్పర్సన్ అయ్యారు. ఎంఐఎం నాయకుడు మహ్మద్ రోహిత్ వైస్ చైర్మన్ అయ్యారు. అదంతా ఒక ఎత్తయితే…. ఇండిపెండెంట్గా గెలిచిన అనూష కాంగ్రెస్లో చేరారు. దీంతో… ఓనేత తన వల్లనే కాంగ్రెస్కు ఛైర్మన్ సీటు దక్కిందంటూ సంబరాలు చేసుకున్నారట. మున్సిపల్ కౌన్సిల్ హాల్ సమీపంలో సైతం ఆర్బాటం చేయడం చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిని పీఠం ఎక్కించి ఓన్ చేసుకోవడంతో అసలు ఈ క్రెడిట్ ఎవరిదన్న చర్చ జరుగుతోంది. రూల్స్ ప్రకారం ఇండిపెండెంట్ చైర్మన్ కాగా….తమ సామాజికవర్గం కాబట్టి తామే పేరును ప్రతిపాదించి చక్రం తిప్పామని బీఆర్ఎస్ చెప్పుకుంటోంది. అటు కాంగ్రెస్ మాత్రం ఈ క్రెడిట్ను తన ఖాతాలో వేసుకుంటుండటం చర్చనీయాంశం అయింది. ఇటు బీజేపీ, అటు బీఆర్ఎస్, ఇంకో వైపు కాంగ్రెస్… ఇలా మూడు ఉద్దండపార్టీలు ఉండగా ఇండిపెండెంట్ పీఠం ఎక్కడం అన్ని పార్టీల క్యాడర్కు మింగుడు పడని అంశమే. అయినా ముఖ్య నాయకులు మాత్రం… ఎవరికి వారు అది తమ రాజకీయ చతురతే అని చెప్పుకోవడం కొసమెరుపు.
Also Read
తాజావార్తలు
-
Trump-Iran: ఈ వారాంతంలో ఇరాన్పై భారీ దాడి జరగనుందా? వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం
-
Janhvi Kapoor: ‘రాకా’లో జాన్వీ కపూర్ ఎంట్రీ?.. వైరల్ ఫొటోతో మొదలైన కొత్త రచ్చ!
-
CM Chandrababu: భోగాపురం ఎయిర్పోర్ట్తో ఉత్తరాంధ్రకు కొత్త చరిత్ర.. దశ, దిశ మారనున్నాయి..
-
Secret Soldier : టైటిల్ మారింది.. ‘సీక్రెట్ సోల్జర్’గా వస్తున్న ‘చైనా పీస్’!
-
GST Collections July 2026: దేశ ఆర్థిక వ్యవస్థకు బిగ్ బూస్ట్.. జూలైలో GST వసూళ్లు రూ.2.11 లక్షల కోట్లు
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!