రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని కడప జిల్లా ఇంఛార్జ్ మంత్రి సవితా విమర్శించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఇంఛార్జ్ మంత్రి హాట్ కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వం దాచుకోవడం దోచుకోవడం తప్ప.. ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదన్నారు.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందని ఆరోపించారు
ఆర్. కృష్ణయ్య మరోసారి రాజ్యసభ ఎన్నికల బరిలో దిగనున్నారు.. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నారు కృష్ణయ్య.. మొత్తం మూడు రాష్ట్రాలకు సంబంధించిన రాజ్యసభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది భారతీయ జనతా పార్టీ (బీజేపీ).. హర్యానా నుంచి రేఖా శర్మ.. ఒడిశా నుంచి సుజీత్ కుమార్.. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్. కృష్ణయ్యను అభ్యర్థులుగా ప్రకటించింది..
ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి బొర్రా గోపి మూర్తి విజయం సాధించారు.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన గోపి మూర్తి.. మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందినట్టుగా చెబుతున్నారు..
తిరుమలలో కారులో మంటలు చెలరేగిన ఘటన తీవ్ర కలకలం రేపింది.. ఆర్టీసీ బస్టాండ్ వద్ద కారు దగ్ధమైంది.. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో భక్తులు పరుగులు తీశారు.. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలు అదుపుచేశారు.. అప్పటికే మంటల్లో కారు ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం కల అని పేర్కొన్నార ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..తాము అధికారంలోకి వచ్చే వరకు చంద్రబాబు నాయుడు బతికి ఉంటే... జైలుకు పంపుతామన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై గొట్టిపాటి రవి మండిపడ్డారు..
త్వరలో ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన ఒక కీలక ప్రకటన చేస్తామన్నారు మంత్రి నారా లోకేష్. ఆంధ్ర యూనివర్సిటీని ఐదేళ్లలో టాప్ 3లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.. ప్రపంచ స్థాయిలో ఆంధ్ర యూనివర్సిటీని టాప్ యూనివర్సిటీలో ఒకటిగా ఉంచాలన్నారని తెలిపారని గుర్తుచేసుకున్నారు..
కడప జిల్లాలో ప్రేమోన్మాది రెచ్చిపోయారు.. తనను ప్రేమించలేదని ప్రేమోన్మాది ఓ యువతిపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశారు. వేముల మండలం కొత్తపల్లిలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న షర్మిల అనే యువతిపై కులయప్ప అనే యువకుడు కత్తితో దాడి చేశారు. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వారు అక్కడకు రావడంతో వారిని చూసి కులయప్ప పరారయ్యారు.
2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని ఆకాక్షించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. 1998లో విద్యుత్ రంగ సంస్కరణలు తీసుకొచ్చాం.. 2004కి మనం పవర్ వినియోగంలో పొదుపులో ఉన్నాం.. విద్యుత్ రంగంలో ఏపీని మొదటి ర్యాంకు కు తెస్తాం టీడీపీ హయాంలోనే అన్నారు సీఎం చంద్రబాబు..
పార్వతీపురం మన్యం జిల్లా జీఎం వలస మండలం వెంకటాపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వీధికుక్కల దాడిలో కుండెన పారమ్మ అనే వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. బహిర్భూమికి వెళ్లిన 80 ఏళ్ల వృద్ధురాలిపై కుక్కలు దాడి చేసి పొలాల్లోనే చంపేశాయి.