CM Chandrababu: రంగం ఏదైనా భారతీయులదే విజయం.. దావోస్లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- రంగం ఏదైనా.. భారతీయులదే విజయం..
- వంద దేశాల్లో తెలుగు ప్రజల సేవలు..
- గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్లుగా ఎదిగే సత్తా ఉంది..
- స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏపీ విధానం..
- ఆంధ్రప్రదేశ్లో అవకాశాలను అందిపుచ్చుకోండి..
- దావోస్ సీఐఐ సెషన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: వ్యాపార, వాణిజ్య రంగాల్లో విజయం సాధించి.. గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్లుగా ఎదిగే సత్తా భారతీయల్లో ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు… ప్రపంచంలో అందరికీ అత్యంత ఆమోదయోగ్యమైన ఏకైక కమ్యునిటీగా భారతీయులు గుర్తింపు పొందారన్నారు.. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ రెండో రోజున, భారత పరిశ్రమల సమాఖ్య ప్రత్యేక సెషన్లో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్పై ముఖ్యమంత్రి ప్రసంగించారు. 100కు పైగా దేశాల్లో తెలుగువారు ఉన్నారని, తక్కువ సమయంలోనే ఇంతలా తెలుగువారు విశ్వవ్యాప్తం అవుతారని ఎవరూ ఊహించలేదన్నారు. రెండో రోజు దావోస్ పర్యటనలో సీఐఐ ప్రతినిధులతో సమావేశం అయ్యారు.. మానవ వనరుల లభ్యత ఏపీకి ప్లస్ పాయింట్ అని, భారతీయ పారిశ్రామికవేత్తలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతోమంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతున్నారని, తమ ప్రతిభతో రాణిస్తున్నారని పేర్కొన్నారు.
Read Also: Hyderabad: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్.. వీవీఐపీల పేరుతో మోసాలు
Also Read
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
- NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
భవిష్యత్ నాయకులను సిద్ధం చేయడానికి అమరావతిలోని గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ దోహదపడుతుందన్నారు సీఎం చంద్రబాబు.. నాయకత్వ వికాసాన్ని పెంపొందించడానికి స్విట్జర్లాండ్కు చెందిన ఐఎండీ బిజినెస్ స్కూల్, జీఎల్సీ మధ్య అవగాహన కలిగిందన్నారు. సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడానికి, దైనందిన జీవితాన్ని మెరుగుపరచడానికి ఏఐ, రియల్ టైమ్ డేటా వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాల్సిన అవసరాన్ని చంద్రబాబు వివరించారు. భారతదేశం అందించిన సేంద్రియ వ్యవసాయం ప్రపంచ సమాజానికి ఒక వరంగా చంద్రబాబు పేర్కొన్నారు. పీ4 మోడల్ ద్వారా ప్రభుత్వ-ప్రైవేటు-పబ్లిక్ భాగస్వామ్యాన్ని ఇటు పాలనలోనూ తీసుకువచ్చామని చెప్పారు. హరిత పారిశ్రామికీకరణ, డీప్-టెక్ ఇన్నోవేషన్, సమ్మిళిత నాయకత్వంపై దృష్టి సారించామని చెప్పారు.రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్కు గ్లోబల్ హబ్గా మార్చడానికి కృషి చేస్తున్నట్టు వెల్లడించారు.
Read Also: Naga Shaurya : క్యూట్ భాయ్ నాగశౌర్య కొత్త సినిమా అప్ డేట్ వచ్చేసిందోచ్
ఇక, ఇంధన సంస్కరణలు కూడా సుస్థిర అభివృద్ధికి ఒక ఉదాహరణగా తెలిపారు సీఎం చంద్రబాబు. 1999లో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో సాహసోపేతమైన విద్యుత్ సంస్కరణలను ప్రవేశపెట్టి విజయం సాధించనని గుర్తు చేశారు. నాడు దేశం తీవ్రమైన విద్యుత్ కొరతను ఎదుర్కొంది, పరిశ్రమలు మూసివేయవలసి వచ్చిందని.. కొన్ని సవాళ్లు-భయాలు ఉన్నప్పటికీ క్లిష్టమైన సంస్కరణలను చేపట్టానని.. ఆనాటి సంస్కరణల వల్ల తన రాజకీయంగా నష్టం కలిగించిందని, అయితే ఆ నిర్ణయాలతో ఇప్పుడు ప్రయోజనాలు పొందుతున్నామనే సంతృప్తి ఉందన్నారు. అలాగే సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిలో గణనీయమైన పురోగతిని సాధించామని, ఇంధన ఖర్చులు తగ్గించగలిగామని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
KS Bharat Retirement: అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్..
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..