Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Tirumala Adulterated Ghee Issue Ap Cabinet Discussion Cm Chandrababu Key Directions

CM Chandrababu: టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారం.. మంత్రులకు సీఎం కీలక సూచనలు..

Published Date :January 28, 2026 , 3:44 pm
By Sudhakar Ravula
  • టీటీడీ కల్తీ నెయ్యి అంశంపై ఏపీ కేబినెట్‌లో చర్చ..
  • సిట్ నివేదికపై వైసీపీ తప్పుడు ప్రచారంపై ఆందోళన..
  • సిట్ నివేదిక అధికారికంగా వచ్చిన తర్వాతే స్పందించాలన్న సీఎం..
CM Chandrababu: టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారం.. మంత్రులకు సీఎం కీలక సూచనలు..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

CM Chandrababu: తిరుమల టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసులో సిట్ నివేదికపై విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు, తప్పుడు ప్రచారంపై ఏపీ కేబినెట్ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. అసలు నెయ్యిలో కల్తీ జరగలేదని సిట్ క్లీన్‌ చిట్ ఇచ్చిందన్న తరహాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రివర్గం ఆందోళన వ్యక్తం చేసింది. ఇక, టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి సిట్ నివేదికను అధికారికంగా తెప్పించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ ఈ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన విషయంను అధికారులు కేబినెట్‌కు వివరించారు. ఈ నేపథ్యంలో సిట్ నివేదిక అధికారికంగా అందిన తర్వాతే స్పందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు స్పష్టమైన సూచనలు చేశారు.

Read Also: YS Jagan Padayatra: ప్రజల మధ్యే ఉంటా.. 150 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తా..

Also Read

  • Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి
  • CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్‌ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
  • Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
  • YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్‌..
Add as a preferred
source on google

కేబినెట్ సమావేశంలో మంత్రులతో కలిసి టీటీడీ నెయ్యి కల్తీ అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై మంత్రులు తీవ్రంగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే నెయ్యి కల్తీ జరిగిందనేది వాస్తవమని అధికారులు స్పష్టం చేసినట్లు మంత్రులు వెల్లడించారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన ఖాతాలో నాలుగున్నర కోట్ల రూపాయలు జమ అయిన అంశాన్ని మంత్రులు ప్రస్తావించారు. నెయ్యి సరఫరా చేసిన డెయిరీలకు అంత సామర్థ్యం లేదని, పాల సేకరణ సామర్థ్యం కూడా డెయిరీలకు లేదని అధికారులు వివరించినట్లు చెప్పారు. కాంట్రాక్ట్ తీసుకున్న కొన్ని డెయిరీలు రసాయనాలు మిశ్రమం చేసి నెయ్యి తయారు చేశాయని మంత్రులు పేర్కొన్నారు.

వైసీపీ హయాంలో జరిగిన తప్పులను ఇప్పుడు తమపై నెట్టే ప్రయత్నం జరుగుతోందని మంత్రులు వ్యాఖ్యానించారు. “తప్పు చేశారు.. కల్తీ జరిగిందని తేలింది.. ఇప్పుడు బుకాయింపులకు దిగుతున్నారు” అని మంత్రులు మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సిట్ నివేదిక వచ్చిన తర్వాతే మాట్లాడాలని మంత్రులకు సూచించారు. వైసీపీ నేరప్రవృత్తి ఇదే విధంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. కోడికత్తి, బాబాయి గొడ్డలి, గులకరాయి కేసులను గుర్తు చేస్తూ, అప్పట్లో ఎలా వ్యవహరించారో ప్రజలకు తెలుసని అన్నారు. సిట్ ఏర్పాటు వద్దని సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ నేతలు, చివరకు సీబీఐ ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు జరిగి నివేదిక ఇచ్చినా కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం విమర్శించారు. వైసీపీ నేతలు తప్పులు చేసి వాటిని ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో మంత్రులందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. సిట్ నివేదిక అధికారికంగా వెలువడిన తర్వాతే ప్రభుత్వ స్పందన ఉంటుందని స్పష్టం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh Politics
  • ap cabinet meeting
  • CBI SIT chargesheet
  • CM Chandrababu Naidu
  • SIT report Tirumala

తాజావార్తలు

  • Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?

  • Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??

  • Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి

  • Sreemukhi : ముచ్చటగా మూడో ఇల్లు కొనేసిన శ్రీముఖి

  • Madatha Kaja Recipe : స్వీట్ షాప్ స్టైల్‌లో జ్యూసీ మడత కాజాలు ఇంట్లోనే సులభంగా ఇలా తయారు చేసుకోండిలా.!

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions