కరోనా కలకలం.. ఐసోలేషన్లో క్రికెటర్లు.. మ్యాచ్ ఇవాళ్టికి వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక టూర్లో కరోనా కలకలం రేపుతోంది. భారత ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో… నిన్న భారత్ – శ్రీలంక మధ్య జరగాల్సిన రెండో టీ-20 వాయిదా పడింది. దీంతో ఇరు జట్లు ఐసోలేషన్కి వెళ్లాయి. టీమిండియా, శ్రీలంక ఆటగాళ్లకు అందరికీ కోవిడ్ నిర్దారణ పరీక్షలు నిర్వహించిన అనంతరం నెగటివ్గా తేలితేనే.. ఇవాళ్టి మ్యాచ్ సజావుగా సాగే అవకాశం ఉంది. కృనాల్కు సన్నిహితంగా ఉన్న మరో 8 మంది ప్లేయర్లకు ఆర్టీపీసీఆర్ టెస్టు చేయగా.. వారందరికి నెగిటీవ్ వచ్చినట్లు తేలిందని బీసీసీఐ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇరు జట్ల ఆటగాళ్లంతా బయో బబుల్లోనే ఉంటున్నారు. అయినా కృనాల్కు పాజిటివ్ ఎలా వచ్చిందో స్పష్టత లేదు.
విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా ఇంగ్లాండ్లో పర్యటిస్తోంది. ఇప్పటికే శుభ్మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, అవేశ్ ఖాన్ వంటి యువ ప్లేయర్లు గాయాల బారిన పడటంతో.. శ్రీలంక పర్యటనలో ఉన్న సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షాకు.. టెస్టు సిరీస్లో ఆడేందుకు బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే ప్రస్తుతం వీరితో పాటు లంక టూర్లో ఉన్న కృనాల్కు కరోనా సోకడంతో ఇంగ్లండ్కు వెళ్లే అంశంపై సందిగ్దత నెలకొంది. ఇంగ్లాండ్లో ఇప్పటికే రిషభ్ పంత్ కరోనా బారిన పడి కోలుకున్నాడు. అతడితో సన్నిహితంగా మెలిగిన వృద్ధిమాన్ సాహా, భరత్ అరుణ్, అభిమన్యు ఈశ్వరన్ పది రోజులు ఐసోలేషన్లో ఉన్నారు.
Also Read
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
- ICC: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్.. ఆటగాళ్లపై 40 శాతం జరిమానా.. కారణం ఇదే..
- T20 Captain: భారత టీ20 కెప్టెన్గా కొత్త సారథి.. సంజూ శాంసన్కు అవకాశం..?
- Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..