-
హుజురాబాద్ బరిలో 30 మంది అభ్యర్థులు.. ఈటల జమున నామినేషన్ విత్డ్రా..
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నామినేషన్ల విత్డ్రా గడువు ముగిసింది.. ఇవాళ బీజేపీ తరపున నామినేషన్ వేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు.. కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి ఒంటెల లింగారెడ్డి కూడా నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు.. ఇండిపెండెంట్ అభ్యర్థులు సుమన్ నాయక్, వినోద్ కుమార్, రాజ్ కుమార్, నూర్జహాన్ బేగం, మల్లికార్జున్ తదితరులు కూడా నామినేషన్లు విత్డ్రా చేసుకోగా.. ఫైనల్గా బైపోల్ బరిలో 30 […] -
హుజురాబాద్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం..!
హుజురాబాద్ ఉప ఎన్నికలు ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య కాకరేపుతున్నాయి.. ఇప్పటికే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదుల పర్వం కొనసాగుతుండగా.. హుజురాబాద్ బై పోల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. తెలంగాణ ఉద్యమ సమయంలో నిజాయితీగా పోరాడిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ నాయకులు ఇష్టారాజ్యాంగ మాట్లాడుతూ , ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.. ఇక, సంతలో కూరగాయలు […] -
హరీష్పై రఘునందన్ సంచలన వ్యాఖ్యలు.. 6 నెలల తర్వాత ఔట్..!
మంత్రి హరీష్రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు.. హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. జమ్మికుంట మండలంలోని వెంకటేశ్వర్ల పల్లిలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. హరీష్ అన్న బాగా ఎగురుతున్నావట ఆరు నెలల తర్వాత నిన్ను కూడా అవతల పెడతారు అని వ్యాఖ్యానించారు.. అంతే కాదు.. అప్పుడు హరీష్ అన్నని గెలిపించాలని మళ్లీ మన యువకులు తిరగాల్సి వస్తది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, ఈటల రాజేందర్ ను రాత్రికి రాత్రి […] -
భారతీయులకు గుడ్న్యూస్.. నిబంధనలు ఎత్తివేసిన ఆ దేశం
భారత్ నుంచి వెళ్లే వాళ్లపై అమలు చేస్తున్న కఠిన నిబంధనల్ని ఎత్తి వేసింది బ్రిటన్. మన దేశంలో కరోనా సెకండ్ వేవ్కు డెల్టా వేరియంటే కారణమని భావిస్తోంది బ్రిటన్. ఈ క్రమంలో మన దేశం నుంచి వెళ్లే వాళ్ల ద్వారా తమ పౌరులు కరోనా సోకుతుందంటూ ఇటీవల లేనిపోని భయాలు వ్యక్తం చేసింది. బ్రిటన్లో అనుమతి పొందిన ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనికా టీకాను మన దగ్గర కోవీషీల్డ్ పేరుతో ఇస్తున్నారు. కానీ… కోవీషీల్డ్ రెండు డోసులు తీసుకున్నా సరే విమానం […] -
పాలమూరు సభలో రేవంత్ కీలక వ్యాఖ్యలు
పాలమూరు సభలో రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరు నుంచి 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించి… ఈ రాష్ట్రం తలరాత మార్చే అవకాశం తనకు ఇవ్వాలని కోరారు. లక్షా 93 వేల ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఇవ్వాలని.. 4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇచ్చే అవకాశం ఇవ్వాలని అన్నారు. అలాగే, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసే అవకాశం ఇవ్వాలని కోరారు రేవంత్ రెడ్డి. మరోవైపు, పరాయి రాష్ట్రం ప్రాజెక్టులపై దృష్టిపెడితే.. ఇక్కడే ఏడేళ్లుగా […] -
హైదరాబాద్లో ‘ఆపరేషన్ గంజా’
గంజాయి రవాణా జోరుగా సాగుతూనే ఉంది.. దీంతో.. గంజ విక్రయదారులపై సీరియస్గా ఫోకస్ పెట్టారు హైదరాబాద్ పోలీసులు.. ‘ఆపరేషన్ గంజా’ పేరుతో నగరంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు.. ఇప్పటి వరకు 23 మంది గంజాయి విక్రయదారులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.. ఒకేసారి 23 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.. ఇక, గంజా ఫ్రీ హైదరాబాద్ గా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా.. ప్రత్యేక చర్యలకు పూనుకుంటున్న […] -
మరో తెలంగాణ మంత్రికి కరోనా పాజిటివ్..
తెలంగాణలో మరో మంత్రి కరోనా మహమ్మారి బారినపడ్డాడు.. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులకు కరోనా సోకింది.. వారిలో కొందరు ప్రాణాలు వదలగా.. చాలా మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. తాజాగా, మంత్రి గంగుల కమలాకర్కు కోవిడ్ పాజిటివ్గా తేలింది.. గత రెండు రోజుల నుంచి జలుబు, జ్వరంతో బాధపడుతున్న మంత్రికి.. తాజాగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్గా తేలింది.. దీంతో.. హోం ఐసోలేషన్లోకి వెళ్లిపోయిన మంత్రి గంగుల కమలాకర్.. ఈ మధ్య తనను కలిసినవారు, […] -
బీజేపీ, ఈటలపై ఈసీకి ఫిర్యాదు.. ఆధారాలు సమర్పించిన టీఆర్ఎస్..!
హుజురాబాద్ ఉప ఎన్నిక రోజురోజుకీ పొలిటికల్ హీట్ పెంచుతోంది… ఆరోపణలు, విమర్శల పర్వం ఊపందుకోగా… ఇక, తాజాగా ఫిర్యాదుల పర్వానికి తెరలేచింది.. ఇప్పటికే ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఎస్పీ తదితర అధికారులపై ప్రతిపక్షాలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయగా.. తాజాగా.. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, ఆ పార్టీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది అధికార టీఆర్ఎస్ పార్టీ.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై అసత్య ఆరోపణలు, తీవ్ర నేరారోపణతో కూడిన కేసులో ఇరికించే ప్రయత్నం […] -
అనసూయ వార్నింగ్.. నా పేరు వాడితే కోర్టుకీడుస్తా..!
నిజాలు తెలుసుకోకుండా నా పేరు వాడిన వారిపై కోర్టుకు వెళ్తానంటూ వార్నింగ్ ఇచ్చారు యాంకర్, నటి అనసూయ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచినవాళ్లు రాజీనామా ప్రకటన కోసం ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు.. ఆ కార్యక్రమానికి వచ్చిన అనసూయ.. అక్కడి నుంచి తిరిగి వెళ్తోన్న సమయంలో.. మా ఎన్నికలపై మీడియా ప్రశ్నించింది.. ఆ ప్రశ్నలపై కొంత అసహనం వ్యక్తం చేసిన ఆమె.. నన్ను మీరు ఘెరావ్ చేసినంత పనిచేశారంటూ వ్యాఖ్యానించారు. అయితే, […] -
పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం.. దరఖాస్తుల స్వీకరణ..!
తెలంగాణలో పోడు భూముల సమస్య ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.. గిరిజనులు పోడు చేసుకోవడం.. ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం.. తోపులాటలు, ఘర్షణలు, దాడులు.. ఇలా.. చాలా సందర్భాల్లో సమస్యలు వస్తున్నాయి.. అయితే, పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రంలో పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కై పోడు భూములకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు.. ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు సీఎస్ సోమేష్ కుమార్.. […]
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!