-
హీరో నానికి థాంక్స్ చెప్పిన మహిళా నేత..
ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల ధరలపై టాలీవుడ్ హీరో నాని తాజాగా చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్టాపిక్గా మారాయి.. ఏపీ మంత్రులు.. హీరో నానిపై కౌంటర్ ఎటాక్ చేస్తుంటే.. టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత మాత్రం ఆయనకు బాసటగా నిలిచారు.. టిక్కెట్ ధరలపై హీరో నాని కామెంట్లపై స్పందించిన అనిత… హీరో నానికి థాంక్స్ చెబుతున్నాను.. సినీ ఇండస్ట్రీలో వాళ్లకి ఇప్పటికైనా నొప్పి తెలిసిందని వ్యాఖ్యానించారు.. రెండున్నరేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న విధానాలపై సినీ ఇండస్ట్రీ స్పందించలేదన్న అనిత.. ఈ […] -
రైతులకు అన్యాయం చేయడంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ..!
రైతులకు అన్యాయం చేయడంలో కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయంటూ మండిపడ్డారు మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. కనీస మద్దతుధర కల్పించడంలో కేంద్రం బాటలోనే రాష్ట్రం పోతోందని విమర్శించిన ఆయన.. కనీస మద్దతు ధర విషయంలో స్పస్టత ఎందుకు ఇవ్వడం లేదు? అని ప్రశ్నించారు.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో దోపిడీ జరుగుతుందని ఆరోపించారు జీవన్రెడ్డి.. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 5 శాతం.. 3 లక్షల మెట్రిక్ టన్నులు మిల్లర్లే దోపిడీ చేస్తున్నారని.. […] -
లుథియానా కోర్టులో భారీ పేలుడు.. ఇద్దరు మృతి
పంజాబ్లోని లుథియానా కోర్టులో భారీ పేలుడు జరిగింది.. కోర్టు కాంప్లెక్స్లోని రెండో అంతస్తులో పేలుడు సంభవించగా… ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు.. ఇక, పేలుడు ధాటికి భవనం ధ్వంసమైంది… ఈ పేలుడు ఘటనలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.. భవనంలోని రెండో అంతస్తులోని బాత్రూమ్లో మధ్యాహ్నం 12:22 గంటల ప్రాంతంలో పేలుడు జరిగినట్లు సమాచారం. పేలుడు తీవ్రతకు బాత్రూమ్ గోడలు దెబ్బతిన్నాయి మరియు సమీపంలోని గదుల అద్దాలు పగిలిపోయాయి.. జిల్లా […] -
ఒమిక్రాన్పై తాజా స్టడీలో ఆసక్తికర అంశాలు.. డెల్టాతో పోలిస్తే..!
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు వాయు వేగంతో దేశాలను చుట్టేస్తోంది… సౌతాఫ్రికా నుంచి ఇతర దేశాలకు వ్యాప్తిచెందిన ఈ మహమ్మారితో ఇప్పుడు బ్రిటన్, అమెరికా లాంటి దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.. అయితే, ఇప్పటికే పలు రకాల అధ్యయనాల్లో చాలా వేగంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తుందని తేలింది.. తాజాగా మరో స్టడీలో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి.. డెల్టా వేరియంట్తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్లో వ్యాధి తీవ్రత, ఆస్పత్రిపాలయ్యే అవకాశం తక్కువగా ఉంటుందని తేల్చింది యూనివర్సిటీ […] -
చంద్రబాబు చెప్పినట్టు చేయడానికి నేనేమైన ఆయన పీఏనా?-అశోక్ గజపతి
విజయనగరం రామతీర్థం బోడికొండపై జరిగిన పరిణామాలు చివరకు కేసుల వరకు వెళ్లాయి.. ఈవో ప్రసాద్ ఫిర్యాదు మేరకు నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో కేంద్ర మాజీ మంత్రి అశోక్గజపతి రాజుపై కేసు నమోదైంది.. 473, 353 సెక్షన్ల కింద అశోక్ గజపతిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. అయితే, ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అశోక్ గజపతి రాజు.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ఘటనలోకి టీడీపీ అధినేత చంద్రబాబును లాగడంపై అభ్యంతరం వ్యక్తం […] -
సముద్రంలో కూలిపోయిన హెలికాప్టర్.. ఈత కొడుతూ ఒడ్డుకు చేరిన మంత్రి
‘భూమిపై నూకలు ఉంటే ఎలాగైనా బతుకుతాడు’ అని పెద్దలు చెబుతుంటారు.. అది నూటికి నూరుపాళ్లు నిజమని రుజువైంది.. ఎందుకంటే.. సముద్రంలో హెలికాప్టర్ కుప్పకూలిపోయింది.. ఇక, ఎవ్వరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదు.. కానీ, 57 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం ధైర్యాన్ని కోల్పోకుండా.. ఏకంగా 12 గంటల పాటు ఈత కొడుతూ ఒడ్డుకు చేరిన మంత్రి అందరినీ ఔరా! అనిపించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హిందూ మహాసముద్రంలో మడగాస్కర్ మంత్రి సెర్జ్ గెల్లె ప్రయాణిస్తున్న […] -
క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు… హైకోర్టు ఆదేశాలు
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రంపంచదేశాలను వణికిస్తోంది.. భారత్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మహమ్మారి.. తెలంగాణలోనూ వెలుగు చూసింది.. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి తెలంగాణలో అడుగుపెట్టిన ఒమిక్రాన్ ఇప్పుడు టెన్షన్ పెడుతోంది.. క్రమంగా ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరుగుతూ పోతున్నాయి.. ఓవైపు డెల్టా వేరియంట్ కేసులు పూర్తిస్థాయిలో తగ్గిపోకముందే.. ఇప్పుడు ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తోంది.. అయితే, ఒమిక్రాన్ కట్టడికి క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ […] -
సింగరేణిలో మరో ప్రమాదం.. ఒకరు మృతి
సింగరేణిలో వరుస ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి… తాజాగా మరో ప్రమాదం చోటు చేసుకుంది.. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రామగుండం పరిధిలోని సింగరేణి ఆర్జీ 3లోని ఓసీపీ-1లో ఈ రోజు ఉదయం ప్రమాదం జరిగింది. డంపర్ను మరో డంపర్ ఢీకొట్టిన ప్రమాదంలో.. ఆపరేటర్ శ్రీనివాస్ మృతి చెందాడు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న సింగరేణి అధికారులు.. అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు […] -
గుడ్న్యూస్.. కోవిడ్ చికిత్సలో తొలి టాబ్లెట్కు ఆమోదం..
చైనాలో వెలుగు చూసిన కరోనా మహమ్మారి.. ఇప్పటికీ ప్రపంచ దేశాలపై వివిధ రూపాల్లో దాడి చేస్తూనే ఉంది.. అయితే, మహమ్మారి కట్టడికి అనేక పరిశోధనల తర్వాత.. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది… ఆ తర్వాత భారత్లో ఒక ఫౌడర్ కూడా అందుబాటులోకి తెచ్చారు.. ఇప్పుడు మహమ్మారి చికిత్సలో టాబ్లెట్ కూడా చేరింది… అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో తొలిసారిగా కోవిడ్పై పోరాటానికి తొలి మాత్రకు అనుమతి ఇచ్చింది.. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) ఇవాళ తొలి కోవిడ్ […] -
బ్రేకింగ్: అశోక్గజపతిరాజుపై కేసు నమోదు
కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుపై కేసు నమోదు చేశారు పోలీసులు.. నిన్న రామతీర్థం ఘటన నేపథ్యంలో ఆలయ ఈవో ప్రసాద్ ఫిర్యాదు మేరకు నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.. రామతీర్థంలో శంకుస్థాపన కార్యక్రమానికి, తమ విధులకు ఆటంకం కలిగించారంటూ అశోక్గజపతిరాజుపై ఫిర్యాదు చేశారు ఈవో ప్రసాద్.. దీంతో.. 473, 353 సెక్షన్ల కింద అశోక్ గజపతిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. కాగా, విజయనగరం రామతీర్థం బోడికొండపై బుధవారం […]
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!