అన్నీ ఫ్రీ అంటూ టెలికాం రంగంలో అడుగుపెట్టిన రిలయన్స్ జియో.. తక్కువ కాలంలోనూ కోట్లాది మంది మనసులను కొల్లకొట్టింది.. ఫ్రీ స్కీమ్ ఎత్తివేసి.. టారిప్ ప్లాన్లు తీసుకొచ్చినా.. క్రమంగా ఆ సంస్థ యూజర్ల సంఖ్య పెరుగుతూ పోయింది.. దీంతో.. దేశంలోనే అగ్రగామి టెలికం సంస్థగా అవతరించింది.. అయితే, ఇప్పుడు ఆ సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.. 2021 డిసెంబర్ నెలలో మొబైల్ యూజర్లు గణనీయంగా జియోకు గుడ్బై చెప్పేశారు.. ఏకంగా 20 శాతం మేర ధరలను పెంచుతూ […]
కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు.. ప్రాజెక్టులు నిర్మాణం అయ్యేవి కావు.. నీళ్లు వచ్చేవి కావు.. ఆయన కారణజన్ముడు అంటూ ప్రశంసలు కురిపించారు ఆర్థికశాఖ మంత్రి హరీష్రావు.. రంగనాయక సాగర్ ఎడమ కాలువ ద్వారా రైతులకు గోదావరి నీటిని విడుదల చేసిన మంత్రి తన్నీరు హరీష్ రావు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. కేంద్రం నుంచి రావాల్సిన సహకారం రాకున్నా అత్యుత్తమ ఆర్థిక విధానాలతో తెలంగాణ ను అన్ని రంగాలలో ముందంజలో నిలుస్తుందన్నారు.. […]
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి రేపు సమావేశం కానుంది… 2022-23 వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలపడంతో పాటు పలు కీలక నిర్ణయాలపై చర్చించి ఓ నిర్ణయానికి రానుంది… మొత్తంగా 49 అంశాలుతో కూడిన అజెండాను పాలక మండలి సమావేశం కోసం సిద్ధం చేశారు టీటీడీ అధికారులు… టేబుల్ ఐటెంగా మరి కొన్ని అంశాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు.. Read Also: Polavaram Project: ఏపీ ప్రభుత్వానికి ఊరట అజెండాలోని అంశాల విషయానికి వస్తే..*2022-23 వార్షిక […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది.. పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల విషయంలో రెండేళ్ల పాటు ప్రభుత్వానికి ఊరట దక్కింది.. అనుమతులు లేని కారణంతో 2011లో పనుల నిలుపుదల ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర పర్యావరణ శాఖ.. 2015లో ఈ ఉత్తర్వులను అభయెన్సులో పెట్టిన కేంద్రం ప్రభుత్వం.. అయితే, ఆ అభయెన్సు ఉత్తర్వులను ప్రతీ ఏటా కొనసాగిస్తూ వస్తున్న కేంద్ర సర్కార్.. మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది… తాజాగా […]
సదరన్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆలపాటి కృష్ణమోహన్ కూతురు పెళ్లి వైభవంగా జరిగింది… సందీప్-సబీన దంపతుల కుమారుడు శుభంతో ఆలపాటి వెంకటేశ్వరరావు మనవరాలు, ఆలపాటి కృష్ణమోహన్-మాధవి గారాల పట్టి దివ్య వివాహాన్ని ఈ రోజు రాత్రి ఢిల్లీ ఎరో సిటీలోని ఓ హోటల్లో సందడిగా నిర్వహించారు.. పలువురు వివిధ రంగాలు చెందిన ప్రముఖులు హాజరై దివ్య-శుభం దంపతులను ఆశీర్వదించారు.. ఇక, దిగువన ఉన్న ఫొటోలో.. ఆలపాటి కృష్ణమోహన్ కుమారుడు ఆదిత్య, ఆలపాటి కృష్ణ మోహన్, శుభం (పెళ్లి […]
రష్యా- ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్నాయి.. వీటి ప్రభావం స్టాక్మార్కెట్లపై కూడా పడిన విషయం తెలిసిందే కాగా… రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అప్రమత్తమైంది భారత ప్రభుత్వం.. దీనిపై భారత విదేశాంగశాక ఓ ప్రకటన విడుదల చేసింది.. ఉక్రెయిన్లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేసినట్లు వెల్లడించింది.. పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని.. ఉక్రెయిన్లో భారత విద్యార్థులున్నందున అప్రమత్తంగా ఉన్నామని ప్రకటించింది ప్రభుత్వం.. ఇక, భారత్-ఉక్రెయిన్ మధ్య […]
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పరిష్కారానికి నోచుకోని విభజన సమస్యలపై చర్చల కోసం ఏర్పాటైన త్రిసభ్య కమిటీ తొలి సమావేశం జరగబోతోంది… కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీ తొలి సమావేశం రేపు ఉదయం 11 గంటలకు వర్చువల్గా జరగనుంది.. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అధ్యక్షత జరిగే ఈ సమాశానికి.. త్రిసభ్య కమిటీలో సభ్యులుగా ఉన్న ఏపీ, తెలంగాణ సీఎస్లు పాల్గొననున్నారు.. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు.. Read Also: Vijayawada […]
విజయవాడలో విధి నిర్వహణలో ఉన్న ఓ ఆర్టీసీ డ్రైవర్పై ఓ మహిళ వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే.. 5వ నంబర్ బస్ రూట్లో… ఆంధ్ర హాస్పిటల్ వద్ద రాంగ్ రూట్లో వచ్చిన వచ్చిన ఓ మహిళ.. తన వాహనానికి ఆర్టీసీ బస్సు తగిలిందంటూ ఓవర్ యాక్షన్ చేశారు.. వచ్చిందే రాంగ్ రూట్.. పైగా బస్సు డ్రైవర్పై రుబాబు చేసింది ఆవిడి.. బస్సు ఎక్కి మరీ డ్రైవర్పై దాడికి దిగింది.. ప్రయాణికులు వారిస్తున్నా వినిపించుకోకుండా.. డ్రైవర్ను పిడిగుద్దులు గుద్దింది.. […]
ఈ మధ్య తెలంగాణ సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ నేతలు… కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. కేంద్ర, రాష్ట్రాల మధ్య నిధుల వ్యవహారం నుంచి.. రాజకీయ విమర్శల వరకు ఈ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమన్న చందంగా ఉంది పరిస్థితి.. అయితే, ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్కు లేఖ రాశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. పీఎం మిత్రలో చేరాలని విజ్ఞప్తి చేసిన ఆయన.. దాని కోసం ప్రతిపాదనలు పంపించాలని సూచించారు.. వస్త్ర […]
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ రాష్ట్ర ఓటర్లను ఉద్దేశిస్తూ ఓ వీడియో విడుదల చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్.. యూపీ ఓటర్లకు వార్నింగ్ ఇవ్వడంపై పెద్ద రచ్చ జరుగుతోంది.. ఈ వ్యవహారంపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం.. చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలియిజేయాలంటూ నోటీసులు జారీ చేసింది.. 24 గంటల్లో సమాధానం చెప్పాలని డెడ్లైన్ పెట్టిన విషయం తెలిసిందే.. ఇక, ఈసీ నోటీసుపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్.. వివరణ ఇస్తానని తెలిపారు.. […]