Pawan Kalyan: నేడు ఢిల్లీకి పవన్ కళ్యాణ్.. జనసేన జాతీయ విస్తరణ దిశగా కీలక అడుగు!
- నేడు ఢిల్లీ పర్యటనకు పవన్ కళ్యాణ్
- కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్న పవన్
- ఐదు రాష్ట్రాల ముఖ్య నాయకులతో సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan visits Delhi for key Jana Sena meetings: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. పార్టీ విస్తరణతో పాటు జాతీయ స్థాయిలో జనసేన భావజాలాన్ని ప్రజలకు తెలియజేసే లక్ష్యంతో ఉన్న ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలో నిర్వహించే పలు కీలక కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి మధ్యాహ్నం 3:45 గంటలకు బయలుదేరనున్న పవన్.. సాయంత్రం 4:25 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం 4:30 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరనున్నారు. రాత్రి 6:40 గంటలకు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత నేరుగా తాజ్ హోటల్కు వెళ్లనున్నారు.
ఢిల్లీలో జనసేన పార్టీకి చెందిన ఐదు రాష్ట్రాల ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత బలోపేతం, వివిధ రాష్ట్రాల్లో జనసేన విస్తరణ వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ కీలక సూచనలు ఇవ్వనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇండియా గేట్ సమీపంలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో పవన్ పాల్గొననున్నారు. ‘సేన గళం’ కార్యక్రమం ద్వారా జనసేన సిద్ధాంతాలు, లక్ష్యాలను దేశ ప్రజలకు వివరించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జాతీయ రాజకీయాల్లో జనసేన పాత్ర, ప్రజా సమస్యలపై పార్టీ వైఖరిని ఈ వేదికగా పవన్ వెల్లడించే అవకాశం ఉంది.
Also Read
- Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
- Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
- Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
- OTR: వివాదాలకు కేరాఫ్గా బోనబోయిన శ్రీనివాస్..
పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత పెరగడానికి మరో కారణం.. రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో జనసేన నాయకులు హాజరుకానుండటమే. సుమారు 150 మంది జనసేన ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. వీరిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ కీలక నాయకులు ఉన్నారు. అశోక్ హోటల్లో నిర్వహించనున్న సమావేశంలో పార్టీ శ్రేణులకు పవన్ ప్రత్యేకంగా మార్గనిర్దేశం చేయనున్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలు, ప్రజల్లో మరింతగా చొచ్చుకుపోయే కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. నేటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు జనసేన నాయకులు ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ పర్యటన జనసేన జాతీయ విస్తరణ దిశగా కీలక అడుగుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!