Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
- ధర్మశాల వేదికగా భారత్, అఫ్గానిస్థాన్ తొలి వన్డే
- ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్
- కాన్ఫరెన్స్లో తల్లి ఫోన్కు స్పందించిన నితీష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar Reddy Lift His Mother’s Call in Press Conference: శనివారం ధర్మశాల వేదికగా జరిగిన భారత్, అఫ్గానిస్థాన్ తొలి వన్డే అనంతరం జరిగిన పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో టీమిండియా యువ ఆల్రౌండర్, తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మ్యాచ్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న నితీశ్.. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్న సమయంలో తన తల్లి నుంచి వచ్చిన ఫోన్ కాల్ను లిఫ్ట్ చేయడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రెస్ కాన్ఫరెన్స్లో తల్లి ఫోన్కు స్పందించిన విధానం అభిమానుల మనసులు గెలుచుకుంది.
ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్ను ఓడించింది. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న నితీశ్ రెడ్డికి అతని తల్లి ఫోన్ చేశారు. ఆ సమయంలో ఓ జర్నలిస్ట్ ప్రశ్న అడుగుతుండగా ఫోన్ చూసిన నితీశ్.. కాల్ లిఫ్ట్ చేశాడు. ‘అమ్మ.. ఐదు నిమిషాల్లో కాల్ చేస్తాను’ అని చెప్పి కాల్ కట్ చేశాడు. అనంతరం మీడియా ప్రతినిధికి క్షమాపణలు చెప్పి.. తిరిగి ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ఈ సరదా సంఘటన అక్కడున్న వారిని నవ్వుల్లో ముంచెత్తగా.. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ‘అమ్మ ఫోన్కు ఎప్పుడూ ప్రాధాన్యతే’, ‘అమ్మతో అట్లుంటది మరి’ అంటూ కామెంట్లు చేస్తూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. యువ ఆటగాడి వినయం, కుటుంబానికి ఇచ్చే గౌరవం నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.
Also Read
- West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
- Gold Medal In Glasgow: కామన్వెల్త్ గేమ్స్లో దూసుకుపోతున్న భారత్.. మరో రెండు స్వర్ణాలు సొంతం..
- Team India: రుతురాజ్, పటీదార్లకు ఘోర పరాభవం.. రికార్డులు ఉన్నా కనీసం కనుచూపు మేరలో కూడా లేరు..
- FIFA World Cup: ప్రైవేట్ సంస్థలకు వరల్డ్ కప్ అమ్మకం.. ఫిఫా సంచలన ప్లాన్..
ఈ మ్యాచ్లో నితీశ్ రెడ్డి బౌలింగ్లో కీలక పాత్ర పోషించాడు. నాలుగు ఓవర్లలో 31 పరుగులు మాత్రమే ఇచ్చి.. రెండు కీలక వికెట్లు తీశాడు. అఫ్గానిస్థాన్ స్టార్ బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్తో పాటు సీనియర్ మహ్మద్ నబీ వికెట్ను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో భారత బౌలింగ్ దాడిలో కీలకంగా మారాడు. సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్ 2026లో నితీశ్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. 13 ఇన్నింగ్స్లలో 302 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధసెంచరీ కూడా ఉంది . బౌలింగ్లో ఎనిమిది వికెట్లు తీసి ఆల్రౌండర్గా తన విలువను నిరూపించాడు. అతని నిలకడైన ప్రదర్శన ఫలితంగానే భారత జట్టులో అవకాశం దక్కింది.
The post-match presser can wait but a call from Mom simply cannot 😊#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @NKReddy07 pic.twitter.com/23OUBNZvYH
— BCCI (@BCCI) June 13, 2026
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!