కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా రోజువారి కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.. ఇక, కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటును బట్టి.. ఆయా దేశాలు విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేయడం, క్వారంటైన్ టైం తగ్గించడం లాంటి చర్యలు తీసుకుంటున్నాయి.. తాజాగా, బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. బంగ్లాదేశ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీస్ (డీజీహెచ్ఎస్).. అక్కడి ప్రస్తుత ఇన్ఫెక్షన్ రేటును పరిగణలోకి తీసుకుని.. కొన్ని సడలింపులు ఇచ్చింది.. అందులోభాగంగా.. క్వారంటైన్ కాలాన్ని తగ్గించింది… బంగ్లాదేశ్లో […]
న్యాయమూర్తులపై అనుచిత పోస్టుల కేసు విచారణ సందర్భంగా సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. భారతదేశంలోని చట్టాలు న్యాయస్థానాలను గౌరవించకపోతే వ్యాపారం మూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.. ట్విట్టర్పై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదని అభిప్రాయపడింది ఏపీ హైకోర్టు. ట్విట్టర్లో పోస్టులు డిలీట్ చేసినా.. విపిన్ అని టైప్ చేస్తే వెంటనే ఆ పోస్టులు వస్తున్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు హైకోర్టు న్యాయవాది అశ్వినీ కుమార్.. దీనిపై సీరియస్ అయిన హైకోర్టు.. […]
ఫీవర్ సర్వేతో రాష్ట్రంలో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు మంత్రి హరీష్రావు.. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివిటీ రేటు కూడా తగ్గినట్టు వెల్లడించారు.. మహీంద్ర కంపెనీ ఆధ్వర్యంలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేయడాన్ని అభినందించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఇది 86వ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ అన్నారు.. కరోనా సెకండ్ వేవ్ లో 500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం పడింది. కానీ, 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే […]
ప్రభుత్వ బ్యాకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) వడ్డీ రేట్లను పెంచింది ఎస్బీఐ.. రికరింగ్ డిపాజిట్ పెట్టుబడులపై 5.1 శాతం నుండి 5.4 శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తోంది. ఇక, సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో అరశాతం ఎక్కువ ఉంటుందని పేర్కొంది.. సవరించిన వడ్డీ రేట్లు జనవరి 15వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్టు ఎస్బీఐ తెలిపింది.. కేవలం 100 రూపాయల […]
జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి నివాళులర్పించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్… తాడేపల్లిలోని తన నివాసంలో గాంధీజీ చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. Read Also: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. ఎల్లుండి నుంచే కొత్త ఛార్జీల వడ్డింపు మరోవైపు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో జాతిపిత మహాత్మాగాంధి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.. గాంధీ చిత్ర పటానికి […]
కొత్త ఏడాదిలో అడుపెట్టాం.. జనవరి నెల కూడా పూర్తి కావొచ్చింది.. ఎల్లుండి నుంచి ఫిబ్రవరి మాసం ప్రారంభం కానుంది.. ఇప్పటికే కొత్త ఏడాదిలో కొత్త ఛార్జీలను అమలు చేస్తున్న దేశంలోనే అతిపెద్ద బ్యాకింగ్ రంగ సంస్థ ఎస్బీఐ.. ఫిబ్రవరి 1 నుంచి తక్షణ చెల్లింపు సేవ(ఐఎంపీఎస్) ఛార్జీలను పెంచబోతోంది.. ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్లో ఐఎంపీఎస్ ద్వారా చేసే నగదు బదిలీకి ఛార్జీ వడ్డించనుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. అయితే, డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ప్రొత్సహించేందుకే ఎస్బీఐ […]
భారతదేశంలోని వయోజన జనాభాలో 75 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయినట్టు తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ.. పౌరులకు అభినందనలు తెలియజేశారు.. దేశ జానాభాలో మొత్తం పెద్దలలో 75 శాతం మంది పూర్తిగా టీకాలు వేసుకున్నారు. ఈ మహత్తరమైన ఫీట్ సాధించినందుకు సహకరించిన మా తోటి పౌరులకు అభినందనలు.. మా టీకా డ్రైవ్ను విజయవంతం చేస్తున్న అందరికీ ఇది గర్వకారణం అంటూ ట్వీట్ చేశారు ప్రధాని మోడీ.. దేశంలోని వయోజన జనాభాలో 75 శాతానికి పైగా ఇప్పుడు […]
ఏపీలో కొత్త జిల్లా ఏర్పాటు వ్యవహారం కొన్ని ప్రాంతాల్లో కాకరేపుతోంది.. జిల్లాల పేర్లపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.. జిల్లా కేంద్రాలను కూడా మార్చాలనే డిమాండ్ వినిపిస్తోంది.. ఇక, విజయవాడకు వంగవీటి రంగా పేరు పెట్టాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.. విశాఖలో మీడియాతో మాట్లాడిన వంగవీటి రాధ, రంగా రీ ఆర్గనైజషన్ సభ్యులు గాదె బాలాజీ… బెజవాడకు వంగవీటి రంగా పేరు పెట్టాలని సీఎం వైఎస్ జగన్ను కోరారు.. ఈ విషయంపై చిరంజీవి, పవన్ కల్యాణ్ కూడా స్పందించాలని […]