Sajjala: వివేకా లేకపోవడం వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ.. ఇప్పటికీ వైఎస్ మృతిపై అనుమానాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. చంద్రబాబు వ్యంగ్యంగా మాట్లాడబోయి అపహాస్యం పాలువుతున్నారని ఎద్దేవా చేసిన ఆయన.. రాజకీయ నేతలు ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు ఉండాలని సూచించారు.. అనవసరమైన ఆరోపణలు చేయొద్దని హితవు పలికారు.. ఇక, వైఎస్ వివేకానందరెడ్డి లేకపోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా తెలిపిన ఆయన.. మహా వృక్షం లాంటి వైఎస్ ఫ్యామిలీలో వివేకా ఘటన అందరినీ షాక్లో నెట్టిందన్నారు. సీఎం వైఎస్ జగన్ పెద్ద అండను కోల్పోయారన్న సజ్జల.. కానీ, చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: COVID 19 AP: 500 దిగువకు పాజిటివ్ కేసులు
Also Read
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
- Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా జరగటమే కాదు జరుగుతోంది అనే నమ్మకం కూడా కలగాలి అన్నారు సజ్జల.. వైఎస్ హయాంలోనూ చంద్రబాబు.. వైఎస్ జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారన్న ఆయన.. దయ్యాల గుంపులాగా టీడీపీ మారిందని మండిపడ్డారు.. రాజకీయాలు అంటే మంచి పాలనకు సంబంధించి ఉండాలని కోరుకునే వ్యక్తి వైఎస్ జగన్ అని వ్యాఖ్యానించిన ఆయన.. చంద్రబాబు బాబువి దౌర్భాగ్యపు ఆలోచనలు అంటూ మండిపడ్డారు.. చంద్రబాబులాగే లోకేష్ కూడా పనికి రాకుండా తయారయ్యాడని విరుచుకుపడ్డారు. వివేకానందరెడ్డి కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారని ఆరోపిస్తున్నారని.. సాక్ష్యాలను ఎవరూ తారుమారు చేయలేదన్నారు.. గుండెపోటు అని చెప్పినంత మాత్రాన అది దర్యాప్తును ఎలా ప్రభావితం చేస్తుందని ప్రశ్నించారు సజ్జల.. ఎదురుగా ఉన్న సాక్ష్యాలను సీబీఐ పరిగణలోకి తీసుకోదా? అని నిలదీశారు. చంద్రబాబుది కుట్రల స్వభావం అని ఆగ్రహం వ్యక్తం చేసిన సజ్జల.. నిజం నిప్పులాంటిది కాబట్టే చంద్రబాబు చేతులు కాలాయన్నారు.. అబద్ధానికి బట్టలు వేస్తే చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు. ఇక, ఇప్పటికీ వైఎస్సార్ మృతిపై అనుమానాలు ఉన్నాయన్నారు. మరోవైపు, ఎన్టీఆర్ మృతికి ఇండైరెక్ట్గా కారణమైన వ్యక్తం చంద్రబాబు అని ఆరోపించారు సజ్జల రామకృష్ణారెడ్డి.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?