Punjab Polls: కాంగ్రెస్ హామీల వర్షం.. మేం తిరిగి అధికారంలోకి వస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పంజాబ్లోనూ మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగబోతోంది.. ఇవాళ ప్రచారానికి తెరపడింది.. అయితే, చివరి క్షణాల్లో అన్నట్టుగా.. ప్రచార సమయం ముగిసే ముందు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ… తాము మరోసారి అధికారంలోకి వస్తే.. ఏం చేస్తామో చెబుతూ.. పంజాబ్ ప్రజలపై వరాల జల్లు కురిపించింది.. కాంగ్రెస్ తిరిగి అధికారంలో వస్తే లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని.. మహిళలకు నెలకు రూ. 1,100 అందిస్తామని, ఏడాదికి 8 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చింది.. గురునానక్ స్ఫూర్తితో పార్టీ మ్యానిఫెస్టోను ప్రజల ముందుకు తెచ్చామని ఈ సందర్భంగా వెల్లడించారు పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. ఇక, మద్యం విక్రయాలు, ఇసుక మైనింగ్కు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ.. మాఫియాకు చరమగీతం పాడతామన్నారు.. ఆయిల్ సీడ్, పప్పు ధాన్యాలు, మొక్కజొన్న పంటలను ప్రభుత్వ సంస్ధల ద్వారా సేకరిస్తామని తెలిపింది..
Read Also: VH: రేవంత్-కోమటిరెడ్డి భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు.. అదేం గొప్ప..?
Also Read
- Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
- Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎవరైనా పైలట్ కావచ్చని…. కానీ, తుఫాన్ చెలరేగినప్పుడు మనం ప్రతికూల పరిస్ధితినీ అనుకూలంగా మలుచుకోవాలనే రీతిలో మ్యానిఫెస్టోకు రూపొందించినట్టు వెల్లడించారు.. మరోవైపు, ఎస్ఏడీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సిద్ధూ.. ఇరు పార్టీల నేతలు ఒకే నాణేనికి రెండు వైపుల వంటి వారని ఆరోపించిన ఆయన.. రాష్ట్ర ప్రజలు మార్పు తీసుకురావాలనుకుంటే కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయాలన్నారు.. కెప్టెన్ అమరీందర్ సింగ్, సుఖ్బీర్ సింగ్ బాదల్లు ఒకే నాణేనికి రెండు వైపుల వంటి వారని, వారివైపు మొగ్గితే తిరోగమనమేనని హెచ్చరించారు సిద్ధూ.. కాగా, పంజాబ్లో ఎన్నికల ప్రచారానికి నేడు తెరపడగా.. ఈ నెల 20న ఒకే దశలో రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది.. మార్చి 10న ఫలితాలు ప్రకటించనున్నారు.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!