AP: సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సీసీ కెమెరాలు.. హెచ్వోడీ ఆఫీసులకు అనుసంధానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వెలుగుచూసిన అవకతవకలు ప్రభుత్వ ఆదాయినిక భారీగా గండి కొట్టాయి.. దీంతో.. అప్రమత్తం అయిన ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.. అవకతవకలకు చెక్పెట్టే విధంగా అడుగులు వేస్తోంది.. దీనిపై మీడియాతో మాట్లాడిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసే సీసీ కెమెరాలను హెచ్వోడీ కార్యాలయాలకు అనుసంధానం చేసే ప్రక్రియ జరుగుతోందన్న ఆయన.. మరోవైపు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉన్న డాక్యుమెంట్ల డిజిటలైజేషన్ ప్రక్రియ చేపడుతున్నాం అన్నారు. 15 కోట్ల పేజీల డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది.. 1850 సంవత్సరం నుంచి ఉన్న డాక్యుమెంట్లు డిజిటలైజేషన్ చేసేందుకు ఓ ప్రైవేటు సంస్థను సంప్రదించామని తెలిపారు.
Read Also: AP: అతి పెద్ద హవాలా రాకెట్ గుట్టు రట్టు..!
Also Read
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
- Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు తరచూ వచ్చే బ్యాంకర్లు, రియల్టర్లు, టిడ్కో విభాగం, సాధారణ ప్రజలకు వేగంగా సేవలు అందించే లక్ష్యంతో పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టమ్ను స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అమలు చేస్తోందని తెలిపారు రజత్ భార్గవ.. రాష్ట్ర వ్యాప్తంగా 37 గ్రామవార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందిస్తున్నాం.. ఆయా సచివాలయాల్లోని పంచాయితీ కార్యదర్శులకు సబ్ రిజిస్ట్రార్ హోదా కల్పించాం. 2021-22 ఆర్ధిక సంవత్సరం లో నెలకు 1000 కోట్ల చొప్పున రియల్ ఎస్టేట్ లావాదేవీలు జరిగాయన్నారు.. రిజిస్ట్రేషన్, స్టాంపులు విభాగం ద్వారా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ. 7327 కోట్ల ఆదాయం వచ్చిందని.. 20.76 లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరిగిందని వెల్లడించారు.
తాజావార్తలు
-
Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
-
Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
-
Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!
-
Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!