ఆటోకు హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి ఎనిమిది మంది సజీవ దహనం అయిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి.. ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
సీఎం వైఎస్ జగన్కు మీడియాని చూస్తే భయం, సోషల్ మీడియా అంటే వణుకు అంటూ సెటైర్లు వేశారు నారా లోకేష్.. చివరికి యూట్యూబ్ ఛానెల్ థంబ్ నైల్ చూసి జడుసుకునే జగన్ సింగిల్ గా వచ్చే సింహమా! వీధి కుక్క కూడా కాదు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆన్లైన్లో సినిమా టిక్కెట్ల విక్రయాలపై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ.. పలు ఆన్లైన్ విక్రయ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.. వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు
ఈ రోజు వివిధ రాశుల వారి దినఫలాలు ఎలా వున్నాయి..? శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ బుతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం రోజు.. ఏ రాశివారికి ఎలా వుండబోతుంది? ఏ రాశివారు ఎలాంటి పరిహారాలు పాటించాలి? ఏ దైవానికి ఎలాంటి పూజలు చేయాలి? ఏ రాశివారు ఏ పనులు వాయిదా వేసుకుంటే మంచిది? వంటి పూర్తి వివరాల కోసం భక్తి టీవీ వీడియోని క్లిక్ చేయండి. https://www.youtube.com/watch?v=pLvY4N8N-kY
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, వెన్నుపోట్లపై ఆ పార్టీకి చెందిన ఎంపీ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు..
* ఉదయం 11 గంటలకు దేవేంద్ర ఫద్నవీస్ ఇంట్లో బీజేపీ కోర్ కమిటీ సమావేశం, కోర్ కమిటీ సమావేశం తర్వాత దేవేంద్ర ఫద్నవీస్ ప్రెస్ మీట్ * నేడు తెలంగాణ టెన్త్ ఫలితాలు, ఉదయం 11.30 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి * నేటి నుంచి తెలంగాణలో బోనాలు ప్రారంభం * నేడు సాయంత్రం 6 గంటలకు పీఎస్ఎల్వీ-సీ53 రాకెట్ ప్రయోగం, కొనసాగుతోన్న కౌంట్డౌన్ * శ్రీకాకుళం జిల్లా పలాసలో నేడు వైసీపీ […]
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరడం మరోసారి తెరపైకి వచ్చింది.. గత కొంతకాలంగా విశ్వేశ్వర్రెడ్డి చేరికపై వార్తలు వస్తూనే ఉన్నాయి.. అధిష్టానం నుంచి పెద్ద లీడర్లు ఎవరు రాష్ట్రానికి వచ్చినా.. ఆయన సమక్షంలో కొండా బీజేపీ కండువా కప్పుకుంటారనే ప్రచారం సాగుతూ వచ్చింది.. ఈ మధ్య పాదయాత్రలో ఉన్న బండి సంజయ్ని కలిశారు కొండా విశ్వేశ్వర్రెడ్డి.. అదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్షా రాష్ట్ర పర్యటనకు వచ్చిన నేపథ్యంలో.. ఆయన బీజేపీలో చేరడం […]
తన రూటే సెపరేటు అనే హీరో మోహన్ బాబు.. తాజాగా తిరుపతిలో అదే చేశారు. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు వ్యవహారించారనే కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది. కోర్టు వాయిదాకు ఇద్దరు కుమారులతో కలిసి హాజరైన ఆయన.. కొంత దూరం పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు.. రకరకాల ఊహాగానాలకు తెరతీశాయి. ఒకప్పుడు టీడీపీలో యాక్టివ్గా ఉంటూ.. రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన మోహన్బాబు.. గత ఎన్నికల్లో వైసీపీకి జై కొట్టారు. […]