శ్రావణ శనివారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే శనిపీడ వదిలి డబ్బు బంగారంతో ఐశ్వర్యవంతులవుతారని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.. మూడవ శ్రావణ శనివారం నాడు ఏ స్తోత్ర పారాయణం చేస్తే శని పీడ వదిలి డబ్బు బంగారంతో ఐశ్వర్యవంతులవుతారో తెలుసుకోవడానికి.. ఆ స్తోత్ర పారాయణం కోసం కింది వీడియో క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=asyNVNKhA44
* నేటి నుంచి మునుగోడులో కాంగ్రెస్ పాదయాత్ర, నారాయణపురం నుంచి చౌటుప్పల్ వరకు పాదయాత్రకు నిర్ణయం.. పాల్గొననున్న పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మధుయాష్కీ, 16వ తేదీ నుంచి పాదయాత్రకు రేవంత్ * విశాఖలో రేపటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు అగ్నిపథ్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ, * విజయవాడ: ప్రకాశం బ్యారేజ్ దగ్గర తగ్గిన వరద ఉధృతి, మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ, 70 గేట్ల ద్వారా […]
నన్ను కాంగ్రెస్ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.. కానీ, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా.. ఇక్కడే చస్తా అని ప్రకటించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. ఇవాళ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఉపఎన్నిక కసరత్తు మీటింగ్కు సంబంధించి నాకు ఎలాంటి సమాచారం లేదన్నారు.. ఏ మీటింగ్ జరిగినా నాకు సమాచారం ఇవ్వడం లేదు. నాకు ఆహ్వానం లేని మీటింగ్కు నేను ఎందుకు వెళ్తా? అని ప్రశ్నించారు. ఇక, చండూరులో సభలో నన్ను అసభ్యంగా తిట్టించారు. హోంగార్డుతో పోల్చారు. […]
మునుగోడు ఉప ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. కాంగ్రెస్కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి.. ఉప ఎన్నికల్లో మళ్లీ పోటీచేసేందుకు సిద్ధం అవుతుండగా.. మరోవైపు విజయం మాదేనని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కానీ, ఆ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభకు తనకు ఆహ్వానం లేదంటూ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దూరంగా ఉండడంపై పెద్ద చర్చే జరిగింది. అయితే, మునుగోడు ఉప ఎన్నికలపై రేవంత్రెడ్డి అప్పుడే చేతులు ఎత్తేశారని […]
బిలియనీర్ ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.. డీల్ విషయంతో ట్విట్టర్తో చెడిన తర్వాత.. తానే సొంతంగా ఓ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ను పెడితే ఎలా ఉంటుందని ఇంత కాలం ఆలోచించారేమో.. ఇప్పుడు.. సొంతగా ఆ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.. అంతే కాదు.. దాని పేరును కూడా రిలీవ్ చేశారు టెస్లా సీఈవో.. @టెస్లా ఓనర్ ఎస్వీ అనే ట్విట్టర్ యూజర్..’ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం రద్దయితే మీరు సొంత […]
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంపై ఇంకా రచ్చ సాగుతూనే ఉంది.. ఆంధ్రప్రదేశ్లో ఓవైపు నేతల మధ్య మాటల తూటాలు పేలుతుండగా.. మరోవైపు.. ఈ వ్యవహారం కేంద్రం వరకు వెళ్లింది.. ఓ ఎంపీ ప్రధాని దృష్టికి తీసుకెళ్తే.. జాతీయ మహిళా కమిషన్ … లోక్సభ స్పీకర్కు లేఖ రాసి.. ఆ సంగతి తేల్చమని కోరింది.. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ లేకుండానే.. ఆ […]
విలీన మండలాల్లో పోలవరం నిర్వాసితులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.. ఓవైపు గోదావరి ముంచెత్తుతుంటే.. అదే ముంపులో నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్నారు.. అల్లూరి జిల్లా విలీన మండలాల్లో పోలవరం నిర్వాసితుల ఆందోళనలు హోరెత్తుతున్నాయి..నిన్న చింతూరు వరద నీటిలో ధర్నాకు దిగిన నిర్వాసితులు.. తాజాగా ఈ రోజు వి.ఆర్.పురంలో వద్ద భారీగా ఉన్న వరద నీటిలో ఆందోళన చేపట్టారు.. విలీన మండలాల్లో ప్రతి సంవత్సరం సంభవించే వరదలకు తాము అష్టకష్టాలు పడుతుంటే పట్టించుకునే నాథుడే కారువయ్యాడని ఇక్కడి నిర్వాసితులు లబోదిబోమంటున్నారు. […]
ఇప్పుడు చాటింగ్, కాలింగ్, వీడియో కాలింగ్ విషయంలో ఎక్కువ మంది వాట్సాప్ను ఉపయోగిస్తున్నారు.. ఆ సదుపాయాలన్నీ కూడా ఫేస్బుక్ మెసేంజర్లో ఉన్నాయి.. ఇన్స్టాగ్రామ్లోనూ చాటింగ్ సదుపాయం ఉంది.. అయితే, కొన్ని సమస్యలు మాత్రం ఉన్నాయి.. ఇప్పుడు వాటికి పులిస్టాప్ పెట్టి.. మరింత అభివృద్ధి చేసేందుకు సిద్ధం అయ్యింది మోటా సంస్థ.. ఫేస్బుక్ మెసేంజర్, ఇన్స్టాగ్రామ్లో డేటా భద్రత కోసం కొత్త ఫీచర్ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. మెసేంజర్ లేదా ఇన్స్టాగ్రామ్లో బ్యాకప్ చేసుకునే చాట్ సంభాషణలకు […]
ఓ వైపు గోదావరి.. మరో వైపు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చుతున్నాయి.. ఇప్పటికే కృష్ణాబేసిన్లోని శ్రీశైలం, నాగార్జున సాగార్, పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో పెద్ద ఎత్తున వరద నీరు దిగువకు వెళ్తుందో.. దీంతో క్రమంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద పెరుగుతూ పోతోంది.. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ కు వరద తాకిడి పెరిగింది.. అప్రమత్తమైన అధికారులు.. దిగువ ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు.. ప్రకాశం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.. ఇన్ఫ్లో రూపంలో […]
అన్నీ ఫ్రీ అంటూ టెలికం మార్కెట్లో అడుగుపెట్టి దుమ్ములేపింది రిలయన్స్ జియో.. ఆ తర్వాత టారిఫ్ ప్రకటించి అమలు చేస్తున్నా.. వరుసగా టారిప్ రేట్లు పెరుగుతున్నా.. జియోకు క్రమంగా కస్టమర్లు పెరుగుతూ వచ్చారు.. ఇక, ఎప్పటికప్పుడు వారిని ఆకట్టుకునే పనిచేస్తూనే ఉంది ఆ సంస్థ.. తాజాగా, ఓ ప్రత్యేకమైన ప్లాన్ను తీసుకొచ్చింది జియో… ఒక్క రీచార్జ్తో రెండు ప్లాన్స్ అంటూ ఈ ప్రత్యేక ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.. కొత్త ప్లాన్ ధర రూ.750గా ఉంది.. Read Also: […]