తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం హాట్ టాపిక్… ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి.. త్వరలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా సమక్షంలో అధికారికంగా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక, ఆయన ఎమ్మెల్యే రాజీనామాకు వెంటనే స్పీకర్ ఆమోదం తెలపడంతో.. ఉప ఎన్నికల అనివార్యం అయ్యింది.. అయితే, తన సిట్టింగ్ స్థానాన్ని మరోసారి గెలుచుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా.. విజయం మాదంటే మాదేనంటూ బీజేపీ, టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.. ఇప్పటికే […]
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మరోసారి షాక్ ఇచ్చింది.. కీలక వడ్డీ రేట్లను మళ్లీ పెంచింది.. వడ్డీ రేట్లను పెంచడం మూడు నెలల్లో ఇది మూడోసారి.. ఎస్బీఐ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్)ని ఈ రోజు 20 బేసిస్ పాయింట్లు పెంచింది, ద్రవ్య విధాన కమిటీ బెంచ్ మార్క్ పాలసీ రేట్లను పెంచిన తర్వాత ఈ నిర్ణయం ప్రకటించింది. ఎస్బీఐ ఓవర్నైట్, నెల, మూడు నెలల […]
ఆర్మీలో చేరి దేశానికి సేవ చేశాడు.. చివరకు భారత 76వ స్వాతంత్ర్య దినోత్సవం రోజు.. జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తూ ప్రాణాలు వదిలాడు. కర్ణాటకలో జరిగిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య సంబరాలు అంబరాన్ని తాకాయి.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి.. ప్రతీ ఇంటిపై జెండా.. ప్రతీ గల్లీలో జెండా.. ప్రతీ ఊరిలో జెండా, ప్రతీ వీధిలో జెండా అనే తరహాలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్న వేళ.. కర్ణాటకలోని దక్షిణ […]
జంతువలకు ఏదైనా జరిగితే.. వాటిని ప్రేమించే వారు చూస్తూ ఊరుకోరు.. అయితే, తాజాగా, వీధికుక్కలతో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణతో ఒక మహిళ ఆగ్రాలో రెసిడెన్షియల్ సొసైటీ సెక్యూరిటీ గార్డును కొట్టి, అతనిపై దుర్భాషలాడారు.. ఆదివారం జరిగిన సంఘటన యొక్క వీడియో వైరల్గా మారడంతో ఆగ్రా పోలీసులు ఆ వీడియోను పరిశీలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జంతు హక్కుల కార్యకర్తగా చెప్పుకునే 20 ఏళ్లకు పైగా ఉన్న ఓ మహిళ.. సెక్యూరిటీ గార్డును తిడుతూ.. కర్రతో దాడిచేసిన […]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో కాల్ లీక్ వ్యవహారం రోజుకో మలుపు తీసుకుంటుంది. ఇప్పటికే ఈ వ్యవహారం జాతీయ స్థాయి వరకు వెళ్లిన విషం తెలిసిందే.. అయితే, అది ఒరిజినల్ కాదు.. ఫేక్ అని అనంతపురం జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.. కానీ, ఇప్పుడు మాధన్ న్యూడ్ వీడియో కాల్ ఎపిసోడులో ఫోరెన్సిక్ నివేదికను బయటపెట్టింది టీడీపీ.. అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి తెప్పించిన నివేదికను […]
తెలంగాణలో ప్రియాంకా గాంధీని రంగంలోకి దిపుతోంది కాంగ్రెస్ అధిష్టానం.. తెలంగాణ మాత్రమే కాకుండా దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలు ఆమెకు అప్పగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.. ప్రస్తుతానికి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన పూర్తిస్థాయి బాధ్యతలను ఆమె అప్పగించనున్నారు.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోనుంది కాంగ్రెస్ అధిష్టానం.. దీంతో, ఇప్పటి వరకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్గా ఉన్న మాణిక్యం ఠాగూర్ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తారనే చర్చ సాగుతోంది. […]
టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మనూర్ జయరాం.. కర్నూలు జిల్లా ఆలూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. కలియుగ రావణాసురులు చంద్రబాబు, లోకేష్ అంటూ మండిపడ్డారు.. రాష్ట్రంలో కొందరిని శూర్పణఖలను తయారు చేసిన ఘనత చంద్రబాబుదేనంటూ ఎద్దేవా చేశారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఫేక్ అని ఎస్పీ విచారణలో తేలిందని స్పష్టం చేసిన మంత్రి.. అయినా, ఆ వ్యవహారంలో ఇంకా వివాదం […]
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దిశగా చర్యలు చేపట్టాకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. రాజమండ్రిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన… ఆజాదీ కా అమృత మహోత్సవాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొక్కుబడిగా నిర్వహిస్తోందన్నారు.. మహనీయులను స్మరించడం మానుకొని, సాంస్కృతిక శాఖ మంత్రి రోజా సొంత ప్రచారం చేసుకుంటున్నారు.. ఇప్పటికైనా మానుకోవాలని సూచించిన ఆయన.. అనవసరమైన వాటికి రాష్ట్ర ప్రభుత్వం దుబారా ఖర్చులు చేస్తోందని.. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, […]
ఆసియా కప్కు ముందు భారత్, పాకిస్థాన్ జట్లకు షాక్ తప్పేలా లేదు. ఈనెల 27 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ జరగనుంది. ఈ టోర్నీ కోసం ఇండియా- పాకిస్థాన్తోపాటు మిగతా నాలుగు జట్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే టోర్నీలో ఫేవరెట్ జట్లుగా దాయాది దేశాలు భారత్- పాకిస్థాన్ ఉన్నాయి. ఈ రెండు జట్ల మధ్య తొలి పోరు… ఈనెల 28న దుబాయ్ వేదికగా జరగనుంది. అయితే ఆసియా కప్కు ముందు పాక్కు షాక్ తగిలే […]
కేంద్రంలోనే కాదు.. ఆంధ్రప్రదేశ్లోనూ 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్… ఇవాళ తిరుపతిలో కాంగ్రెస్ పాదయాత్ర నిర్వహించింది.. కేంద్ర మాజీ మంత్రులు సుబ్బరామిరెడ్డితో కలిసి పాల్గొన్నారు చింతా మోహన్.. ఈ సందర్భంగా అంబేద్కర్ భవన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చింతామోహన్ మాట్లాడుతూ.. ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అనని గుర్తుచేశారు.. నేడు దళితులు దేవాలయాలకు, విద్యాలయాలకు వెళ్తున్నారంటే కారణం కాంగ్రెస్ […]