IND vs NZ Final: 2026 T20 ప్రపంచ కప్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. మార్చి 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ – న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే, ఈ మెగా ఫైనల్కు వర్షం ముప్పు పొంచి ఉంటే విజేతను ఎలా నిర్ణయిస్తారు? ఐసీసీ (ICC) నిబంధనలు ఏం చెబుతున్నాయి? పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: LPG Production: LPG ఉత్పత్తిని పెంచండి.. ఇంధన సంస్థలకు కేంద్రం ఆదేశాలు..!
ఫైనల్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగితే ఫలితం కోసం ఐసీసీ కింది నిబంధనలను అమలు చేస్తుంది.
రిజర్వ్ డే (Reserve Day): మార్చి 8న వర్షం కారణంగా మ్యాచ్ సాధ్యం కాకపోయినా లేదా అసంపూర్తిగా ఆగినా, మరుసటి రోజు అంటే మార్చి 9ని ‘రిజర్వ్ డే’గా కేటాయించారు.
ఆగిన చోటు నుంచే..: ఒకవేళ మార్చి 8న టాస్ పడి, కొంత ఆట జరిగిన తర్వాత వర్షం పడితే, రిజర్వ్ డే నాడు మ్యాచ్ మళ్లీ మొదటి నుంచి కాకుండా ఆగిపోయిన పాయింట్ నుంచే కొనసాగుతుంది.
అదనపు సమయం: మ్యాచ్ పూర్తి చేయడానికి వీలుగా రెండు రోజులూ 120 నిమిషాల అదనపు సమయాన్ని కేటాయిస్తారు. ఓవర్ల తగ్గింపు ద్వారా అయినా ఫలితం రాబట్టేందుకు అంపైర్లు ప్రయత్నిస్తారు.
కనీస ఓవర్లు: ఫైనల్ ఫలితం తేలాలంటే రెండు జట్లు కనీసం 10 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది.
ఒకవేళ రెండు రోజులూ ఆట సాధ్యం కాకపోతే..
దురదృష్టవశాత్తూ మార్చి 8, 9 తేదీల్లో కూడా వర్షం కారణంగా మ్యాచ్ పూర్తి కాకపోతే, ఐసీసీ నిబంధనల ప్రకారం భారత్ – న్యూజిలాండ్ జట్లను ‘సంయుక్త విజేతలు’ (Joint Winners)గా ప్రకటిస్తారు. గతంలో 2002 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-శ్రీలంక మధ్య ఇలాగే టైటిల్ను పంచుకోవడం జరిగింది. అయితే టీమ్ ఇండియా వరుసగా రెండోసారి T20 ప్రపంచ కప్ గెలిచి చరిత్ర సృష్టించాలని పట్టుదలతో ఉంది. ఇప్పటివరకు ఏ జట్టు కూడా వరుసగా రెండు టైటిళ్లు నెగ్గలేదు. కానీ ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్పై భారత్కు అంత మంచి రికార్డు లేదు. ఇప్పటివరకు టీమ్ ఇండియా T20 ప్రపంచ కప్లో కివీస్ను ఓడించలేదు. ఈసారి ఆ రికార్డును తిరగరాయాలని టీమిండియా భావిస్తోంది. ఇదే సమయంలో తొలిసారి T20 ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడాలని న్యూజిలాండ్ కూడా ఎంతో కసితో ఉంది.
READ ALSO: Anuj Agnihotri: యూపీఎస్సీ 2025 టాపర్గా నిలిచిన డాక్టర్ అనుజ్ అగ్నిహోత్రి! ప్రస్థానం ఇదే..