Tragedy : మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ పోసిన స్కూల్ టీచర్.. ఆపై..!
- విజయవాడలో దారుణం.. చిన్నారిపై టీచర్ యాసిడ్ దాడి
- బాత్రూమ్లో పడిపోయిందంటూ మొదట మాయ మాటలు
- నిజం బయటపడటంతో స్కూల్ యాజమాన్యంపై ఆరోపణలు
- నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్షరాలు నేర్పించాల్సిన గురువే కాలయముడిలా మారింది. విజయవాడ విద్యాధరపురంలోని ‘నేషనల్ ప్లే స్కూల్’లో జరిగిన ఒక దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కేవలం మూడు సంవత్సరాల వయస్సున్న పసిపాపపై ఒక స్కూల్ టీచర్ యాసిడ్ పోసి తీవ్రంగా గాయపరిచిన ఘటన సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేస్తోంది.
ఫిబ్రవరి 23వ తేదీన పాప తల్లి తన కూతురిని యథావిధిగా స్కూల్ దగ్గర దింపి వెళ్లారు. అయితే, కాసేపటికే స్కూల్ నుండి తల్లికి ఫోన్ వచ్చింది. “మీ పాప బాత్రూమ్లో పడిపోయింది, దెబ్బలు తగిలాయి” అని టీచర్ సమాచారం అందించారు. కంగారుగా స్కూల్కు చేరుకున్న తల్లి, ఏడుస్తున్న చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ, ఆసుపత్రిలో వైద్యులు పరీక్షించాక అసలు నిజం బయటపడింది. పాప ఒంటిపై ఉన్న గాయాలు పడిపోవడం వల్ల వచ్చినవి కావు, అవి యాసిడ్ పోయడం వల్ల కలిగిన కాలిన గాయాలని వైద్యులు ధృవీకరించారు.
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- Viral: నైట్ కు వస్తావా..? రేట్ ఎంత..? అర్ధరాత్రి బస్టాండ్ వద్ద సీపీతో బేరం ఆడిన పోకిరీలు.
- Krishna Deer Hunting : కృష్ణ జింకల వేట.. ముగ్గురు నిందితుల అరెస్ట్..!
- Actor Santhosh Nair Dies: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు సంతోష్ నాయర్ మృతి.. భార్య పరిస్థితి విషమం
Gold Rates: శుభవార్త.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. 10 గ్రాముల ధర ఎంతంటే..
వైద్యుల మాటలతో దిగ్భ్రాంతికి గురైన తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. మొదట బుకాయించినప్పటికీ, గట్టిగా అడిగేసరికి టీచర్ అమానుషంగా పాపపై యాసిడ్ పోసినట్లు యాజమాన్యం అంగీకరించింది. ఆసుపత్రి బిల్లు కట్టిన యాజమాన్యం, ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేయాలని, కొంత డబ్బు తీసుకుని రాజీకి రావాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చింది. అయితే, తమ అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురికి జరిగిన అన్యాయంపై రాజీ పడటానికి తల్లిదండ్రులు నిరాకరించారు.
తల్లిదండ్రులు వెనక్కి తగ్గకపోవడంతో స్కూల్ ప్రిన్సిపాల్ తన అసలు రూపాన్ని బయటపెట్టారు. ఈ విషయాన్ని బయట చెబితే మీ అంతు చూస్తామంటూ తల్లిదండ్రులకు బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా, నగర డీసీపీ (DCP) తమకు బంధువని, పోలీసులకు ఫిర్యాదు చేసినా తమను ఏమీ చేయలేరంటూ బెదిరింపులకు దిగారు. బాధితులు భయపడతారనే ఉద్దేశంతో అధికార బలాన్ని చూపిస్తూ యాజమాన్యం ఆడుతున్న ఈ నాటకం ఇప్పుడు కలకలం రేపుతోంది.
తమ కళ్లముందే చిన్నారి నరకయాతన అనుభవిస్తుంటే, కనీసం జాలి లేకుండా బెదిరింపులకు దిగుతున్న స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ క్రూరమైన చర్యకు పాల్పడిన టీచర్ను, దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించిన ప్రిన్సిపాల్ను వెంటనే అరెస్ట్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Social Media Ban : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి సోషల్ మీడియా బ్యాన్
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!