చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ నేతలు విషాదంలో మునిగిపోయారు.. ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు మృతిచెందారు.. ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో ఈ ప్రమాదం జరిగింది.. బాపట్ల జిల్లా జె పంగులూరు మండలం కొండ మంజులూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీడీపీ నాయకులు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. టీడీపీ ముఖ్య నేతలైన భాను ప్రకాష్రెడ్డి, గంగపల్లి భాస్కర్.. ఓ వివాహానికి గుంటూరుకు కారులో బయల్దేరి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.. వారు […]
వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ టాప్లో నిలవడంపై సంతోషం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి.. 2021–22లో ఏపీ స్థూల ఉత్పత్తి వృద్ధిరేటు 11.43 శాతంగా నిలవడం సంతోషకరమన్న ఆయన.. దేశ వృద్ధిరేటు కంటే అధికంగా ఉంది.. పారదర్శక విధానాలే ఈ వృద్ధికి మూలకారణమని భావిస్తున్నాం అన్నారు.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్లు వేసేందుకు సిద్ధం అయ్యారు పోలీసులు.. ప్రజా సంగ్రామ యాత్ర నిలిపివేయాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. అనంతబాబు తల్లి అనారోగ్య కారణాలతో ఆదివారం మృతి చెందగా.. ఈ నేపథ్యంలో తన తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేలా తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో.. అనంతబాబుకు 3 రోజుల పాటు బెయిల్ మంజూరు చేస్తూ రాజమహేంద్రవరం కోర్టు పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.. ఇక, ఈ నెల 25 మధ్యాహ్నం తిరిగి […]
దేవాదాయ, ధర్మాదాయశాఖపై ప్రతీ మంగళవారం సమీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించారు ఏపీ డిప్యూటీ సీఎం, దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.. ప్రతీ మంగళవారం ధర్మాదాయ శాఖకు సంబంధించిన సమీక్ష చేపడుతున్నాం, అర్చకులకు సంబంధించిన గౌరవ వేతనం పెంపుదలపై కసరత్తు జరుగుతోందన్నారు. కందుకూరి వీరేశలింగం గారు రాజమండ్రిలో హితకారిణి సమాజాన్ని ఏర్పాటు చేశారు.. అటువంటి ఎయిడెడ్ కాలేజీల గడువు ముగిసిన తర్వాత నిర్వహణ కష్టం అవుతుందని తెలిపారు.. హిత కారిణి సమాజం ద్వారా ఏర్పాటు చేసిన కాలేజీను విద్యాశాఖకు […]
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని మాయదార్లపల్లి గ్రామం విద్యార్థుల లేఖ రాశారు.. మారుమూల ప్రాంతమై ఎక్కడో విసరి వేయబడ్డట్లు ఉన్న కర్ణాటక బార్డర్ లోని చిట్ట చివరి గ్రామాలైన మాయదార్లపల్లి.. ఎలాంటి అభివృద్ధి పనులకు నోచుకోలేదు.. కనీసం మండల కేంద్రానికి చేరుకోవాలంటే సరైన బస్సు సౌకర్యం కూడా లేని పరిస్థితి… ఇక, ఆ గ్రామ విద్యార్థులకు కొత్త కష్టాలు వచ్చాయి.. గత 45 రోజులుగా మాయదార్లపల్లి ఆ గ్రామ విద్యార్థులను బసాపురం […]
ప్రంపచ కుభేరుడు, టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ చేసిన పనికి ఇప్పుడు సోషల్ మీడియా ఫిదా అయిపోయింది.. తన ట్విటర్ ఫాలోవర్, భారతదేశానికి చెందిన తన చిరకాల మిత్రుడిని సర్ప్రైజ్ చేశారు మస్క్.. టీసీఎస్లో పనిచేస్తున్నసాఫ్ట్వేర్ డెవలపర్ ప్రణయ్ పాథోల్ను ఆత్మీయంగా కలుసుకున్నారు… అయితే ఈ విషయాన్ని పాథోల్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్గా మారిపోయింది.. ఫొటోను మాత్రమే షేర్ చేయడం కాదు.. పాథోల్ ఆ ఫొటోకు ఒక శీర్షికను జోడించాడు.. అక్కడ అతను తనను […]
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్పై ఫైర్ అవుతున్నారు వైసీపీ నేతలు.. తాజాగా, పవన్ చేసిన వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కామెంట్లపై ఘాటుగా స్పందిస్తున్నారు ఆ పార్టీ నేతలు.. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి అమర్నాథ్… పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో పుట్టిన రోజు నాడు చిరంజీవికి వేదన మిగులుస్తున్నారన్నారు.. కొణిదెల పవన్ కల్యాణ్ అనాలో.. నారా, నాదెండ్ల పవన్ కల్యాణ్ అనాలో కూడా అర్ధం కావడం లేదన్న ఆయన.. మెగాస్టార్ కుటుంబంలో అమ్ముడిపోయే వ్యక్తి ఉన్నందుకు బాధపడుతున్నాం.. […]
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ డిన్నర్ భేటీ.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రచ్చ రేపుతోంది.. ఈ భేటీలో సినిమాకు సంబంధించిన చర్చ, సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావన వచ్చిందని బీజేపీ నేతలు చెబుతున్నా.. ఇది పక్కా రాజకీయ చర్చ జరిగిన సమావేశంగా ప్రచారం సాగుతోంది.. ఈ తరుణంలో షా-ఎన్టీఆర్ భేటీపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని.. ఈ పరిణామాలపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. […]