Telangana Unity Vajrotsavam: ఇవాళ్టి నుంచి తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూమి కోసం, భుక్తి కోసం.. వెట్టి చాకిరి విముక్తి కోసం.. తెలంగాణలో సాగిన సాయుధ రైతాంగ పోరాటం ఎన్నో పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచింది.. భారత్కు ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం వస్తే.. నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ ప్రాంతం మాత్రం.. సెప్టెంబర్ 17వ తేదీన భారత్లో విలీనం అయ్యింది.. ఈ పరిణామం జరిగి 75 ఏళ్లు అయిన సందర్భంగా… తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం.. మూడు రోజులపాటు ఉత్సవాలను నిర్వహిస్తోంది.. ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి లోటు లేకుండా చర్యలు తీసుకోవాలని, స్వయంగా పర్యవేక్షించాలని కలెక్టర్లను, ఎస్పీలను ఇప్పటికే సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.. మరోవైపు.. సచివాలయం, అసెంబ్లీ సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను, ప్రధాన కూడళ్లను విద్యుత్తు దీపాలతో అలంకరించారు.. రాత్రి అయితే చాలు.. విద్యుత్ దీపాల కాంతాల్లో ఆయా ప్రాంతాలు వెలిగిపోతున్నాయి.
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
- Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
మూడు రోజుల పాటు జరగనున్న తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా ఇవాళ సెప్టెంబర్ 16న అన్ని నియోజకవర్గాలలో ర్యాలీలు నిర్వహించనున్నారు.. ప్రతీ నియోజకవర్గంలో దాదాపు 15 వేల మందితో ర్యాలీలు నిర్వహించి తెలంగాణ సమైక్యతను ఎలుగెత్తి చాటాలని నిర్ణయించింది సర్కార్.. ర్యాలీల్లో విద్యార్థులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనేలా ప్లాన్ చేశారు.. రెండో రోజైన శనివారం.. అదే భారత్ యూనియన్లో తెలంగాణ కలిసిన రోజైన సెప్టెంబర్ 17న హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం బంజారాహిల్స్లో నిర్మించిన కుమ్రంభీం ఆదివాసీ భవన్, సంత్ సేవాలాల్ బంజారా భవన్ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్న సీఎం కేసీఆర్. ఈ బహిరంగ సభకు గిరిజన ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖలకు చెందిన అధికారులతో పాటు పెద్ద ఎత్తున ఆదివాసి, గిరిజన తెగలకు చెందిన ప్రజలు హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇక, నెక్లెస్ రోడ్ నుంచి గుస్సాడీ, గోండు, లంబాడి తదితర 30 కళారూపాల కళాకారులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. మరోవైపు, జిల్లా కేంద్రాల్లో మం త్రులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాలు ఆవిష్కరించనున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో అధికారులు, కమిషనర్లు, చైర్మన్లు, సర్పంచ్లు జాతీయ జెండా ఎగురవేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు.. ఈనెల 18న అన్ని జిల్లా కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించి, స్వాతంత్య్ర సమరయోధులు, కళాకారులను సన్మానించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మూడు రోజుల కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు..
తాజావార్తలు
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!