Telangana Unity Vajrotsavam: ఇవాళ్టి నుంచి తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూమి కోసం, భుక్తి కోసం.. వెట్టి చాకిరి విముక్తి కోసం.. తెలంగాణలో సాగిన సాయుధ రైతాంగ పోరాటం ఎన్నో పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచింది.. భారత్కు ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం వస్తే.. నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ ప్రాంతం మాత్రం.. సెప్టెంబర్ 17వ తేదీన భారత్లో విలీనం అయ్యింది.. ఈ పరిణామం జరిగి 75 ఏళ్లు అయిన సందర్భంగా… తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం.. మూడు రోజులపాటు ఉత్సవాలను నిర్వహిస్తోంది.. ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి లోటు లేకుండా చర్యలు తీసుకోవాలని, స్వయంగా పర్యవేక్షించాలని కలెక్టర్లను, ఎస్పీలను ఇప్పటికే సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.. మరోవైపు.. సచివాలయం, అసెంబ్లీ సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను, ప్రధాన కూడళ్లను విద్యుత్తు దీపాలతో అలంకరించారు.. రాత్రి అయితే చాలు.. విద్యుత్ దీపాల కాంతాల్లో ఆయా ప్రాంతాలు వెలిగిపోతున్నాయి.
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
- Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
- Mephedrone Seized : బీబీనగర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
- DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
మూడు రోజుల పాటు జరగనున్న తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా ఇవాళ సెప్టెంబర్ 16న అన్ని నియోజకవర్గాలలో ర్యాలీలు నిర్వహించనున్నారు.. ప్రతీ నియోజకవర్గంలో దాదాపు 15 వేల మందితో ర్యాలీలు నిర్వహించి తెలంగాణ సమైక్యతను ఎలుగెత్తి చాటాలని నిర్ణయించింది సర్కార్.. ర్యాలీల్లో విద్యార్థులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనేలా ప్లాన్ చేశారు.. రెండో రోజైన శనివారం.. అదే భారత్ యూనియన్లో తెలంగాణ కలిసిన రోజైన సెప్టెంబర్ 17న హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం బంజారాహిల్స్లో నిర్మించిన కుమ్రంభీం ఆదివాసీ భవన్, సంత్ సేవాలాల్ బంజారా భవన్ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్న సీఎం కేసీఆర్. ఈ బహిరంగ సభకు గిరిజన ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖలకు చెందిన అధికారులతో పాటు పెద్ద ఎత్తున ఆదివాసి, గిరిజన తెగలకు చెందిన ప్రజలు హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇక, నెక్లెస్ రోడ్ నుంచి గుస్సాడీ, గోండు, లంబాడి తదితర 30 కళారూపాల కళాకారులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. మరోవైపు, జిల్లా కేంద్రాల్లో మం త్రులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాలు ఆవిష్కరించనున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో అధికారులు, కమిషనర్లు, చైర్మన్లు, సర్పంచ్లు జాతీయ జెండా ఎగురవేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు.. ఈనెల 18న అన్ని జిల్లా కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించి, స్వాతంత్య్ర సమరయోధులు, కళాకారులను సన్మానించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మూడు రోజుల కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు..
తాజావార్తలు
-
Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
-
Korean Kanakaraju Collections: వరుణ్ తేజ్కు బ్రేక్ఈవెన్.. 3 రోజుల్లోనే 37 కోట్లు కొల్లగొట్టిన ‘కొరియన్ కనకరాజు’!
-
Akhil Akkineni : పవన్ సాదినేని దర్శకత్వంలో అఖిల్ అక్కినేని
-
IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
-
Slum Dog 33 Temple Road: టబు పోలీస్ గెటప్.. పూరీ ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ నుంచి మైండ్ బ్లోయింగ్ గ్లింప్స్!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!