AP Assembly Session Live Updates: రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ అప్డేట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండో రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. తొలిరోజు వాడీవేడీగా సాగిన సమావేశాలు.. మూడు రాజధానుల వ్యవహారం అసెంబ్లీలో కాకరేపింది.. ఇక, రెండో రోజు కూడా రసవత్తరమైన చర్చ జరగనుంది.. ఇవాళ ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైంది..
Also Read
- Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- OTR: పశ్చిమ గోదావరి వైసీపీలో నిస్తేజం.. పదవులు అనుభవిస్తున్నా గళం వినిపించని లీడర్లు!
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
-
16 Sep 2022 03:44 PM (IST)
అసెంబ్లీ సోమవారానికి వాయిదా
సీఎం జగన్ ప్రసంగం అనంతరం ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం వెల్లడించారు.
-
16 Sep 2022 03:02 PM (IST)
చంద్రబాబు హయాంలోనే అప్పులు పెరిగాయి-జగన్
2014 నాటికి ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులు రూ.14వేల కోట్లు మాత్రమే.. 2019లో చంద్రబాబు దిగిపోయేనాటికి ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులు రూ.59వేల కోట్లకు ఎగబాకాయి.. చంద్రబాబు హయాంలో అప్పులు ఏకంగా 123.52 శాతం పెరిగాయి.. చంద్రబాబు దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పులు రూ.2.69 లక్షల కోట్లు.. ప్రస్తుతం రాష్ట్ర అప్పు రూ.3.82 లక్షల కోట్లు.. మూడేళ్లలో రాష్ట్ర రుణం 41.83 శాతం పెరిగింది-సీఎం జగన్
-
16 Sep 2022 02:32 PM (IST)
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ముప్పేమీ లేదు
ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బాగానే ఉందన్నారు సీఎం వైఎస్ జగన్... రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ముప్పు ఏమీ లేదని స్పష్టం చేశారు.. రాష్ట్రానికి నిధులు రానివ్వకపోతే పథకాలు ఆగిపోతాయని కొన్ని శక్తులు అనుకుంటున్నాయి.. కోవిడ్ లాంటి సవాళ్లు ఎదురైనా గత ప్రభుత్వం కంటే మెరుగ్గా.. దేశంలోని చాలా రాష్ట్రాల కంటే బాగా ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తున్నామన్నారు..
-
16 Sep 2022 02:06 PM (IST)
చంద్రబాబుపై మంత్రి అమర్నాథ్ సెటైర్లు..
వందల ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ను తానే కట్టానంటూ గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తారంటూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు మంత్రి అమర్నాథ్.. సెల్ఫోన్లు తానే కనిపెట్టానంటారంటూ ఎద్దేవా చేసిన ఆయన... టీడీపీ హయాంలో ప్రాజెక్టులు వచ్చింది లేదు.. పైగా ఉన్నవే మూతబట్టారన్నారు..
-
16 Sep 2022 11:59 AM (IST)
టీడీపీ సభ్యుల సస్పెన్షన్
శాసనసభలో టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది.. వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టారు టీడీపీ సభ్యులు.. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేశారు.. ఇక, స్పీకర్ టేబుల్ గట్టిగా చరిచారు టీడీపీ ఎమ్మెల్యే అనగాని.. దీంతో, ఒక్క రోజు పాటు సభ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.
-
16 Sep 2022 10:53 AM (IST)
అసెంబ్లీకి టీ బ్రేక్
ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం పూర్తి అయ్యింది.. ఆ తర్వాత అసెంబ్లీకి టీ బ్రేక్ ఇచ్చారు స్పీకర్ తమ్మినేని సీతారాం... టీ బ్రేక్ తర్వాత తిరిగి అసెంబ్లీ సమావేశం కానుంది.
-
16 Sep 2022 10:27 AM (IST)
టీడీపీ హయాంలో దోచుకోవడం, దాచుకోవడమే జరిగింది - విడదల రజని
ప్రతి పౌరుడికి చౌకగా వైద్యం అందించేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని విడదల రజని అన్నారు. వైద్యం కోసం ప్రజలు పక్క రాష్ట్రాలకు వెళ్లకూడదన్నదే ధ్యేయమన్నారు.రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మెడికల్ కాలేజ్ల పనులు వేగవంతంగా సాగుతున్నాయని, గత టీడీపీ హయాంలో ఒక్క మెడికల్ కాలేజ్నూ తీసుకురాలేదన్నారు. టీడీపీ హయాంలో దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే జరిగిందని విడదల రజని తెలిపారు.
-
16 Sep 2022 10:07 AM (IST)
జగన్ సీఎం అయ్యాక భక్తుల విశ్వాసాలను నిలబెట్టారు -కొట్టు సత్యనారాయణ
టీడీపీ హయాంలో దేవాలయాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని కొట్టు సత్యనారాయణ అన్నారు. టీడీపీ హయాంలో 23 దేవాలయాలను కూలగొట్టారని అన్నారు. రూ. కోటికి పైగా ఖర్చు చేసి రథాన్ని తయారు చేశామన్నారు. రూ. 3 కోట్లతో రామతీర్థం ఆలయాన్ని పునరుద్ధరించామని తెలిపారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక భక్తుల విశ్వాసాలను నిలబెట్టారన్నారు. చంద్రబాబు షూటింగ్ పిచ్చికి అమాయకులు బలయ్యారని కొట్టు సత్యనారాయణ తెలిపారు.
-
16 Sep 2022 09:50 AM (IST)
సోమవారం మధ్యాహ్నం డిప్యూటీ స్పీకర్ ఎన్నిక- స్పీకర్ తమ్మినేని
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. రెండో రోజు సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు చేపట్టారు స్పీకర్ తమ్మినేని. సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుందని స్పీకర్ తమ్మినేని ప్రకటించారు.
-
16 Sep 2022 09:49 AM (IST)
చట్టంలో ఏముందో టీడీపీ నేతలు చదివారా? - మంత్రి బుగ్గన
స్టీల్ ప్లాంట్ కోసం బడ్జెట్లో రూ. 250 కోట్లు పెట్టామని మంత్రి బుగ్గన తెలిపారు. 480 ఎకరాలకు రూ. 37 కోట్ల పరిహారం ఇచ్చామన్నారు. చట్టంలో ఏముందో టీడీపీ నేతలు చదివారా? అంటూ సీరియస్ అయ్యారు మంత్రి బుగ్గన.
-
16 Sep 2022 09:47 AM (IST)
కడప స్టీల్ప్టాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది- గుడివాడ అమర్నాథ్
పారిశ్రామికాభివృద్ధిని అడ్డుకునేందుకు టీడీపీ యత్నాలు. పరిశ్రమల ఏర్పాటుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. పరిశ్రమల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు. బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ లేఖ రాశారు. కడప స్టీల్ప్టాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.
-
16 Sep 2022 09:11 AM (IST)
రెండో రోజు అసెంబ్లీ ప్రారంభం..
తొలిరోజు వాడీవేడీగా సాగిన ఆంధ్రప్రదేశ్ సమావేశాలు.. రెండో రోజు ప్రారంభం అయ్యాయి.. ఇవాళ ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైంది..
ట్రెండింగ్
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?