Hyderabad Crime: బాలిక గ్యాంగ్ రేప్ కేసులో కొత్త ట్విస్ట్.. ఇంత జరిగిందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసు కలకలం రేపుతుండగా… ఇది, కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి… డబీర్పురా రేప్ కేసులో మరో ట్విస్ట్ వచ్చి చేరింది… 12వ తేదీన మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశారు రబీష్మెహది, అహ్మద్ అనే ఇద్దరు యువకులు… అబిడ్స్ నుండి నాంపల్లి స్టేషన్ రోడ్డులోని ఓ హోటల్ లోకి తీసుకెళ్లారు.. 12వ తేదీ రాత్రి 8 గంటలకు బాలికను తీసుకొని వచ్చిన ఇద్దరు జాదూగాళ్లు.. హోటల్లోని రూమ్ నెంబర్ 407లో బాలికను దింపారు.. ఇక, బాలికకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి రూమ్లోనే పడుకోబెట్టి బయటికి వెళ్లిపోయారు.. ఆ తర్వాత తిరిగి వచ్చేసరికి డోర్ లాక్ పడిపోయింది.. అప్పటికే బాలిక మత్తులో ఉండటంతో డోర్ తీయలేదు.. దీంతో డోర్ ను పగులగొట్టి లోపలికి వెళ్లినట్టు లాడ్జి నిర్వాహకులు చెబుతున్నారు..
Read Also: Hyderabad Crime: ఓల్డ్ సిటీలో దారుణం.. బాలిక కిడ్నాప్, లాడ్జిలో నిర్బంధించి లైంగికదాడి..
Also Read
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
- Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
అయితే, బాలికను కిడ్నాప్ చేసిన ఇద్దరు యువకులు లాడ్జిలో పెట్టి.. ఆమెకు మత్తు మందు ఇచ్చి రెండు రోజుల పాటు గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు.. మరో యువకుడు కూడా బాలికపై అత్యాచారం చేసినట్టుగా తెలుస్తోంది.. అనంతరం బాలికను లాడ్జిలోనే వదిలి పరారయ్యారు.. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరో యువకుడి కోసం గాలిస్తున్నారు.. బాలికను లాడ్జిలకు తిప్పుతూ అత్యాచారం చేసినట్టుగా తెలుస్తోంది.. ఇక, బాలికను భరోసా కేంద్రాన్ని తరలించిన పోలీసులు.. ఆమె నుంచి స్టేట్ మెంట్ తీసుకున్నారు..
బాలికకు మత్తు మందు ఇవ్వడమే కాకుండా.. ఆ ముగ్గురు యువకులు కూడా గంజాయి తీసుకుని బాలకిపై అత్యాచారం చేసినట్టు చెబుతున్నారు పోలీసులు.. లాడ్జిలో రెండు రోజుల పాటు బాలికను చిత్రహింసలు గురిచేశారు కామాంధులు.. గంజాయి, మత్తు ఇంజక్షన్ల అమ్మకాల్లో రబీష్, నిమాయత్ కీలక సూత్రధారులుగా పోలీసులు చెబుతున్నారు.. అయితే, ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన సంబంధిత లాడ్జి నిర్వాహకలు.. 12వ తేదీ రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో రూమ్ తీసుకున్నారు.. మేజర్ కావడంతో అతనికి రూమ్ ఇచ్చాం.. ముందు అమ్మాయి, అబ్బాయి వచ్చారు.. ఆ తర్వాత ఇంకో అబ్బాయి వస్తే అనుమతిలేదని పంపించామని.. 14వ తేది మధ్యాహ్నం చెక్ఔట్ చేశారని తెలిపారు.. అప్పుడు ఇద్దరు అబ్బాయిలు, అమ్మాయి కనిపించారని తెలిపారు.. ఇంకో అతను ఎప్పుడు లోపలికి వెళ్లాడో తెలియదంటున్నారు..
ఇక, ఈ ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిన్న రాత్రి అమ్మాయితో పాటు అబ్బాయిని తీసుకొని సంబంధిత లాడ్జికి వెళ్లారు.. రూమ్ను పరిశీలించారు.. లాడ్జి సిబ్బందిని విచారించారు… అయితే, వారు లాడ్జికి వచ్చేటప్పుడే మత్తులో ఉన్నట్టు చెబుతున్నారు లాడ్జి సిబ్బంది.. ఆ అమ్మాయికి ఇంజక్షన్లు ఇచ్చారు వీళ్ళు కూడా ఇంజక్షన్లు తీసుకున్నారని అనుమానాలు వ్యక్తం చేశారు.. ఐడీ కార్డ్ ఇవ్వాలంటూ ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదని.. చివరకు మేం గొడవ చేయడంతో ఖాళీ చేసి వెళ్లిపోయారని చెబుతున్నారు.. మొత్తంగా మైనర్ బాలిక కిడ్నాప్, మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!