నెల రోజుల పాటు ఏసీ బస్సుల ఛార్జీల్లో డిస్కౌంట్ తీసుకొచ్చింది... ఏసీ బస్సుల్లో తాత్కాలికంగా ఛార్జీలు తగ్గించింది ఆర్టీసీ.. ఏసీ బస్సుల ఛార్జీలో 20 శాతం వరకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ఒక విఫల నాయకుడు.. కుప్పం నియోజకవర్గాన్ని కూడా నిలుపుకోలేక పోయారని వ్యాఖ్యానించారు.. చంద్రబాబు తాను మొదటి సారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన రోజును ఘనంగా నిర్వహించుకున్నారు.. మొదటి సారి ముఖ్యమంత్రి ఎలా అయ్యారో, పదవి కోసం పన్నిన కుట్రలు కూడా ప్రజలకు చెబితే బాగుండేదని ఎద్దేవా చేశారు.. ఎన్టీఆర్ అద్భుతమైన […]
వినియోగదారుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎడిట్ బటన్ను పరీక్షిస్తున్నట్టు ట్విట్టర్ పేర్కొంది.. మైక్రో బ్లాగింగ్ సైట్ ఈ ఫీచర్ను పరీక్షిస్తున్నట్లు ట్వీట్ ద్వారా తెలిపింది. "మీరు ఎడిట్ చేసిన ట్వీట్ను చూసినట్లయితే, మేము ఎడిట్ బటన్ను పరీక్షిస్తున్నందున ఇది జరుగుతుంది" అని కంపెనీ ట్వీట్లో పేర్కొంది.
కొన్ని వ్యవస్థలు అవినీతిలో కూరుకుపోయాయని ఆరోపణలు ఉన్నాయి.. అందులో పోలీసు డిపార్ట్మెంట్పై కూడా విమర్శలు ఉన్నాయి.. ఇప్పటికే కింది స్థాయి ఉద్యోగుల నుంచి ఆఫీసర్ల వరకు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన ఘటనలు ఎన్నో వెలుగుచూశాయి.. అయితే, ఓ కానిస్టేబుల్.. ఏకంగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)కే దమ్కీ ఇచ్చాడు.. సివిల్ డ్రెస్లో ఉన్న ఆయన్ను గుర్తుపట్టలేకపోయిన ఆ కానిస్టేబుల్.. ముందు రూల్స్ మాట్లాడాడు.. చలానా రాయమంటారా? అంటూ డీసీపీని బెదిరించాడు ట్రాఫిక్ […]
ఆంధ్రప్రదేశ్ మంత్రి విశ్వరూప్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఈ రోజు ఉదయం అమలాపురంలో నిర్వహించిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న ఆయన.. ఆ తర్వాత అస్వస్థతకు గురైనట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.. దీంతో.. హుటాహుటిన మంత్రి విశ్వరూప్ను.. రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు అనుచరులు.. ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్ష పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఎలా […]
టెక్నాలజీ యుగంలో ప్రతీ చేతిలో స్మార్ట్ఫోన్.. అందులో నచ్చిన యాప్లతో పాటు సోషల్ మీడియాకు సంబంధించిన యాప్లు ఉండాల్సింది.. అందులో మరీ ముఖ్యంగా వాట్సాప్ ఉంటేనే రోజు గడిచేది.. మెసేజ్ చేయాలన్నా.. వాయిస్ మెసేజ్ పెట్టాలన్నా.. ఫోటోలు, వీడియోలు షేర్ చేయాలన్నా.. వాయిస్ కాల్ చేయాలన్నా.. చివరకు వీడియో కాల్ చేయాలన్నా.. ఇప్పుడు వాట్సాప్పై ఆధారపడిపోతున్నారు.. ప్రతీ యూజర్ ఈజీగా వాట్సాప్ వాడేస్తున్నారు.. అయితే, వాట్సాప్ వినియోగదారులారా అలర్ట్ కావాల్సిన సమయం వచ్చింది.. కొన్ని పాత ఐఫోన్లకు […]
గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం గురించి సమాచారం ఇస్తే రూ.25 లక్షలు రివార్డుగా ఇస్తామని ప్రకటించింది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ).. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో కీలక నిందితుడు, పరారీలో ఉన్న అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అరెస్టుకు దారితీసే ఏదైనా సమాచారం ఇస్తే 25 లక్షల రూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించింది. ఇక, ఇబ్రహీం సన్నిహితుడు షకీల్ షేక్ అలియాస్ ఛోటా షకీల్పై రూ. 20 లక్షలు, సహచరులు హాజీ […]
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు అదరడొగుతున్నాయి.. ఆగస్టు నెలలో జీఎస్టీ ద్వారా ఏకంగా రూ. 1,43,612 కోట్లు వసూలు అయ్యాయి.. 2021లో అదే నెలలో వచ్చిన జీఎస్టీ రాబడి కంటే 2022 ఆగస్టు నెల ఆదాయాలు 28 శాతం ఎక్కువ అని.. వరుసగా ఆరు నెలలుగా GST ఆదాయం రూ. 1.4 లక్షల కోట్ల కంటే ఎక్కువ వసూలు అవుతుందని ప్రకటించింది కేంద్ర ఆర్థికశాఖ.. ఈ ఏడాది ఆగస్టులో మొత్తం రూ.1,43,612 కోట్ల రూపాయల జీఎస్టీ […]
భారీ వరదల ధాటికి పాకిస్థాన్ అతలాకుతలమైంది. దాదాపు 33 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. 1,136 మంది మరణించారు. 16వందల మందికిపైగా గాయపడ్డారు. పది లక్షల నివాసాలు ధ్వంసమయ్యాయి. చాలా మందికి జీవనాధారంగా 7.35 లక్షల పశుసంపదను కోల్పోయారు. పెద్ద ఎత్తున రోడ్లు, 20 లక్షల ఎకరాల్లో పంట కొట్టుకుపోయాయ్. 10 బిలియన్ డాలర్లకు పైగా ఆస్తినష్టం వాటిల్లింది. దేశవ్యాప్తంగా దాదాపు 150 వంతెనలు కొట్టుకుపోయాయి. 3,500 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి.. అయితే, ఆ దేశం.. అంతర్జాతీయ […]
అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ నెలలోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.. ఈ నెల మూడో వారంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు… ఈ సారి వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు… ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఏపీ కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.. ఈ నెల 24వ […]