Rat Stolen: ఎలుక ఎత్తుకెళ్లారని ఫిర్యాదు.. ముగ్గురిపై కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలీసులకు ఓ వెరైటీ ఫిర్యాదు అందింది.. ఈ తరహా ఘటనలు తమ దృష్టికి రావడం మొదటి సారి అంటున్నారు పోలీసులు.. ఎందకంటే.. ఇప్పటి వరకు దొంగలు పడ్డారు, నన్ను దోచుకున్నారు, ఇంట్లో ఉన్న బంగారం, నగదు ఎత్తుకెళ్లారు, కారు పోయింది, బైక్ పోయింది.. ఇంకా రకరకాల ఫిర్యాదులు పోలీసులకు అందాయి.. అందులో కొన్ని పరిష్కారం అయితే, మరికొన్ని ఎటూ తేలకుండా పోయిన కేసులు కూడా లేకపోలేదు.. అయితే, రాజస్థాన్లో ఓ వ్యక్తి తన ఎలుక పోయిందంటూ ఫిర్యాదు చేసి ఇప్పుడు సోషల్ మీడియాకు పనిచెప్పారు..
Read Also: Astrology : అక్టోబర్ 03, సోమవారం దినఫలాలు
Also Read
- Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్లోని బాంసవాఢా జిల్లా సజ్జన్గఢ్ పోలీస్స్టేషన్ పరిధిలోని పడ్లా వాఢ్కియా గ్రామానికి చెందిన మంగు అనే 62 ఏళ్ల వ్యక్తి.. పోలీసు స్టేషన్కు వెళ్లారు.. తాను పెంచుకుంటున్న ఎలుక కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు.. ఆ ఎలుక కలర్, బరువుకు సంబంధిచిన కొన్ని గుర్తులకు కూడా చెప్పారు.. తాను పెంచుకునే ఎలుక 700 గ్రాముల బరువు ఉంటుందని.. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి కనిపించడం లేదు.. ఎవరో ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశారు.. అంతే కాదండోయే.. తన ఎలుకను వారే ఎత్తుకెళ్లిఉంటారంటూ.. తన సోదరుడి ముగ్గురు కుమారులైన సురేష్, మోహిత్, అరవింద్ పై అనుమానం వ్యక్తం చేశాడు.. ఎలుక మిస్సింగ్పై కేసు నమోదు చేసేందుకు మొదట నిరాకరించారు పోలీసులు.. అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.. కానీ, అతడు ఎంతకీ వినకపోవడంతో.. చివరకు ఎఫ్ఐఆర్ నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.. ఎఫ్ఐఆర్లో ఫిర్యాదుదారుడు అనుమానం వ్యక్తం చేస్తున్న ముగ్గురి పేర్లను చేర్చి నిందితులుగా పేర్కొన్నారు.. ఐపీసీ 457, 380 కింది కేసు నమోదు చేశామని.. ముగ్గురు నిందితులను విచారణకు పిలిచామని తెలిపారు సజ్జన్గఢ్ పోలీసు అధికారి ధన్పత్ సింగ్. అయితే, ఈ తరహా ఫిర్యాదు అందడం ఇదే తొలిసారి అంటున్నారు పోలీసులు.. గతంలో పెంపుడు కుక్కలు, పిల్లులు తప్పిపోయాంటూ పోలీసులను ఆశ్రయించడం.. పోస్టర్లు, కరపత్రాలు వేసి మరీ.. తమ తప్పిపోయిన జంతువులను అప్పగిస్తే.. డబ్బులు ఇస్తామంటూ ప్రకటనలు చేసిన ఘటనలు వెలుగుచూసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Police Lathi Testing: పోలీసుల “లాఠీ”లకు ఇన్ని పరీక్షలా.. మనుషుల్ని కొట్టి మరీ పరీక్షిస్తారా.?
-
Doctors Strike : జూనియర్ డాక్టర్ల సమ్మె.. ఏపీ సర్కార్కు వైద్యుల అల్టిమేటం.!
-
NTR : ఎన్టీఆర్కు సర్జరీ..కిమ్స్ ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల
-
Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మకు షాక్.. విచారణ కమిటీ సంచలన రిపోర్ట్
-
Tollywood : ఈమధ్య సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణమిదేనా?
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..