Rat Stolen: ఎలుక ఎత్తుకెళ్లారని ఫిర్యాదు.. ముగ్గురిపై కేసు నమోదు
పోలీసులకు ఓ వెరైటీ ఫిర్యాదు అందింది.. ఈ తరహా ఘటనలు తమ దృష్టికి రావడం మొదటి సారి అంటున్నారు పోలీసులు.. ఎందకంటే.. ఇప్పటి వరకు దొంగలు పడ్డారు, నన్ను దోచుకున్నారు, ఇంట్లో ఉన్న బంగారం, నగదు ఎత్తుకెళ్లారు, కారు పోయింది, బైక్ పోయింది.. ఇంకా రకరకాల ఫిర్యాదులు పోలీసులకు అందాయి.. అందులో కొన్ని పరిష్కారం అయితే, మరికొన్ని ఎటూ తేలకుండా పోయిన కేసులు కూడా లేకపోలేదు.. అయితే, రాజస్థాన్లో ఓ వ్యక్తి తన ఎలుక పోయిందంటూ ఫిర్యాదు చేసి ఇప్పుడు సోషల్ మీడియాకు పనిచెప్పారు..
Read Also: Astrology : అక్టోబర్ 03, సోమవారం దినఫలాలు
Also Read
- Newlyweds: కూకట్ పల్లిలో విషాదం.. నవ దంపతులు ఆ*త్మహ*త్య
- Pickleball Players' Plane Crash: టెక్సాస్లో ఘోర విమాన ప్రమాదం.. క్రీడాకారులతో వెళ్తున్న ఫ్లైట్ కూలి ఐదుగురు మృతి
- Drugs Seize: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. రూ. 1,745 కోట్ల విలువైన కొకైన్ సీజ్.!
- Student Suicide: నిండు ప్రాణాన్ని బలితీసుకున్న నిరుద్యోగం.. కలల కొలువు దక్కకపోవడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్లోని బాంసవాఢా జిల్లా సజ్జన్గఢ్ పోలీస్స్టేషన్ పరిధిలోని పడ్లా వాఢ్కియా గ్రామానికి చెందిన మంగు అనే 62 ఏళ్ల వ్యక్తి.. పోలీసు స్టేషన్కు వెళ్లారు.. తాను పెంచుకుంటున్న ఎలుక కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు.. ఆ ఎలుక కలర్, బరువుకు సంబంధిచిన కొన్ని గుర్తులకు కూడా చెప్పారు.. తాను పెంచుకునే ఎలుక 700 గ్రాముల బరువు ఉంటుందని.. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి కనిపించడం లేదు.. ఎవరో ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశారు.. అంతే కాదండోయే.. తన ఎలుకను వారే ఎత్తుకెళ్లిఉంటారంటూ.. తన సోదరుడి ముగ్గురు కుమారులైన సురేష్, మోహిత్, అరవింద్ పై అనుమానం వ్యక్తం చేశాడు.. ఎలుక మిస్సింగ్పై కేసు నమోదు చేసేందుకు మొదట నిరాకరించారు పోలీసులు.. అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.. కానీ, అతడు ఎంతకీ వినకపోవడంతో.. చివరకు ఎఫ్ఐఆర్ నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.. ఎఫ్ఐఆర్లో ఫిర్యాదుదారుడు అనుమానం వ్యక్తం చేస్తున్న ముగ్గురి పేర్లను చేర్చి నిందితులుగా పేర్కొన్నారు.. ఐపీసీ 457, 380 కింది కేసు నమోదు చేశామని.. ముగ్గురు నిందితులను విచారణకు పిలిచామని తెలిపారు సజ్జన్గఢ్ పోలీసు అధికారి ధన్పత్ సింగ్. అయితే, ఈ తరహా ఫిర్యాదు అందడం ఇదే తొలిసారి అంటున్నారు పోలీసులు.. గతంలో పెంపుడు కుక్కలు, పిల్లులు తప్పిపోయాంటూ పోలీసులను ఆశ్రయించడం.. పోస్టర్లు, కరపత్రాలు వేసి మరీ.. తమ తప్పిపోయిన జంతువులను అప్పగిస్తే.. డబ్బులు ఇస్తామంటూ ప్రకటనలు చేసిన ఘటనలు వెలుగుచూసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Cyber Crime: బెట్టింగ్ రాయుళ్లపై సైబర్ క్రైమ్ పంజా.. 181 సోషల్ మీడియా ప్రొఫైల్స్ క్లోజ్!
-
Tamil Producers: మే 2వ తేదీన తమిళ్ నిర్మాతల ‘టోకెన్ స్ట్రైక్’
-
Preity Zinta: పంజాబ్ తొలి ఓటమిపై.. రెండు రోజుల తర్వాత స్పందించిన ప్రీతి జింటా.. ఏమన్నారంటే..
-
Oscars 2027 Rule Changes: ఆస్కార్ చరిత్రలోనే అతిపెద్ద మార్పులు.. భారతీయ సినిమాలకు ఇక పండగే!
-
Palak Paratha Recipe: పిల్లల కోసం హెల్తీ బ్రేక్ ఫాస్ట్.. ఐరన్ పెంచే పాలకూర పరాటా.. రుచి చూస్తే చపాతీల కంటే ఇదే కావాలంటారు!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!