Rat Stolen: ఎలుక ఎత్తుకెళ్లారని ఫిర్యాదు.. ముగ్గురిపై కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలీసులకు ఓ వెరైటీ ఫిర్యాదు అందింది.. ఈ తరహా ఘటనలు తమ దృష్టికి రావడం మొదటి సారి అంటున్నారు పోలీసులు.. ఎందకంటే.. ఇప్పటి వరకు దొంగలు పడ్డారు, నన్ను దోచుకున్నారు, ఇంట్లో ఉన్న బంగారం, నగదు ఎత్తుకెళ్లారు, కారు పోయింది, బైక్ పోయింది.. ఇంకా రకరకాల ఫిర్యాదులు పోలీసులకు అందాయి.. అందులో కొన్ని పరిష్కారం అయితే, మరికొన్ని ఎటూ తేలకుండా పోయిన కేసులు కూడా లేకపోలేదు.. అయితే, రాజస్థాన్లో ఓ వ్యక్తి తన ఎలుక పోయిందంటూ ఫిర్యాదు చేసి ఇప్పుడు సోషల్ మీడియాకు పనిచెప్పారు..
Read Also: Astrology : అక్టోబర్ 03, సోమవారం దినఫలాలు
Also Read
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్లోని బాంసవాఢా జిల్లా సజ్జన్గఢ్ పోలీస్స్టేషన్ పరిధిలోని పడ్లా వాఢ్కియా గ్రామానికి చెందిన మంగు అనే 62 ఏళ్ల వ్యక్తి.. పోలీసు స్టేషన్కు వెళ్లారు.. తాను పెంచుకుంటున్న ఎలుక కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు.. ఆ ఎలుక కలర్, బరువుకు సంబంధిచిన కొన్ని గుర్తులకు కూడా చెప్పారు.. తాను పెంచుకునే ఎలుక 700 గ్రాముల బరువు ఉంటుందని.. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి కనిపించడం లేదు.. ఎవరో ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశారు.. అంతే కాదండోయే.. తన ఎలుకను వారే ఎత్తుకెళ్లిఉంటారంటూ.. తన సోదరుడి ముగ్గురు కుమారులైన సురేష్, మోహిత్, అరవింద్ పై అనుమానం వ్యక్తం చేశాడు.. ఎలుక మిస్సింగ్పై కేసు నమోదు చేసేందుకు మొదట నిరాకరించారు పోలీసులు.. అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.. కానీ, అతడు ఎంతకీ వినకపోవడంతో.. చివరకు ఎఫ్ఐఆర్ నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.. ఎఫ్ఐఆర్లో ఫిర్యాదుదారుడు అనుమానం వ్యక్తం చేస్తున్న ముగ్గురి పేర్లను చేర్చి నిందితులుగా పేర్కొన్నారు.. ఐపీసీ 457, 380 కింది కేసు నమోదు చేశామని.. ముగ్గురు నిందితులను విచారణకు పిలిచామని తెలిపారు సజ్జన్గఢ్ పోలీసు అధికారి ధన్పత్ సింగ్. అయితే, ఈ తరహా ఫిర్యాదు అందడం ఇదే తొలిసారి అంటున్నారు పోలీసులు.. గతంలో పెంపుడు కుక్కలు, పిల్లులు తప్పిపోయాంటూ పోలీసులను ఆశ్రయించడం.. పోస్టర్లు, కరపత్రాలు వేసి మరీ.. తమ తప్పిపోయిన జంతువులను అప్పగిస్తే.. డబ్బులు ఇస్తామంటూ ప్రకటనలు చేసిన ఘటనలు వెలుగుచూసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Nandini Reddy: “నా పక్కన లేనిది మొగుడు ఒక్కడే.! మిగతావన్నీ ఉన్నాయి..” పెళ్లి, ఒంటరితనంపై ఓపెన్ అయిన లేడి డైరెక్టర్.!
-
DSP Bheem Reddy : విల్లాలు.. ఫ్లాట్లు.. కిలోల బంగారం.. డీఎస్పీ ఆస్తుల లెక్క ఇదే!
-
China: డ్రాగన్ కొత్త ఎత్తుగడ.. భారత్ సరిహద్దులో కొత్త కారిడార్కు ప్రణాళిక
-
Nandini Reddy: “అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?” రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Ponnam Prabhakar : ఆడలేక మద్దెల ఓడన్నట్లుంది బీఆర్ఎస్ వ్యవహారం
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!