మునుగోడ్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో రేపు సెలవుగా ప్రకటించింది ఎన్నికల కమిషన్.. ఉప ఎన్నిక పోలింగ్ దృష్ట్యా నవంబర్ 3న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు, ఫ్యాక్టరీలకు, దుకాణాలకు స్థానికంగా సెలవు అని పేర్కొంది ఎన్నికల కమిషన్
కెమికల్స్, పెట్రో కెమికల్స్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ఛాంపియన్లా దూసుకుపోతోందన్నారు ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్… ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ఇండియా కెం 2022 సదస్సు జరిగింది.. ఈ సదస్సుకు హాజరైన మంత్రి అమర్నాథ్.. కేంద్రం మంత్రి మన్సుఖ్ మాండవియాకు శాలువా కప్పి సత్కరించారు.. ఇక, ఆయన సదస్సులో మాట్లాడుతూ.. కెమికల్స్, పెట్రో కెమికల్స్ రంగంలో ఏపీ దూసుకుపోతుందని వెల్లడించారు.. 974 కిలోమీటర్ల సముద్ర తీరంతో దేశానికి ఏపీ ఈస్ట్రన్ గేట్వే ఆఫ్ ఇండియాగా మారిందన్న ఆయన.. […]
ఇప్పుడు మునుగోడు బై పోల్ పై దృష్టి పెట్టారు బెట్టింగ్ రాయుళ్లు.. మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉంటుందని.. ఓ రెండు పార్టీల మధ్యే గట్టి పోటీ జరుగుతుందని.. ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీతోనే బయటపడే అవకాశం ఉందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.. దీనిని క్యాష్ చేసుకోవడానికి రంగంలోకి దిగిన బెట్టింగ్ రాయుళ్లు.. మునుగోడులో గెలుపెవరిది? అంటూ బెట్టింగ్లు కాస్తున్నారు..
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు గాను 175 స్థానాల్లో విజయం సాధించాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు సీఎం వైఎస్ జగన్.. వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ.. పని విధానంలో వెనుకబడిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్న విషయం విదితమే.
సర్కారు బడుల్లో జియో అటెండెన్స్ తప్పనిసరి చేస్తూ.. తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. సర్కారు ఆదేశాలతో జియో అటెండెన్స్ అమలు చేస్తున్నారు అధికారులు. నిజామాబాద్ జిల్లాలో 1156 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. 5వేలకు పైగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. చాలా స్కూళ్లలో ప్రభుత్వ ఉపాధ్యాయులు సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని .. ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో విద్యాశాఖ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తప్పనిసరి చేసింది. సర్కారు నిర్ణయంతో ఉపాధ్యాయుల్లో కొత్త టెన్షన్కు మొదలైంది. ఇటీవల డిచ్పల్లిలో […]
నవంబర్ 12, 13, 14 తేదీల్లో జనసేన ఆధ్వర్యంలో పక్కాగా సోషల్ ఆడిట్ నిర్వహిస్తామన్నారు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్.. దీని ద్వారా కొత్త తరహాలో సమస్యలు వెలికితీస్తామని వెల్లడించారు.