Off The Record: తెలంగాణ బీజేపీలో అలజడి..? ఆపరేషన్ వికర్ష్ వలలో బీజేపీ నేతలు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ పావులు కదుపుతోంది. రాష్ట్రంపై ఢిల్లీలోని పార్టీ పెద్దలు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా బీజేపీలో చేరికలపై టాప్ టు బాటమ్ కసరత్తు జరుగుతోంది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో.. ఎన్నికల తర్వాత కొందరు ఇతర పార్టీల నుంచి వచ్చి కాషాయ కండువా కప్పుకొన్నారు. బీజేపీ నాయకులు ఆశించినట్టు వరదలా చేరికలు లేకపోయినా.. అడపా దడపా చేరినవారు ఉన్నారు. ప్రత్యేకంగా చేరికల కమిటీ వేసినా అనుకున్నంత జాయినింగ్స్ లేవు. పార్టీలో ముఖ్యనేతల మధ్య అభిప్రాయ భేదాలు చేరికల ప్రభావం చూపినట్టు సమాచారం. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. బీజేపీ కూడా సంస్థాగత బలోపేతంపై క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేస్తోంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. చేరికలపై సంతృప్తి లేకపోయినా.. ఇప్పటికే బీజేపీలో ఉన్న నాయకులు ఎవరైనా పార్టీని వీడి వెళ్లిపోతున్నారా అనే అనుమానాలు పెరుగుతున్నాయట. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన కొందరు నాయకులు కాషాయ శిబిరంలో అడ్జెస్ట్ కాలేక పోతున్నారట. బీజేపీ పద్దతులకు అలవాటు పడలేక.. ఉండలేక.. ఉక్కపోతుకు ఫీలవుతున్నారట. బీజేపీలోని ఇతర లీడర్స్తో మింగిల్ కావడం లేదనే చర్చ నడుస్తోంది.
Read Also: EO Lavanna: మంత్రి పెద్దిరెడ్డి కాళ్లు మొక్కిన శ్రీశైలం ఈవో.. అందుకేనంటూ లవన్న వివరణ..
Also Read
బీజేపీలో కొద్దిరోజులుగా నాయకులు పార్టీని వీడివెళ్లిపోతారు అనే అంశంపై జోరుగా ప్రచారం జరుగుతోంది. మునుగోడు ఉపఎన్నిక బ్యాక్డ్రాప్లో కొందరు అలాగే జంప్ చేశారు. దీనికితోడు అధికారపార్టీ BRS కూడా రివర్స్ ఆపరేషన్ మొదలుపెట్టిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే గులాబీ పార్టీ ట్రాప్లో పడ్డది ఎవరన్నదే మిస్టరీ. ఉగాది నాటికి కీలక పరిణామాలకు ఆస్కారం ఉందని చెవులు కొరుక్కుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ వెళ్లిపోయారు. బీజేపీలో ఇమడలేక.. ఉన్న నేతలతో పొసగక బీజేపీని వీడుతున్నట్టు కన్నా ఓపెన్గానే చెప్పేశారు. ఇదే పరిస్థితి తెలంగాణ బీజేపీలోనూ ఉందనేది ఓ ప్రచారం. ఒకవేళ బీజేపీని వీడాలని అనుకుంటే.. వాళ్లు ఎవరు? ఈ అంశంలో ఢిల్లీ పెద్దలకు ఉన్న సమాచారం ఏంటి? తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు.. తమకు అందుతున్న రిపోర్టులు ఆధారంగా బీజేపీ అధిష్ఠానం ఆరా తీస్తోందా? వలస నేతలు బీజేపీని వీడటానికే నిర్ణయం తీసుకుంటే ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దానిపై సమాలోచనలు చేస్తున్నారట. మొత్తానికి ఎన్నికల వేళ ఆపరేషన్ వికర్ష్కు ఎంత మంది బీజేపీ నేతలు చిక్కుతారో.. లేక కేవలం ప్రచారంగానే ఈ అంశం మిగిలిపోతుందో చూడాలి.
తాజావార్తలు
-
UAPA: షహజాద్ భట్టి నెట్వర్క్పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!