Off The Record: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటుపై వైసీపీ ప్రత్యేక ఫోకస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఆంధ్రప్రదేశ్లో MLC ఎన్నికల కోలాహలం నెలకొంది. పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల సమరం రంజుగా కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలు ప్రధాన పార్టీలకు ఛాలెంజ్ విసురుతున్నాయి. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటరు నాడిని పసిగట్టేందుకు ఈ పోటీ చాలా కీలకంగా భావిస్తున్నాయి పార్టీలు. అందుకే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఉత్తరాంధ్ర పట్టభద్రుల సీటు. తొలిసారి ఈ ఎన్నికల్లో అధికారపార్టీ వైసీపీ పోటీ చేస్తోంది. గత సంప్రదాయాలకు భిన్నంగా 6 నెలల ముందే అభ్యర్థిని ప్రకటించింది కూడా. బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్ అభ్యర్థి. పెద్దఎత్తున ఓటర్ల నమోదు చేసింది వైసీపీ. ముఖ్య నాయకులు ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పటికీ.. గెలుపు అనుకున్నంత ఈజీ కాదనేది మారుతున్న పరిణామాలతో తెలుస్తోంది. బలమైన ప్రత్యర్థులను ఎదుర్కోవాల్సి రావడమే దీనికి కారణం.
Read Also: Off The Record: తెలంగాణ కాంగ్రెస్ను అధిష్టానం పక్కన పెట్టిందా..? నేతల్లో అసంతృప్తి అందుకేనా..!
Also Read
- Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
- Off The Record : వైసీపీకి డోర్స్ క్లోజ్.. పవనే నా బాస్! రూమర్లకు చెక్ పెట్టిన బాలినేని
- Off The Record : కారు స్పీడ్ పెంచేందుకు వ్యూహకర్త రెడీ? కేసీఆర్ కొత్త టీమ్.. పాత జోష్ వస్తుందా?
- Off The Record : పీఎం హైదరాబాద్ టూర్ పై పొలిటికల్ చర్చ..
టీచర్లలో పట్టున్న వేపాడ చిరంజీవిని టీడీపీ తెరమీదకు తెచ్చింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు సమన్వయ బాధ్యతలు అప్పగించింది. వామపక్ష, ప్రజాసంఘాల మద్దతుతో పీడీఎఫ్ అభ్యర్థి రమాప్రభకు బలమైన ఓట్ బ్యాంక్ కనిపిస్తోంది. సిట్టింగ్ సీట్పై ఆశ పెట్టుకున్న బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి పీవీఎన్ మాధవ్ ఫోకస్ సాంప్రదాయ ఓటర్లపై ఉంది. వైసీపీ అభ్యర్థి సీతంరాజుకు సొంత ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ ఛాలెంజెస్ ఎదురవుతున్నాయి. సుమారు 2 లక్షల 80 వేల ఓటర్లు ఉంటే.. వీరిలో మొదటి ప్రాధాన్యం ఓటును ఆకర్షించడమే కీలకం. ఇందుకు పెద్ద కసరత్తు అవసరమనేది నేతల భావన. ఫలితం సానుకూలంగా లేకపోతే సహించేది లేదని హైకమాండ్ స్పష్టంగా చెప్పడంతో అలర్ట్ అయ్యారు వైసీపీ నేతలు.
Read Also: Off The Record: తెలంగాణ బీజేపీలో అలజడి..? ఆపరేషన్ వికర్ష్ వలలో బీజేపీ నేతలు?
ఉత్తరాంధ్ర వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రస్తుతం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల చాలా కీలకంగా మారిపోయింది. వైసీపీ ఉమ్మడి జిల్లాల సమన్వకర్తగా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టాక ఇక్కడ జరుగుతున్న ఎన్నిక. అప్పట్లో సమన్వయంతోనే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పాగా వేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలను ఏకపక్షం చేయాలనేది ఆలోచన. గతంలో సమస్యలపై చర్చించేందుకు కొన్ని గంటలు మహా అయితే ఒకటి రెండు రోజులు వైజాగ్లో ఉండేవారు వైవీ. MLC ఎన్నికలు కావడంతో ఎక్కువ రోజులు ఈ ప్రాంతంలోనే ఉంటున్నారు. కీలక నేతలు మోహరిస్తుండటంతో ఉత్తరాంధ్ర పట్టభద్రుల MLC స్థానానికి వైసీపీ హైకమాండ్ ఇస్తున్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. దీంతో వైసీపీ MLC అభ్యర్థిని గెలిపించే విషయంలో ఈ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధుల్లో ఎవరికెన్ని మార్కులు పడతాయో అనే చర్చ సాగుతోంది.
తాజావార్తలు
-
Tokyo: టోక్యోలో తప్పిన విమాన ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా ఏం జరిగిందంటే..!
-
LPG Subsidy Cut: సామాన్యుడికి గ్యాస్ షాక్.. ఇకపై సబ్సిడీ కట్!
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్ట్.. సీఎం విజయ్ కీలక నిర్ణయం..
-
NEET UG 2026: మే 3న నీట్ పరీక్ష, మే 12న రద్దు.. అసలు ఈ 10 రోజుల్లో ఏం జరిగింది? పూర్తి టైమ్లైన్ ఇదే..
-
Hiro Vishal: 717 వైన్ షాపుల మూసివేత.. హీరో విశాల్ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!