నిషేధిత ప్లాస్టిక్ వాడితే భారీ జరిమానా.. ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ ఉత్పత్తులపై భారీగా జరిమానా విధించేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ను సవరించింది.. ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జరిమానాలు విధించనున్నట్టు పేర్కొంది.. పాలిథీన్ క్యారీబ్యాగులు ఉత్పత్తి, విక్రయాలపైనా, ఈ కామర్సు కంపెనీల పైనా దృష్టి పెట్టాలని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.. నిషేధించిన ప్లాస్టిక్ ఉత్పత్తుల దిగుమతి, తయారీపై మొదటిసారి తప్పుగా రూ. […]
ఏది జరిగినా విమర్శించేవారే కాదు.. మద్దతు ఇచ్చేవారు కూడా ఉంటారు.. ఈ మధ్య ట్విట్టర్ను సొంతం చేసుకున్న టెస్లా చీఫ్, ప్రపంచ కుభేరుడు ఎలాన్ మస్క్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు.. ఇది చాలా మందికి రుచించడం లేదు.. ఉద్యోగులపై వేటు ఓవైపైతే.. మరోవైపు బ్లూటిక్కు డబ్బులు వసూలు చేయడం పనిగా పెట్టుకున్నాడు.. దీంతో, చాలా విమర్శలు ఎదుర్కొంటున్నాడు.. ఇదే సమయంలో.. ఆయనపై ప్రశంసలు కురిపించేవారు కూడా ఉన్నారు.. తాజాగా నెట్ఫ్లిక్స్ సీఈవో రీడ్ హేస్టింగ్స్ ఈ జాబితాలో […]
ఆంధ్రప్రదేశ్లో రెడ్డీ సామాజిక వర్గం వర్సెస్ కమ్మ సామాజిక వర్గం మధ్య రాజకీయాలు నడుస్తున్నాయి.. ఆ సామాజిక వర్గాలు ఎంత వరకు వీటిని పట్టించుకుంటారో తెలియదు.. కానీ, నేతల మాత్రం.. ఆరోపణలు, విమర్శలు చేసే సమయంలో.. మీ సామాజిక వర్గం.. ఆ సామాజిక వర్గం అనే పేర్కొన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. అయితే, ఇవాళ చిత్తూరు జిల్లాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. […]
అప్పుడే పెళ్లి చేసుకున్న జంట.. ఉత్సాహంగా.. ఆలయంలో ఉన్న గజరాజు ముందు ఫొటోలకు పోజులిచ్చింది.. ఆ కొత్త జంటను తన కెమెరాలో బంధించే పనిలోపడిపోయారు.. వీడియో గ్రాఫర్, ఫొటో గ్రాఫర్.. అయితే, ఏమైందో ఏమో తెలియదు.. కానీ, ఒక్కసారిగా ఆ గజరాజుకు కోపం వచ్చింది.. ఆగ్రహంతో ఊగిపోయింది.. దాడి చేసింది.. ఈ ఘటనలో ఓ వ్యక్తి తృటిలో ప్రాణాలతో తప్పించుకున్నాడు.. ఈ వీడియో సోషల్ మీడియాకు ఎక్కడంతో వైరల్గా మారిపోయింది.. కేరళలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన […]
TSPSC Group 4 Notification: వరుస నోటిఫికేషన్లతో నిరుద్యోగులకు శుభవార్త చెబుతూనే ఉంది తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు మరో జంబో నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)… టీఎస్పీఎస్సీ నుంచి ఇప్పటి వరకు విడుదలైన నోటిఫికేషన్లలో ఇదే అతిపెద్ద నోటిఫికేషన్ కావడం విశేషంగా చెప్పుకోవాలి.. గ్రూప్-4 నోటిఫికేషన్ను ఇవాళ అధికారికంగా విడుదలైంది.. మొత్తం 9,168 పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. అందులో అగ్రికల్చర్, కో ఆపరేటివ్ శాఖలో 44 […]
సామాన్యులే కాదు.. పేకాడుతూ దొరికిన ప్రముఖులు ఉంటారు.. వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. తాజాగా, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.. ఏపీ గేమింగ్ యాక్ట్ 3 అండ్ 4 ప్రకారము సెక్షన్ 275 కింద కేసు నమోదు చేశారు.. ఈ ఎఫ్ఐఆర్ లో ఏ9 గా వరుపుల సుబ్బారావు పేరును చేర్చారు.. గత నెల 26న పేకాడుడూ పోలీసులకు […]
మంత్రి గుమ్మనూరు జయరాం భార్య రేణుకకు ఐటీ శాఖ నోటీసులు వ్యవహారం ఆంధ్రప్రదేశ్ హాట్ టాపిక్గా మారిపోయింది.. అయితే, మంత్రి గుమ్మనూరు జయరాం.. తన భార్యకు ఐటీ నోటీసులపై స్పందించారు.. నా భార్య కు ఎలాంటి ఐటీ అధికారులు నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.. నోటీసులు ఇచ్చారని అసత్య ప్రచారాలు చేశారని మండిపడ్డారు.. మాది ఉమ్మడి కుటుంబం.. నాభార్య పై భూమి కొంటే బినామీ ఎలావుతుంది? అని నిలదీశారు.. నేను న్యాయ బద్ధంగా భూమి కొనుగోలు చేశానన్న […]
ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ ఉత్పత్తులపై భారీగా జరిమానా విధించేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ను సవరించింది.. కాలుష్యాన్ని సృష్టించే వారే ఈ వ్యయాన్ని భరించాలన్న థియరీ ఆధారంగా పెనాల్టీలు వేసేందుకు నిర్ణయం ఈసుకుంది.. ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జరిమానాలు విధించనున్నట్టు పేర్కొంది.. పాలిథీన్ క్యారీబ్యాగులు ఉత్పత్తి, విక్రయాలపైనా, ఈ కామర్సు కంపెనీల పైనా దృష్టి పెట్టాలని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.. మున్సిపల్ […]
వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆకస్మిక బదిలీ అయ్యారు.. ఆయన స్థానంలో హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు డీసీపీ రంగనాథ్ను వరంగల్ పోలీస్ కమిషనర్ గా ప్రభుత్వ నియమించింది.. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆకస్మిక బదిలీ ఎందుకు జరిగింది. కేవలం ఒక్క ఐపీఎస్ అధికారి మాత్రమే బదిలీ […]
బీసీలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. డిసెంబర్ 8వ తేదీన చేపట్టాలనుకున్న బీసీల ఆత్మీయ సదస్సు ఒక రోజు ముందే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.. డిసెంబర్ 7వ తేదీన భారీ ఎత్తున బీసీ సదస్సు ఉంటుంది.. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో సమావేశం జరగనుండగా.. 60 వేల నుంచి 75 వేల వరకు బీసీ నేతలు హాజరయ్యే అవకాశం ఉందంటున్నారు.. గ్రామ పంచాయతీ సభ్యుల నుంచి మంత్రుల వరకు హాజరుకానున్న ప్రజా ప్రతినిధులు.. నామినేటెడ్ […]