CM YS Jagan and New Governor Relationship: కొత్త గవర్నర్తో సీఎం జగన్ సంబంధాలు ఎలా ఉంటాయో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan and New Governor Relationship: విశ్వభూషణ్ హరిచందన్.. మూడేళ్ల 7 నెలలపాటు ఏపీ గవర్నర్గా ఉన్నారు. రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచిన వైఎస్ జగన్.. 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే…అదే ఏడాది జూలైలో రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు తీసుకున్నారు విశ్వభూషణ్ హరిచందన్. అప్పటి నుంచి ముఖ్యమంత్రి జగన్, గవర్నర్ కు మధ్య సహృద్భావ వాతావరణం కొనసాగింది. ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడు రాజ్ భవన్ కు వెళ్లాల్సి ఉన్నా.. సతీసమేతంగా వెళ్లి గవర్నర్ దంపతులతో సమావేశం అయ్యేవారు. ఈ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధంతో.. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల దగ్గరి నుంచి.. పాలనాపరమైన అంశాలు వరకు ఎలాంటి జాప్యం లేకుండా సాఫీగా సాగిపోయేది. ఒకవైపు తెలంగాణా, తమిళనాడు రాష్ట్రాల్లో సీఎమ్, గవర్నర్ వ్యవస్థ మధ్య ఘర్షణ వాతావరణం ఉంటే.. ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండు వ్యవస్థలు స్నేహపూరిత వాతావరణంలో వ్యవహరించాయి.
Read Also: Supreme Court: శివసేన వివాదం.. ఈసీ ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నో
Also Read
- Hidden Treasure : అడవిలో అర్థరాత్రి తవ్వకాలు.. గుప్తనిధుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్లే వేట.?
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
గవర్నర్ విశ్వభూషణ్, ముఖ్యమంత్రి జగన్ మధ్య ఉన్న అనుబంధం.. వీడ్కోలు సమావేశాల సందర్భంలోనూ కనిపించింది. ముఖ్యమంత్రి చూపించిన ప్రేమను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను అని గవర్నర్ వ్యాఖ్యానించారు. గవర్నర్ దంపతులు ఛత్తీస్ ఘడ్ కు వెళుతున్న సమయంలో.. ముఖ్యమంత్రి స్వయంగా గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి వీడ్కోలు పలికారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి జగన్ హరిచందన్ కు పాదాభివందనం చేయటం ద్వారా తన అభిమానాన్ని చాటుకున్నారు.. ఇప్పుడు కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రికి మధ్య ఎటువంటి సంబంధాలు ఉండనున్నాయి అన్న చర్చ జరుగుతోంది. హరిచందన్ క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన రాజకీయ నాయకుడు కావటం వల్ల.. సీఎమ్ జగన్ తో ఆత్మీయ అనుబంధం ఏర్పడింది. కొత్త గవర్నర్ వైఖరి ఎలా ఉంటుంది…హరిచందన్ తో ఏర్పడినంత అనుబంధం ఉంటుందా…అందులోనూ ఎన్నికల ఏడాది కావటంతో.. బీజేపీ హైకమాండ్ ప్రభావం ఏమైనా ఉండే అవకాశం ఉందా అన్న చర్చ జరుగుతోంది.
అయితే, గన్నవరం ఎయిర్పోర్ట్లో కొత్త గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు ఘనంగా స్వాగతం పలికారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. నూతన గవర్నర్ కు ఎయిర్పోర్ట్లో సీఎం జగన్తో పాటు సీఎస్ జవహార్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్, మంత్రి జోగి రమేష్, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, విజయవాడ సీపీ కాంతిరాణా టాటా, హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు స్వాగతం పలికారు.. ఇక, కొత్త గవర్నర్కు విమానాశ్రయంలో నేతలను, అధికారులను పరిచయం చేశారు సీఎం జగన్.. అనంతరం పోలీసు గౌరవవందనం స్వీకరించిన జస్టిస్ అబ్దుల్ నజీర్.. ఆ తర్వాత సతీమణి, కుటుంబ సభ్యులతో కలిసి రాజ్భవన్కు చేరుకున్నారు.. కాగా, ఎల్లుండి అంటే ఫిబ్రవరి 24వ తేదీన ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు స్వీకరించనున్న విషయం విదితమే. స్వాగత కార్యక్రమంలో.. కొత్త గవర్నర్తో ఎంతో ఆప్యాయంగా మెలిగారు సీఎం.. మరి 24వ తేదీ తర్వాత రాజ్భవన్తో సీఎం సంబంధాలు ఎలా ఉండనున్నాయో చూడాలి.
తాజావార్తలు
-
KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
-
iQOO 15T: ఐకూ 15T విడుదల.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్
-
RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
-
TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
-
ACB Raids : సస్పెండ్ అయినా తగ్గని లగ్జరీ.. సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో తనిఖీల్లో బయటపడ్డ కోట్లు..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!