Off The Record: గన్నవరం రగడతో పక్కకు పోయిన చర్చ ఏంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అవుతున్న శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే, గవర్నర్ కోటాతోపాటు స్థానిక సంస్థల కేటగిరిలో 18 సీట్లకు వైసీపీ అభ్యర్ధులను ప్రకటించింది. 18లో ఏకంగా 14 సీట్లను SC, ST, BCలకే కేటాయించారు. అందులోనూ 11 స్థానాలను కేవలం BC సామాజికవర్గాలకే ఇచ్చారు. ఎమ్మెల్యేల సంఖ్యాబలం, స్థానిక సంస్థల్లో వైసీపీకి ఉన్న పట్టు రీత్యా ఈ రెండు కోటాల్లోనూ అభ్యర్థుల గెలుపు లాంఛనమే. శాసనమండలికి ఇంత పెద్దఎత్తున బీసీలను పంపించటం అనేది వైసీపీకి రాజకీయంగా మైలేజ్ రావల్సిన అంశం. టీడీపీ హయాంలో బీసీలకు చట్టసభల్లో ఎన్ని స్థానాలు ఇచ్చారు? ఇప్పుడు జగన్ సర్కార్ ఎంత ప్రాధాన్యం ఇచ్చిందో.. ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారపార్టీ పెద్దలు నిర్ణయించారు. దానికి తగ్గట్టుగానే మంత్రులు, ఎంపీలు.. ఎమ్మెల్యేలు వరస పెట్టి మీడియాతో మాట్లాడేలా షెడ్యూల్ కూడా ఖరారు చేశారు.
Read Also:Off The Record: కొత్తకోట దంపతుల కొత్త ఎత్తుగడ..! రెండు చోట్ల పోస్టర్ల యుద్ధం
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : బీఆర్ఎస్ లో కలకలం రేపుతున్న సభ్యత్వ నమోదు వ్యవహారం
సీఎం జగన్ బీసీలకు రాజకీయ ప్రాధాన్యం ఇస్తున్నారనే విషయాన్ని గట్టిగా చెప్పారు వైసీపీ నేతలు. ఇంత చేసినా.. ఎమ్మెల్సీల ఎంపికలో చేసిన సోషల్ ఇంజనీరింగ్పై వైసీపీకి అనుకున్న రాజకీయ ప్రయోజనం దక్కలేదనే టాక్ నడుస్తోంది. రావాల్సిన మైలేజ్ రాలేదన్నది అధికారపార్టీలో జరుగుతున్న చర్చ. దీనికంతటికీ గన్నవరంలో జరిగిన రచ్చే కారణమని అనుకుంటున్నారు. ఆ రోజున సవాళ్లు, ప్రతిసవాళ్లు, దాడులు, ప్రతిదాడులు, అరెస్టులతో గన్నవరం వార్తల్లోకి ఎక్కింది. దీంతో వైసీపీ సామాజిక న్యాయం వార్తలకు కొంత ప్రాధాన్యత తగ్గిందనే చెప్పాలి. పథకం ప్రకారం గన్నవరంలో టీడీపీ నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారనేది అధికారపార్టీలో జరుగుతున్న చర్చ. టీడీపీ నేత పట్టాభి తాను గన్నవరం నుంచి పోటీ చేస్తానని ప్రకటించడం.. ఆ తర్వాత జరిగిన గొడవ అంతా ఒక టీడీపీ స్కీమ్లో భాగమే అని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే ఈ పథకాన్ని ఊహించైనా వైసీపీ నేతలు గొడవ పెరగకుండా చూసుకుని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. శాసనమండలికి ఒకేసారి ఏకంగా 11 మంది BCలను పంపించామనే పొలిటికల్ మైలేజ్ మొత్తం.. ఈ దాడుల ఎపిసోడ్లో కొట్టుకుపోయిందనే వాదన అధికారపార్టీలో ఉంది.
తాజావార్తలు
-
Hyderabad: నెంబర్ ప్లేట్ లేని కారుతో ఢీ.. నగరంలో న్యాయవాది దారుణ హత్య!
-
Pakistan Cuts Petrol and Diesel Prices: పాక్లో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా రెండోసారి ఊరట
-
Trump: భారత్ దెబ్బకు భయపడి అమెరికా కాళ్లబేరానికి పాక్.. ఆపరేషన్ సిందూర్ సీజ్ఫైర్పై ట్రంప్ సంచలన ప్రకటన..
-
Kohli vs Head: సైగలతో రెచ్చగొట్టిన విరాట్.. కోహ్లీ-ట్రావిస్ హెడ్ మధ్య అసలేం జరిగింది?.. క్లారిటీ ఇదిగో!
-
Swayambhu: ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత భారీ గ్రాఫిక్స్తో వస్తున్న నిఖిల్ మూవీ
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!