Andhra Pradesh: ప్రైవేట్, అన్ ఎయిడెడ్ స్కూళ్లల్లో పేద విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వచ్చే నెల నాలుగో తేదీ నుంచి ప్రైవేట్ స్కూళ్లల్లో పేదల అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించనుంది.. మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు అడ్మిషన్ల స్వీకరణ జరుగుతోంది.. అయితే, ప్రైవేట్ స్కూళ్లల్లో పేదల అడ్మిషన్ల కోసం 25 శాతం సీట్లు రిజర్వ్ చేసింది ఆంధ్రప్రదేశ్ సర్కార్.. అందులో ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, […]
నేడు ప్రీతి స్వగ్రామం గిర్నితండాలో అంత్యక్రియలు వరంగల్లో ఆత్మహత్యాయత్నం చేసిన కేఎంసీ పీ.జీ వైద్య విద్యార్ధిని ప్రీతి మృతి చెందింది. మెడికల్ విద్యార్థిని డాక్టర్ డి ప్రీతి ఆదివారం మృతి చెందినట్లు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సత్యన్రాయణ విడుదల చేసిన బులెటిన్లో, “మల్లిపుల్ విభాగాల నిపుణులైన వైద్యుల బృందం నిరంతర ప్రయత్నాలు చేసినప్పటికీ, డాక్టర్ ప్రీతిని రక్షించలేకపోయారు. ఫిబ్రవరి 26, 2023 […]
Father Apologizes: ఓ అమ్మాయి కోసం ఇద్దరు స్నేహితుల మధ్య చోటు చేసుకున్న మనస్పర్థలు.. హత్యకు దారి తీసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే.. ఈ కేసులో నిందితుడు సైకో హరిహరకృష్ణ గురించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన లవర్తో సన్నిహితంగా ఉంటున్నాడనే అనుమానంతో.. తన క్లోజ్ ఫ్రెండ్ను అతికిరాతకంగా చంపిన హరికృష్ణ.. అనంతరం శరీరంలోని భాగాలను వేరు చేసిన తీరు చూస్తుంటే.. అతను ఎంత క్రూరంగా ఆలోచిస్తున్నాడో తెలుస్తోంది. అయితే, హరిహర […]
Off The Record: తానేటి వనిత. ఏపీ హోంశాఖ మంత్రి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కొవ్వూరు ఎమ్మెల్యే. సామాజిక సమీకరణాలు కలిసి రావడంతో 2019లోనే కేబినెట్లో చోటు దక్కించుకున్నారు వనిత. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో హోంశాఖను అప్పగించి పదోన్నతి కల్పించింది అధిష్ఠానం. రాజకీయ సోపానంలో అడుగులు ముందుకు పడుతున్నా.. సొంత నియోజకవర్గం కొవ్వూరులో మంత్రికి ఎదురీత తప్పడం లేదనే టాక్ వైసీపీ వర్గాల్లో ఉందట. నియోజకవర్గానికి మంత్రి వస్తే చాలు.. చాలా మంది పార్టీ నేతలు ముఖం […]
Off The Record: రంగారెడ్డి-హైదరాబాద్- మహబూబ్నగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి దాఖలైన నామినేషన్ల పరిశీలన తర్వాత 21 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఈ సంఖ్య తగ్గుతుందో లేదో కానీ.. అధికారపార్టీ బీఆర్ఎస్ మద్దతు ఎవరికి అన్నది పెద్ద చర్చగా మారుతోంది. పోటీలో ఉన్న AVN రెడ్డికి బీజేపీ సపోర్ట్ చేస్తోంది. గత ఎన్నికల్లో MLCగా గెలిచి.. తర్వాత గులాబీ పార్టీలో చేరిన కాటేపల్లి జనార్దన్రెడ్డి మరోసారి ఫీల్డ్లో ఉన్నారు. PRTU నుంచి […]
Off The Record: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల MLC అభ్యర్థిగా వైసీపీ నర్తు రామారావును ఎంపిక చేసింది. లోకల్ బాడీలో వైసీపీకి పూర్తిస్థాయి బలం ఉండటంతో నర్తు నామినేషన్ వేస్తే ఏకగ్రీవమే అని అనుకున్నారు. నర్తు రామారావు యాదవ సామాజికవర్గం నాయకుడు. అయితే ఈ ఎమ్మెల్సీ సీటును ఆశించారు వైసీపీలోని తూర్పుకాపు సామాజికవర్గం నేతలు. ఇప్పుడు సీటు రాకపోవడంతో రెబల్గా మారారు. స్వతంత్ర అభ్యర్ధిని బరిలో దించడంతో రాజకీయం మలుపు తీసుకుంది. తూర్పుకాపు సామాజికవర్గానికి […]
Off The Record: తిరుమల మినహా ప్రభుత్వ అధీనంలోని ఇతర ఆలయాలన్నీ ఏపీలోని దేవాదాయశాఖ మంత్రి అజమాయిషీలోనే ఉంటాయి. మినిస్టర్గా ఆ ఆలయంలో పనిచేసే అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేయొచ్చు. కానీ.. డిప్యూటీ సీఎం హోదాలో దేవాదాయశాఖ చూస్తోన్న కొట్టు సత్యనారాయణ పరిస్థితి మాత్రం వేరే విధంగా ఉంది. తిరుమలలోనే కాదు.. ఏపీలోని మరో ఆలయంలో కూడా కొట్టు మాట చెల్లుబాటు కావడం లేదట. అదే బెజవాడ కనకదుర్గ ఆలయం. ఈ గుడిలో మంత్రి కొట్టు […]
Off The Record: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ.. CWCలో చోటు కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు తెలంగాణలోని పార్టీ నేతలు. CWC అనేది పార్టీలో కీలక కమిటీ. ఇంతలో రాయ్పూర్ కాంగ్రెస్ ప్లీనరీలో తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలోని పార్టీ నాయకులకు మింగుడు పడటం లేదు. వాస్తవానికి రేవంత్రెడ్డి పీసీసీ చీఫ్గా వచ్చాక.. ఆయనతో చాలా మంది సీనియర్లకు పడటం లేదు. రేవంత్ను వ్యతిరేకించేవాళ్లంతా AICCలో పదవులు ఆశిస్తున్నారు. హైకమాండ్ మూడ్ కూడా అలాగే ఉందనే చర్చ […]
Off The Record: రెండు దశాబ్దాలపాటు వైద్యుడిగా సేవలందించి.. ప్రస్తుతం అలంపూర్ ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ అబ్రహం.. 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. నియోజకవర్గాల పునర్విభజనలో అలంపూర్ సీటు SCలకు రిజర్వ్డ్ కావడంతో కాంగ్రెస్ నుంచి గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అప్పటి సీఎం రాజశేఖర్రెడ్డితో ఉన్న పరిచయాలు ఎన్నికల్లో గెలిచేందుకు ఉపయోగపడ్డాయి. తర్వాత టీడీపీలోకి వెళ్లి పోటీ చేశారు. 2018 ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి పోటీ చేసి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు. అలంపూర్లో ఈస్థాయిలో […]
Ponguleti Srinivas Reddy: రాజకీయంగా వచ్చే పదవులు ఎవరికి శాశ్వతంగా ఉండవని.. ప్రజల్లో ప్రేమ అభిమానాలు ఉంటే పదవులు వాటి అంతటికి అవే వస్తాయన్నారు ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. శనివారం చండ్రుగొండ మండల కేంద్రంలో తన క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ… 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను ఇప్పటివరకు ఎందుకు నెరవేర్చలేదని సూటిగా ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి, సొంత జాగా ఉన్నవారికి […]