Off The Record: బీజేపీతో పొత్తు విషయంలో టీడీపీకి క్లారిటీ వచ్చేసిందా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఏపీలో ఏయే పార్టీలు కలిసి ఈసారి ఎన్నికలకు వెళ్తాయి? 2014లాగే టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కడతాయా? లేక 2019 ఎన్నికల సీన్ రిపీట్ అవుతుందా..? అదీ ఇదీ కాకుండా..కొత్త కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా అంటే…కొత్త కాంబినేషన్ దిశగానే అడుగులు పడుతున్నట్టు చెబుతున్నాయి జరుగుతున్న పరిణామాలు. పొత్తుల విషయంలో మెల్లిగా మబ్బులు వీడుతున్నందున స్పష్టమైన దృశ్యం కనిపిస్తోందంటున్నారు కొందరు టీడీపీ సీనియర్ లీడర్స్. బీజేపీని పక్కనపెట్టేసి… టీడీపీ-జనసేన కలిసిలకు వెళ్లడం దాదాపు ఖాయమన్నది అంతర్గతంగా వాళ్ళు చెబుతున్న మాట. టీడీపీతో పొత్తు దిశగా కాషాయ పార్టీని ఒప్పించడానికి పవన్కళ్యాణ్ తీవ్రంగా ప్రయత్నించారు. దాన్ని బట్టి బీజేపీ కూడా టీడీపీ-జనసేన కూటమితో కలిసి వస్తుందని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్టే బీజేపీ నేతలు గతంలో మాదిరిగా కాకుండా.. పొత్తుల విషయాన్ని పార్టీ హైకమాండే చూసుకుంటుందని తేల్చేశారు. అయితే.. ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే… కమలనాథులు తమతో పొత్తుకు ఇష్టపడటంలేదని అర్ధమవుతోందని.. అలాంటప్పుడు వన్లైడ్ లవ్ ఎందుకన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లో బలంగా వ్యక్తం అవుతోంది.
ఇన్నాళ్ళు జరిగిన పరిణామాలు ఒక ఎత్తయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకేసారి రూ. 10 వేల కోట్లకు పైగా నిధులను వచ్చేలా కేంద్రం రెవెన్యూ డెఫిషిట్ ఇవ్వడంతో… తమకో క్లారిటీ వచ్చిందని అంటున్నారు టీడీపీలోని కొందరు. ఇప్పటికీ బీజేపీ వైసీపీకి అనుకూలంగానే వ్యవహరిస్తోందని, అలాంటప్పుడు మనం వగరు పోగొట్టుకోవడం ఎందుకని పార్టీ నాయకత్వం అనుకుంటున్నట్టు తెలిసింది. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని.. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న సమయంలో కూడా సక్రమంగా నిధులివ్వడానికి నానా తిప్పలు పెట్టారని, అలాంటిది ఇప్పుడు ఏ సంబంధం లేకుండా జగన్ సర్కార్కు ఎందుకు అంతలా ఆర్ధిక వెసులుబాట్లు కల్పిస్తున్నారని చర్చించుకుంటున్నారట టీడీపీ నేతలు. రెవెన్యూ డెఫిసిట్ రూపంలో ఏకంగా 10 వేల కోట్లు ఇవ్వడమంటే.. రాష్ట్ర ప్రభుత్వానికి.. తాను అమలు చేయాలనుకున్న పథకాలకు ఇబ్బంది లేకుండా బీజేపీ పెద్దలు జాగ్రత్తలు తీసుకోవడం తప్ప మరోటి కాదని, ఇదంతా చూస్తుంటే వైసీపీపై బీజేపీకి ప్రేమ ఏ మాత్రం తగ్గలేదని అర్ధమవుతోందని, అలాంటప్పుడు పొత్తు పేరుతో మనం వెంపర్లాడటం ఎందుకని టీడీపీలోని ఓ వర్గం అనుకుంటోందట. దాంతో పాటు అవినాష్ రెడ్డి విషయంలో జరుగుతున్న వ్యవహారాలను చూశాక ఆ రెండు పార్టీలు ఒకటేనన్న భావన బలపడుతోందని, ఇక మనం అడగడం ఎందుకని అనుకుంటున్నారట. అందుకే బీజేపీ మనతో పొత్తుకు రాదని డిసైడై అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలన్నది టీడీపీ ఇంటర్నల్ టాక్గా చెబుతున్నారు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
క్రమంగా క్లారిటీ వస్తున్నా… టీడీపీ అధినాయకత్వం మాత్రం ఇప్పటికీ ఆచితూచి వ్యవహరించాలనే అనుకుంటోందట. గతంలో జరిగిన తప్పులు మరోసారి జరక్కుండా జాగ్రత్త పడుతున్నట్టుగా కన్పిస్తోంది. అందుకే…పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి హాజరు కావాలని పార్టీ ఎంపీలను ఆదేశించింది టీడీపీ హైకమాండ్. చివరి నిమిషం వరకు బీజేపీ విషయంలో జాగ్రత్తగానే ఉండాలనుకుంటోంది టీడీపీ నాయకత్వం. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా… ఆ పార్టీ పొత్తుకు సిద్ధంగా లేకుంటే.. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా ఇప్పటి నుంచే చేసుకోవాలన్న కొందరు నేతల సూచనలను టీడీపీ అధినాయకత్వం పరిశీలిస్తోందట. బీజేపీతో పొత్తుల గురించి బహిరంగంగా మాట్లాడకున్నా.. లోలోపల మాత్రం అన్నింటికీ సిద్దమవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. బీజేపీని వదిలేసినా… జనసేన చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది టీడీపీ. ప్రస్తుతానికి ఆ పార్టీతో పొత్తు కచ్చితంగా ఉంటుందన్న క్లారిటీ ఉన్నా.. భవిష్యత్తులో పరిస్థితులు మారి జరగరానిది జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తోంది టీడీపీ హైకమాండ్ . కీడెంచి మేలెంచాలన్న సూత్రం ప్రకారం అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుటోందట తెలుగుదేశం అధినాయకత్వం.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!