Team India: 400 ప్లస్ స్కోర్తో మరో రికార్డు సాధించిన టీమిండియా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాడ్లను వెనక్కి నెట్టి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ జట్టు వన్డేల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. బుధవారం లక్నోలోని ఏకానా స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌట్ అయి కొండంత స్కోరును బోర్డుపై ఉంచింది. వన్డే క్రికెట్ చరిత్రలో భారత్ 400 ప్లస్ పరుగులు చేయడం ఇది ఎనిమిదో సారి. తద్వారా ఈ మైలురాయిని అత్యధిక సార్లు అందుకున్న జట్లుగా దక్షిణాఫ్రికాతో కలిసి భారత్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఇంగ్లాండ్ ఏడు సార్లు, ఆస్ట్రేలియా మూడు సార్లు, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు రెండేసి సార్లు ఈ ఘనత సాధించాయి.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేవలం 4 పరుగులకే అవుటయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ శుభ్మన్ గిల్, సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. రోహిత్ శర్మ పాత రోజులను గుర్తు చేస్తూ 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేసి హాఫ్ సెంచరీకి ముందు రషీద్ ఖాన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
Also Read
- Ilhan Omar: జాతి నిర్మూలనలో 8వ దశకు చేరింది.. భారత్పై అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు ఇల్హాన్ ఒమర్ సంచలన వ్యాఖ్యలు
- Guinness World Records Village: 80 ఏళ్లకైనా జుట్టు నల్లగానే.. ఆ రహస్యం ఏమిటి?
- Beach Shacks in AP: గోవా తరహాలో ఏపీ బీచ్లలో బార్లు.. మార్గదర్శకాలు జారీ
- Supreme Court: ‘సైబర్ నేరగాళ్లు పరాన్నజీవులు’’.. నిందితులు జైల్లో ఉండడమే ఉత్తమమన్న సూర్యకాంత్
రోహిత్ అవుటైన తర్వాత శుభ్మన్ గిల్, వికెట్ కీపర్ ఈషాన్ కిషన్ ఆఫ్ఘన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇద్దరూ పోటీ పడి సెంచరీలు బాదడమే కాకుండా మూడో వికెట్కు రికార్డు స్థాయిలో 224 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. వన్డేల్లో భారత్ తరఫున మూడో వికెట్కు ఇది నాలుగో అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. కెప్టెన్గా గిల్ తన మొదటి వన్డే సెంచరీని పూర్తి చేసుకుని, మొత్తం 110 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్లతో 154 పరుగులు చేశాడు. మరోవైపు ఈషాన్ కిషన్ వన్డేల్లో తన రెండో సెంచరీని నమోదు చేస్తూ 79 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 125 పరుగులు రాబట్టాడు. ఈ భారీ స్కోరుతో భారత్ వన్డేల్లో తన ఎనిమిదో అత్యధిక స్కోరును నమోదు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 8.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 56 పరుగులు చేసి పోరాడుతోంది.
తాజావార్తలు
-
Team India: 400 ప్లస్ స్కోర్తో మరో రికార్డు సాధించిన టీమిండియా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాడ్లను వెనక్కి నెట్టి..
-
Ilhan Omar: జాతి నిర్మూలనలో 8వ దశకు చేరింది.. భారత్పై అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు ఇల్హాన్ ఒమర్ సంచలన వ్యాఖ్యలు
-
Raghava Lawrence : ఆలు లేదు, చూలు లేదు.. పదవి పేరు డిప్యూటీ సీఎం!
-
Guinness World Records Village: 80 ఏళ్లకైనా జుట్టు నల్లగానే.. ఆ రహస్యం ఏమిటి?
-
Pizza Hut Success Story: అప్పులతో మొదలైన పిజ్జా బిజినెస్.. నేడు ఎన్ని వేల కోట్ల సామ్రాజ్యంగా ఎదిగిందో తెలుసా?
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!