Team India: 400 ప్లస్ స్కోర్తో మరో రికార్డు సాధించిన టీమిండియా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాడ్లను వెనక్కి నెట్టి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ జట్టు వన్డేల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. బుధవారం లక్నోలోని ఏకానా స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌట్ అయి కొండంత స్కోరును బోర్డుపై ఉంచింది. వన్డే క్రికెట్ చరిత్రలో భారత్ 400 ప్లస్ పరుగులు చేయడం ఇది ఎనిమిదో సారి. తద్వారా ఈ మైలురాయిని అత్యధిక సార్లు అందుకున్న జట్లుగా దక్షిణాఫ్రికాతో కలిసి భారత్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఇంగ్లాండ్ ఏడు సార్లు, ఆస్ట్రేలియా మూడు సార్లు, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు రెండేసి సార్లు ఈ ఘనత సాధించాయి.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేవలం 4 పరుగులకే అవుటయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ శుభ్మన్ గిల్, సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. రోహిత్ శర్మ పాత రోజులను గుర్తు చేస్తూ 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేసి హాఫ్ సెంచరీకి ముందు రషీద్ ఖాన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
Also Read
- Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
- Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
- Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
- Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
రోహిత్ అవుటైన తర్వాత శుభ్మన్ గిల్, వికెట్ కీపర్ ఈషాన్ కిషన్ ఆఫ్ఘన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇద్దరూ పోటీ పడి సెంచరీలు బాదడమే కాకుండా మూడో వికెట్కు రికార్డు స్థాయిలో 224 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. వన్డేల్లో భారత్ తరఫున మూడో వికెట్కు ఇది నాలుగో అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. కెప్టెన్గా గిల్ తన మొదటి వన్డే సెంచరీని పూర్తి చేసుకుని, మొత్తం 110 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్లతో 154 పరుగులు చేశాడు. మరోవైపు ఈషాన్ కిషన్ వన్డేల్లో తన రెండో సెంచరీని నమోదు చేస్తూ 79 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 125 పరుగులు రాబట్టాడు. ఈ భారీ స్కోరుతో భారత్ వన్డేల్లో తన ఎనిమిదో అత్యధిక స్కోరును నమోదు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 8.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 56 పరుగులు చేసి పోరాడుతోంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Once More: సీరియస్ నుంచి స్వీట్ రొమాన్స్కు… అర్జున్ దాస్ – అదితి శంకర్ ‘వన్స్ మోర్’ ట్రైలర్ బ్లాస్ట్!
-
Mega Hero’s : మెగా మేనల్లుడికి షాక్ ఇచ్చిన మెగాస్టార్.. బరిలో ఉంటాడా?
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!