Team India: 400 ప్లస్ స్కోర్తో మరో రికార్డు సాధించిన టీమిండియా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాడ్లను వెనక్కి నెట్టి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ జట్టు వన్డేల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. బుధవారం లక్నోలోని ఏకానా స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌట్ అయి కొండంత స్కోరును బోర్డుపై ఉంచింది. వన్డే క్రికెట్ చరిత్రలో భారత్ 400 ప్లస్ పరుగులు చేయడం ఇది ఎనిమిదో సారి. తద్వారా ఈ మైలురాయిని అత్యధిక సార్లు అందుకున్న జట్లుగా దక్షిణాఫ్రికాతో కలిసి భారత్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఇంగ్లాండ్ ఏడు సార్లు, ఆస్ట్రేలియా మూడు సార్లు, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు రెండేసి సార్లు ఈ ఘనత సాధించాయి.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేవలం 4 పరుగులకే అవుటయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ శుభ్మన్ గిల్, సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. రోహిత్ శర్మ పాత రోజులను గుర్తు చేస్తూ 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేసి హాఫ్ సెంచరీకి ముందు రషీద్ ఖాన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
Also Read
- 200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!
- Hyderabad: ప్రధాని మోడీ AI మార్ఫింగ్ వీడియో.. మెటా హెడ్పై కేసు నమోదు..
- 505Km రేంజ్, AI క్యాబిన్, 25 స్పీకర్లతో ఫ్యామిలీల కోసం Xiaomi SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలు లాంచ్..!
- Maharashtra: టీమ్లో సెలెక్ట్ చేయలేదని క్రికెటర్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే?
రోహిత్ అవుటైన తర్వాత శుభ్మన్ గిల్, వికెట్ కీపర్ ఈషాన్ కిషన్ ఆఫ్ఘన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇద్దరూ పోటీ పడి సెంచరీలు బాదడమే కాకుండా మూడో వికెట్కు రికార్డు స్థాయిలో 224 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. వన్డేల్లో భారత్ తరఫున మూడో వికెట్కు ఇది నాలుగో అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. కెప్టెన్గా గిల్ తన మొదటి వన్డే సెంచరీని పూర్తి చేసుకుని, మొత్తం 110 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్లతో 154 పరుగులు చేశాడు. మరోవైపు ఈషాన్ కిషన్ వన్డేల్లో తన రెండో సెంచరీని నమోదు చేస్తూ 79 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 125 పరుగులు రాబట్టాడు. ఈ భారీ స్కోరుతో భారత్ వన్డేల్లో తన ఎనిమిదో అత్యధిక స్కోరును నమోదు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 8.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 56 పరుగులు చేసి పోరాడుతోంది.
తాజావార్తలు
-
200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!
-
Hyderabad: ప్రధాని మోడీ AI మార్ఫింగ్ వీడియో.. మెటా హెడ్పై కేసు నమోదు..
-
505Km రేంజ్, AI క్యాబిన్, 25 స్పీకర్లతో ఫ్యామిలీల కోసం Xiaomi SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలు లాంచ్..!
-
Trump: అమెరికాలో చదివే భారతీయ విద్యార్థులకు భారీ షాక్?.. ట్రంప్ సర్కార్ పరిశీలనలో $100,000 OPT ఫీజు
-
World Cup 2027: వరల్డ్ కప్లో అతడు ఉండాల్సిందే.. లేదంటే టీమిండియాకు కప్పు కష్టమే!
ట్రెండింగ్
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!
-
కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్ప్లే, Dimensity 8300 చిప్తో ASUS Pad (T3201) భారత్లో లాంచ్..!
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!