Off The Record: డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కీలక నియోజకవర్గం కొత్తపేట. ఇక్కడ తెలుగుదేశం, జనసేన పార్టీలకు సొంత అన్నదమ్ములే ఇంఛార్జీలు. వారే మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందం.. బండారు శ్రీనివాస్. ఇద్దరికీ అస్సలు పడటం లేదు. ఒక చిన్న వివాదం అపోహలతో పెరిగి పెద్దదై పరస్పరం పోటీకి దిగే స్థాయికి చేరింది. 2019 ఎన్నికల్లో ఇద్దరూ అదే చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి సత్యానందం.. జనసేన నుంచి శ్రీనివాసరావు బరిలో ఉండాలని చూస్తున్నారు. […]
Off The Record: నోముల భగత్.. ఎంసీ కోటిరెడ్డి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన నాయకులు. ఇద్దరూ కలిసి ఉన్నట్టు కనిపించినా.. చాలా విషయాల్లో ఇద్దరి మధ్య చాలా గ్యాప్ ఉంది. సీనియర్ రాజకీయ వేత్త నోముల నర్సింహయ్య 2018లో నాగార్జున సాగర్ నుంచి అధికారపార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన హఠాన్మరణంతో వచ్చిన ఉపఎన్నికల్లో నర్సింహయ్య కుమారుడు భగత్ ఎమ్మెల్యేగా గెలిచారు. వాస్తవానికి ఉపఎన్నికలోనే ఎంసీ కోటిరెడ్డి టికెట్ ఆశించారు. కానీ.. పార్టీ పెద్దల […]
వైఎస్సార్ సెంటిమెంట్ లాగానే.. సీతక్క నియోజకవర్గం నుంచే యాత్ర ప్రారంభించా.. రాహుల్ గాంధీ సందేశాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చానని, హాత్ సే హాత్ జోడో యాత్రలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. 20 శాతం మైనార్టీలు, 80శాతం మెజార్టీలను విభజించి పాలించిన విధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. విభజించు పాలించు విధానంతో దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న బీజేపీ ప్రయత్నాన్ని.. ప్రజలకు చాటి చెప్పేలాగా రాహుల్ గాంధీ యాత్ర చేశారన్నారు. రాహుల్ గాంధీ […]
Food Order Via WhatsApp: రైల్వే ప్రయాణికులు మరో గుడ్న్యూస్.. రైలు ప్రయాణీకులు త్వరలో వాట్సాప్ నంబర్ ద్వారా తమకు నచ్చిన, ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేసుకునే వెసులుబాటు రానుంది.. ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ).. ఇంటరాక్టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఎనేబుల్డ్ చాట్బోట్ను అందుబాటులోకి తెస్తున్నది. ఈ చాట్బోట్పై ప్రయాణికులు ఈ-కేటరింగ్, మీల్స్ బుకింగ్ కోసం చాటింగ్ చేయొచ్చు. ఇప్పటికే కొన్ని నిర్దిష్ట రూట్లలో ఐఆర్సీటీసీ.. +91 8750001323 ఫోన్ నంబర్పై […]
Off The Record: యాత్ర… ఫర్ ది చేంజ్.. అంటూ రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టారు. మేడారం సమ్మక్క సారలమ్మ నుండి యాత్ర మొదలైంది. హాత్ సే హాత్ జొడో యాత్ర పేరుతో… ఐదు నెలలపాటు తిరగాలని స్కెచ్ వేశారు రేవంత్. దీనికి కొందరు సీనియర్లు అభ్యంతరం తెలిపారు. హాత్ సే హాత్ జోడో కాన్సెప్ట్ వేరు.. రేవంత్ యాత్ర వేరు అని AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్రావు థాక్రే ముందే చెప్పేశారు AICC కార్యక్రమాల […]
Viral Video: డబ్బు కొన్నిసార్లు మనిషిలో ఎక్కడలేని అహంకారం పెంచుతుంది.. బిలియనీర్లు అయినా.. కొందరు సాటి మనిషిని మనిషిగా ప్రేమిస్తారు, గౌరవిస్తారు.. కొందరు మాత్రం డబ్బు మదంతో విర్రవీగుతారు.. అలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారిపోయింది.. ఆ వీడియో ప్రకారం.. మెర్సిడెజ్ బెంజ్కారులో వచ్చిన ఓ వ్యక్తి పెట్రోల్ బంక్కు వెళ్లాడు.. తన కారులో ఇంధనం పోయించుకున్నాడు.. ఆ తర్వాత బంక్లో ఉన్న సదరు మహిళా.. కారు ఓనర్ దగ్గరకు వెళ్లి […]
Telegram New Features: స్మార్ట్ ఫోన్ ఉంటే వాట్సాప్ ఉండాల్సిందే అనేలా కోట్లాది మంది అభిమాన్ని పొందింది వాట్సాప్.. ఇక, ఎప్పటి కప్పుడు కొత్త కొత్త ఫీచర్స్తో తన కస్టమర్లను ఆకట్టుకుంటూనే ఉంది.. ఈ సోషల్ మీడియా దిగ్గజం.. మరోవైపు.. టెలిగ్రామ్ కూడా సత్తా చాటేందుకు సిద్ధమైంది.. వాట్సాప్కు చెక్ పెట్టేలా సరికొత్త ఫీచర్స్ను కస్టమర్లను అందుబాటులోకి తెచ్చింది.. కొత్త అప్డేట్స్ ఎల్లప్పుడూ యాప్స్కు బూస్టింగ్నిచ్చే అంశాలేనని భావిస్తోంది టెలిగ్రామ్. ఇందులో భాగంగా వాట్సాప్ పోటీని తట్టుకునేందుకు […]
Love Marriage: ప్రేమ ఎప్పుడు, ఎవరిపై, ఎలా పుడుతుందో చెప్పలేం అంటారు.. ఇలా ఇప్పటికే రాష్ట్రాలు, దేశాలు, ఖండాలు దాటి.. అసలు ఎల్లలు లేకుండా పెళ్లిళ్లు చేసుకున్న జంటలు ఎన్నో ఉన్నాయి.. విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లి, ఉద్యోగాలు చేస్తూ.. ప్రేమలో పడి ఆ తర్వాత ఆ ప్రేమను పెళ్లి పీటల వరకు నడిపించిన ప్రేమికులు ఎంతో మంది ఉన్నారు.. తాజాగా, ఆదిలాబాద్ అబ్బాయి.. మయన్మార్ అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు.. ఈ పెళ్లితో ప్రేమకు ఎల్లలు […]
Polavaram Hydro Power Project: పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటు ఆ ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్న హైడ్రో పవర్ ప్రాజెక్టుపై కూడా కేంద్రం క్లారిటీ వచ్చింది.. పోలవరం ప్రాజెక్టులో భాగంగా 5338 కోట్ల వ్యయంతో చేపట్టిన 960 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం 2026 జనవరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంతో ఏపీ జెన్కో ఉందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు.. ఇవాళ రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ […]
Polavaram Project: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేసింది కేంద్రం.. పోలవరం ప్రాజెక్టును మార్చి 2024 కల్లా పూర్తి చేయాలన్నది లక్ష్యంగా ప్రకటించారు కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు.. దీని కోసం జూన్ 2024 కల్లా డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ పూర్తి చేయాలన ఆదేశాలు జారీ చేశారు.. అయితే, గోదావరి నదికి ఇటీవల వచ్చిన వరదల కారణంగా కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు.. తెలుగు దేశం […]